ఎలక్షన్ల ముందు ఏ పార్టీ గాలి వీస్తోందో కరెక్టుగా గెస్ చేసి ఆ పార్టీలోకి జంప్ చేసే గంటా శ్రీనివాసరావు గత ఎన్నికల్లో మాత్రం టీడీపీలో కంటిన్యూ అయి విపక్షంలో కూర్చున్నారు.
ఫర్లేదులో ఎలక్షన్ల తరువాతైనా పార్టీ మారి అధికారిపక్షంలో చేరి మంత్రి పదవి కొట్టేయాలనుకున్నా ఆ హామీ దొరక్కపోవడంతో ఫిరాయింపు ప్లాన్ కాస్త పక్కనపెట్టేశారు.
ఒకరకంగా చెప్పాలంటే పార్టీలు మారి పవర్ చేతిలో ఉంచుకునే గంటా ఎత్తుగడలకు వైసీపీ చెక్ పెట్టిందనే చెప్పాలి. గతంలో ఓసారి, తాజాగా మరోసారి వైసీపీలో చేరాలని ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు ఫలించక ఇప్పుడు జనసేనతోనూ టచ్లోకి వెళ్లారట. అదే సమయంలో బీజేపీతోనూ మంతనాలు చేస్తున్నారని వినిపిస్తోంది.
మరోవైపు టీడీపీతో మాత్రం ఆయన ఏమాత్రం టచ్లో లేకపోయినా ఆ పార్టీ ఆయన్ను పక్కన పెట్టే ధైర్యం చేయలేకపోతోంది. కారణం… గంటాకు చాలామంది కాపు నేతలతో మంచి సంబంధాలుండడం… అనేక నియోజకవర్గాలలో ఆయన తెర వెనుక రాజకీయాలు చేయగలిగే స్థాయిలో ఉండడం.. అన్నిటికీ మించి టీడీపీకి ఆర్థిక దన్నుగా ఉండే మాజీ మంత్రి పి.నారాయణకు వియ్యంకుడు కావడం.
రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న గంటా శ్రీనివాసరావు మొదట టీడీపీ నుంచే ఎన్నికల్లో గెలిచారు. ఆ తరువాత ప్రజారాజ్యంలో చేరి గెలిచారు. ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమైనప్పుడు మంత్రయ్యారు. ఆ తరువాత 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరి మంత్రయ్యారు. 2019లోనూ టీడీపీ నుంచి గెలిచినా పార్టీ అధికారంలోకి రాకపోవడంతో విపక్షంలో కూర్చున్నారు. వైసీపీలో చేరడానికి సంకేతాలు పంపినా మంత్రి పదవి హామీ దొరకలేదు. దాంతో రాజీనామా చేసి వెళ్లాలనే యోచనతో విశాఖ స్టీలు ప్లాంటును కారణంగా చూపి రాజీనామా చేశారు. కానీ, దాన్ని స్పీకరు ఆమోదించకపోవడంతో గంటా ఇంకా టీడీపీలో ఉన్నట్లే.
పైగా 2019లో టీడీపీ నుంచి గెలిచిన అందరికీ టికెట్లు గ్యారంటీ అని చంద్రబాబు ప్రకటించడంతో టీడీపీలో ఆయన బెర్తు ఉన్నట్లే. దీంతో టెక్నికల్గా ఆ పార్టీలో ఉంటూనే మిగతా పార్టీలతో ఆయన బేరాలాడుతున్నారు. చివరికి ఎన్నికల నాటికి ఆయన ఏ పార్టీలో తేలుతారో వేచి చూడాల్సిందే.
This post was last modified on December 8, 2022 6:56 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…