Political News

గుజ‌రాత్ పీఠంపై క‌మ‌ల వికాసం.. ఎగ్జిట్ పోల్స్ ఇవే

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హ‌వానే కొన‌సాగ‌నుందా? తిరిగి అదికార పీఠంపై క‌మ‌ల వికాసం జ‌ర‌గ‌నుందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ఎగ్జిల్ పోల్స్ నిర్వాహ‌కులు తాజాగా సోమ‌వారం రెండో విడ‌త అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన గంట‌లోనే ఇక్క‌డ ఎవ‌రు పాగా వేస్తున్నార‌నే విష‌యంపై ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి.

ఎగ్జిట్ పోల్ నిర్వ‌హించిన‌ మెజార్టీ సంస్థల అంచనాల ప్రకారం.. గుజరాత్‌లో బీజేపీ మ‌రోసారి అధికారంలోకి రానుంది. ప్ర‌జ‌లు ఆపార్టీవైపే నిల‌బ‌డి న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. ‘పీపుల్స్‌ పల్స్‌’ సర్వే ప్రకారం 182 స్థానాలకు బీజేపీ 125 నుంచి 143 సీట్లు గెల్చుకుంటుందని వెల్లడైంది. కాంగ్రెస్‌కు 30 నుంచి 48 స్థానాలు, ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ.. 3 నుంచి 7 సీట్లలో విజయం సాధిస్తాయని పేర్కొంది.

‘ఔట్‌ ఆఫ్‌ ద బాక్స్’ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం బీజేపీ 130 నుంచి 145 సీట్లు గెల్చుకోనుంది. కాంగ్రెస్‌ 25 నుంచి 35 సీట్లు, ఆప్ 5 నుంచి 7 సీట్లలో విజయం సాధిస్తాయని వెల్లడైంది.

‘ఆత్మసాక్షి’ సర్వే ప్రకారం బీజేపీకి 98 నుంచి 110 సీట్లు వస్తాయని తేలగా.. కాంగ్రెస్‌కు 66 నుంచి 71 స్థానాలు, ఆప్‌కు 9 నుంచి 14 సీట్లు ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది.

‘న్యూస్‌ ఎక్స్‌ సర్వే’ ప్రకారం బీజేపీ.. 117 నుంచి 140 సీట్లు ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది. ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌.. 34 నుంచి 51 చోట్ల, ఆప్‌ 6 నుంచి 13 చోట్ల ప‌ట్టు పెంచుకునే అవ‌కాశం ఉంది.

రిపబ్లిక్‌ టీవీ స‌ర్వే ప్ర‌కారం బీజేపీకి 128-148 సీట్లు, కాంగ్రెస్‌ 30-42 స్తానాలు, ఆప్‌ 2-10 సీట్ల‌లో గెలుపు గుర్రం ఎక్క‌నున్నాయి.

This post was last modified on December 5, 2022 8:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago