Political News

కేసీఆర్‌కు బీజేపీ చెక్‌.. ఈట‌ల‌కు బ్లూ ప్రింట్ ఇచ్చారా..?

రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌పై పైచేయి సాధించ‌డం ఒక‌ప్ప‌టి లెక్క‌. కానీ, ఇప్పుడు అస‌లు ప్ర‌త్య‌ర్థులే లేకుం డా చూసుకోవ‌డం ప్ర‌ధాన లెక్క‌గా రాజ‌కీయ పార్టీలు నిర్ణ‌యించుకున్నాయి. ఆదిశ‌గానే అడుగులు వేస్తు న్నాయి. ఇత‌ర రాష్ట్రాల్లో ప‌రిస్థితి ఎలా ఉన్న తెలంగాణ‌, ఏపీల్లో మాత్రం ప్ర‌త్య‌ర్థి పార్టీపై రాజ‌కీయ నేత‌లు ఇలాంటి రాజ‌కీయాలే చేస్తున్నాయి. తెలంగాణ విష‌యాన్ని తీసుకుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ అధికా రంలోకి రావాల‌ని బీజేపీ స్కెచ్ సిద్ధం చేసుకుంది.

సీఎం కేసీఆర్ వంటిబ‌ల‌మైన నాయ‌కుడిని ఓడించ‌డం ద్వారా బీజేపీ పుంజుకునే వ్యూహానికి రెడీ అయిం ది. ఇక‌, ఈ పార్టీ అనుకున్న‌దే త‌డువుగా.. కేసీఆర్‌ను ఓడించేందుకు నాయ‌కుడు దొర‌కాలి క‌దా! అంటా రా? అది కూడా జ‌రిగిపోయింది. తెలంగాణ కేసీఆర్ బాధితుడిని అని చెప్పుకొనే మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ సీఎం పై పోటీ చేసేందుకు సిద్ధంగానే ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ను ఓడించ‌డ‌మే ధ్యేయంగా రాజేంద‌ర్ పావులు క‌దుపుతున్నారు.

ఈయ‌న దూకుడును అర్ధం చేసుకున్న బీజేపీ.. పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే ప‌నిపూర్తి చేసుకోవ‌చ్చ‌ని నిర్ణ‌యిం చుకుందో ఏమో.. వెంట‌నే ఈట‌ల‌ను ఢిల్లీకి పిలిచి.. దిశానిర్దేశం చేసి బ్లూ ప్రింట్ కూడా ఇచ్చింద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని కొంద‌రు.. కాదు.. ఈ సారి త‌న నియోజ‌క‌వ‌ర్గం మార్చుకుంటార‌ని మ‌రికొంద‌రు అంటున్నారు.

స‌రే.. కేసీఆర్ ఎక్క‌డ నుంచి పోటీ చేసినా.. ఆయ‌న‌ను ఓడించి తీరుతాన‌ని ఈట‌ల పంతంతో ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయన గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో త‌ర‌చుగా ప‌ర్య‌టిస్తున్నారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే,ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను ఎలా న‌మ్మించాలి.. వారి ఓట్లు ఎలా పొందాలి? అనే విష‌యాల‌పైక‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసిన ఈట‌ల‌.. త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని వారికి వివ‌రించాలని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

పార్టీకి.. రాష్ట్రానికి తాను ఎంతో సేవ చేశాన‌ని.. అయినాకేసీఆర్ త‌న‌కు వెన్నుపోటు పొడిచారంటూ ఆయ‌న ప్ర‌చారం చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. మొత్తంగా చూస్తే..కేసీఆర్‌ను ఓడించేందుకు ఈట‌ల రెడీ అయినా.. ఇది స‌క్సెస్ కావాలంటే బ‌లంగానే పోరాడాల్సి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Satya

Recent Posts

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

2 hours ago

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

3 hours ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

4 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

5 hours ago

సాయికృష్ణ కుటుంబానికి చంద్రబాబు భరోసా

విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…

5 hours ago

జాన్వీ కపూర్ దురదృష్టం అలా ఉంది

పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…

6 hours ago