రాజకీయ నాయకులు ఏ వర్గానికి చెందిన కార్యక్రమంలో పాల్గొంటే ఆ వర్గాన్ని ఆకట్టుకునేందుకు వస్త్రధారణో, అలంకరణో మార్చుకోవడం మామూలే. అంటే… రంజాన్ సమయంలో ఇఫ్తార్ విందుకు వెళ్తే ముస్లిం టోపీ పెట్టుకోవడం.. యాదవులు, కురుమల సభలకు వెళ్తే గొంగళి కప్పుకోవడం, మత్స్యకారుల సభకు వెళ్తే భారీ చేప ఒకటి పట్టుకోవడం వంటివి చేస్తుంటారు.
అదంతా సింబాలిక్గా జరుగుతుంది. కానీ.. ఏపీ పొలిటీషియన్స్ మాత్రం ఏకంగా తమ కులాలనే మార్చేస్తున్నారు. గతంలో విజయసాయిరెడ్డి తాను రెడ్డి కాదు కాపు అని చెప్పారు… తాజాగా మరో వైసీపీ నేత, మంత్రి రోజా కూడా తాను రెడ్డి కాదు బీసీ అని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
విజయవాడలో వైసీపీ నిర్వహించనున్న బీసీ మహాసభకి సంబంధించిన పోస్టర్ను రోజా నగరిలోని తన క్యాంపు కార్యాలయంలో రోజా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తన భర్త సెల్వమణి బీసీ సామాజికవర్గానికి చెందినవారని, తాను బీసీ ఇంటి కోడలిని కాబట్టి తాను కూడా బీసీనే అని చెప్పారు.
బీసీలను టీడీపీ అధినేత చంద్రబాబు పట్టించుకోలేదని, కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని ఆమె విమర్శించారు. బీసీలను వెనుకబడినవారిగా కాకుండా… రాష్ట్రానికే వెన్నెముకగా గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. 139 బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత జగన్దని అన్నారు.
ఇదంతా ఎలా ఉన్నా రాజకీయాల కోసం ఏకంగా కులం కూడా మార్చి చెప్పడం రోజాకే చెల్లిందని అంటున్నారు విమర్శకులు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…