Political News

గుజ‌రాత్ పీఠంపై క‌మ‌ల వికాసం.. ఎగ్జిట్ పోల్స్ ఇవే

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హ‌వానే కొన‌సాగ‌నుందా? తిరిగి అదికార పీఠంపై క‌మ‌ల వికాసం జ‌ర‌గ‌నుందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ఎగ్జిల్ పోల్స్ నిర్వాహ‌కులు తాజాగా సోమ‌వారం రెండో విడ‌త అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన గంట‌లోనే ఇక్క‌డ ఎవ‌రు పాగా వేస్తున్నార‌నే విష‌యంపై ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి.

ఎగ్జిట్ పోల్ నిర్వ‌హించిన‌ మెజార్టీ సంస్థల అంచనాల ప్రకారం.. గుజరాత్‌లో బీజేపీ మ‌రోసారి అధికారంలోకి రానుంది. ప్ర‌జ‌లు ఆపార్టీవైపే నిల‌బ‌డి న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. ‘పీపుల్స్‌ పల్స్‌’ సర్వే ప్రకారం 182 స్థానాలకు బీజేపీ 125 నుంచి 143 సీట్లు గెల్చుకుంటుందని వెల్లడైంది. కాంగ్రెస్‌కు 30 నుంచి 48 స్థానాలు, ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ.. 3 నుంచి 7 సీట్లలో విజయం సాధిస్తాయని పేర్కొంది.

‘ఔట్‌ ఆఫ్‌ ద బాక్స్’ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం బీజేపీ 130 నుంచి 145 సీట్లు గెల్చుకోనుంది. కాంగ్రెస్‌ 25 నుంచి 35 సీట్లు, ఆప్ 5 నుంచి 7 సీట్లలో విజయం సాధిస్తాయని వెల్లడైంది.

‘ఆత్మసాక్షి’ సర్వే ప్రకారం బీజేపీకి 98 నుంచి 110 సీట్లు వస్తాయని తేలగా.. కాంగ్రెస్‌కు 66 నుంచి 71 స్థానాలు, ఆప్‌కు 9 నుంచి 14 సీట్లు ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది.

‘న్యూస్‌ ఎక్స్‌ సర్వే’ ప్రకారం బీజేపీ.. 117 నుంచి 140 సీట్లు ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది. ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌.. 34 నుంచి 51 చోట్ల, ఆప్‌ 6 నుంచి 13 చోట్ల ప‌ట్టు పెంచుకునే అవ‌కాశం ఉంది.

రిపబ్లిక్‌ టీవీ స‌ర్వే ప్ర‌కారం బీజేపీకి 128-148 సీట్లు, కాంగ్రెస్‌ 30-42 స్తానాలు, ఆప్‌ 2-10 సీట్ల‌లో గెలుపు గుర్రం ఎక్క‌నున్నాయి.

This post was last modified on December 5, 2022 8:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

42 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago