Political News

యనమల కుటుంబానికి చంద్రబాబు షాక్ ఇవ్వనున్నారా

టీడీపీలో బిగ్ షాట్‌కు చంద్రబాబు షాక్ ఇవ్వనున్నట్లు వనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రి పదవులు సహా అన్నీ అనుభవించి.. అదే స్థాయిలో పార్టీ కోసం పాటుపడినా.. గత కొన్నేళ్లుగా మాత్రం పార్టీకి పెద్దగా ఉపయోగపడని యనమల రామకృష్ణుడిని చంద్రబాబు ఇక పక్కనపెట్టనున్నట్లు వినిపిస్తోంది.

ముఖ్యంగా యనమల తన సొంత నియోజకవర్గం తునిలో పోటీ చేయడానికి ఆసక్తి చూపకుండా ఎన్నికలతో సంబంధం లేకుండా రాజ్యసభను పదేపదే కోరుతుండడం… తునిలో యనమల సోదరుడు గెలవలేకపోతుండడంతో ఎన్నికల అవసరాన్ని ద‌ృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ఈసారి అక్కడ యనమల ఫ్యామిలీని పక్కన పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం.

తునిలో యనమల ఫ్యామిలీకి ఇక ఓట్లు పడవని.. వారిని బరిలో దించితే ఆ సీటు పోయినట్లేనని సర్వేలూ తేల్చడంతో చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఆ క్రమంలోనే తుని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్న రాజా అశోక్ బాబును టీడీపీలోకి తేనున్నట్లు టాక్. క్షత్రియులలో మంచి పాపులారిటీ ఉన్న రాజా అశోక్ బాబు ఇటీవల చంద్రబాబును కలిశారు కూడా.

గత రెండు పర్యాయాలుగా తునిలో వైసీపీ గెలుస్తోంది. అక్కడి నుంచి గెలిచిన దాడిశెట్టి రాజా రోజురోజుకూ పట్టుపెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన జగన్ కేబినెట్లో మంత్రిగానూ ఉండడం మరింత కలిసొచ్చిన అంశం కావడంతో ఆయన్ను ఓడించాలంటే యనమల ఫ్యామిలీ కాకుండా వేరే అభ్యర్థి అవసరమని చంద్రబాబు గుర్తించారు. ఆ క్రమంలోనే అశోక్ బాబు తెరపైకి వచ్చారు.

అశోక్ బాబు 2009లో తునిలో కాంగ్రెస్ నుంచి గెలిచారు. అయితే, 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడంతో ఆయన పోటీ చేయడం మానేసి యనమల కుటుంబానికి మద్దతిస్తూ వస్తున్నారు. వివాద రహితుడు కావడం… టీడీపీలో చేరనప్పటికీ స్థానిక టీడీపీ నేతలందరితో మంచి సంబంధాలు ఉండడం… నియోజకవర్గం అంతటా తెలిసిన వ్యక్తి కావడంతో ఆయన్ను ఈసారి బరిలో దించడమే సరైనదని చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.

Satya

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

2 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

3 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

3 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

3 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

4 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

6 hours ago