గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ హవానే కొనసాగనుందా? తిరిగి అదికార పీఠంపై కమల వికాసం జరగనుందా? అంటే.. ఔననే అంటున్నారు ఎగ్జిల్ పోల్స్ నిర్వాహకులు తాజాగా సోమవారం రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన గంటలోనే ఇక్కడ ఎవరు పాగా వేస్తున్నారనే విషయంపై ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి.
ఎగ్జిట్ పోల్ నిర్వహించిన మెజార్టీ సంస్థల అంచనాల ప్రకారం.. గుజరాత్లో బీజేపీ మరోసారి అధికారంలోకి రానుంది. ప్రజలు ఆపార్టీవైపే నిలబడి నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ‘పీపుల్స్ పల్స్’ సర్వే ప్రకారం 182 స్థానాలకు బీజేపీ 125 నుంచి 143 సీట్లు గెల్చుకుంటుందని వెల్లడైంది. కాంగ్రెస్కు 30 నుంచి 48 స్థానాలు, ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ.. 3 నుంచి 7 సీట్లలో విజయం సాధిస్తాయని పేర్కొంది.
‘ఔట్ ఆఫ్ ద బాక్స్’ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ 130 నుంచి 145 సీట్లు గెల్చుకోనుంది. కాంగ్రెస్ 25 నుంచి 35 సీట్లు, ఆప్ 5 నుంచి 7 సీట్లలో విజయం సాధిస్తాయని వెల్లడైంది.
‘ఆత్మసాక్షి’ సర్వే ప్రకారం బీజేపీకి 98 నుంచి 110 సీట్లు వస్తాయని తేలగా.. కాంగ్రెస్కు 66 నుంచి 71 స్థానాలు, ఆప్కు 9 నుంచి 14 సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది.
‘న్యూస్ ఎక్స్ సర్వే’ ప్రకారం బీజేపీ.. 117 నుంచి 140 సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది. ఇక, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్.. 34 నుంచి 51 చోట్ల, ఆప్ 6 నుంచి 13 చోట్ల పట్టు పెంచుకునే అవకాశం ఉంది.
రిపబ్లిక్ టీవీ సర్వే ప్రకారం బీజేపీకి 128-148 సీట్లు, కాంగ్రెస్ 30-42 స్తానాలు, ఆప్ 2-10 సీట్లలో గెలుపు గుర్రం ఎక్కనున్నాయి.
స్టార్ హీరో హీరోయిన్లు నటించకపోయినా.. పేరున్న దర్శకుడు తీయకపోయినా.. స్టన్నింగ్ విజువల్స్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి అంచనాలు పెంచిన సినిమా..…
తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద కమర్షియల్ హీరోగా ఎదిగిన ఘనత మెగాస్టార్ చిరంజీవి సొంతం. 90వ దశకంలో జగదేక…
దర్శకుడు లారెన్స్ రాఘవేంద్ర హీరోగా ఆయన డైరెక్షన్లోనే రూపొందుతున్న కాంచన 4 షూటింగ్ కీలక దశకు చేరుకుంది. ఇందులో ముఖ్యమైన…
పెద్ది విషయంలో ప్రీ రిలీజ్ నుంచి పోస్ట్ రిలీజ్ దాకా జరుగుతున్న ఒక పొరపాటు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు…
జూలై 3 నాగబంధం విడుదల కానుంది. కళ్యాణ్ రామ్ డెవిల్ తీసిన నిర్మాత కం దర్శకుడు అభిషేక్ నామా మీద…
జూన్ సగం అయిపోయింది. మా ఇంటి బంగారం లాంటి నోటెడ్ మూవీస్ తో పాటు దీవానా లాంటివి అంతో ఇంతో…