ఏపీ అధికార పార్టీ వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావించిన రాయలసీమ గర్జన సభ సక్సెస్ అయిందా.. ఫెయిల్ అయిందా.. అనే విషయాలను పక్కన పెడితే.. దీనిలో కొన్ని ఆసక్తికర పరిణామాలు అందునా వైసీపీ నేతలకు తల బొప్పికట్టే సంగతులు చోటు చేసుకున్నాయి. దీంతో వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయింది. భారీ ఎత్తున సభకు జనాలను తరలించినా వైసీపీ నేతలకు మనశ్శాంతి లేకుండా పోయింది. పాపం.. ఎన్నో సొమ్ములు ఖర్చు చేసి.. ప్రజలను ఈ సభకు తరలించారు.
కానీ, చివరకు సభకు వచ్చేసరికి జై జగన్.. జైజై జగన్.. జై వైసీపీ అని అనమని ముందుగానే క్లాస్ చెప్పినా.. ఎక్కడో తేడా కొట్టింది. సభలో జై బాబు, జై బాలయ్య, జై పవన్ కల్యాణ్ అంటూ విద్యార్ధులు నినాదాలు చేశారు. విద్యార్థుల నినాదాలు ఆపేందుకు వైసీపీ నేతలు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఒక దశలో వారిని నిలువరించేందుకు శత విధాల ప్రయత్నించారు. పోలీసులు కూడా విద్యార్థులను నిలువరించే ప్రయత్నం చేసినా.. ఆగితేనా? విద్యార్థులు కదా.. ఉడుకు రక్తం అలానే చేస్తుందని సరిపెట్టుకునే పరిస్తితి వచ్చింది.
విద్యార్థులు రాయలసీమ జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో గర్జన సభకు భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులు ఫ్లెక్సీలతో సభకు వెళుతూ జై బాబు, జై బాలయ్య, జై పవన్ కల్యాణ్ అంటూ నినాదాలు చేశారు. వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టి గర్జన సభలో రామలసీమ నినాదాలు చేయాలని వైసీపీ నేతలు సూచించిన నేపథ్యంలో విద్యార్థులు టీడీపీకి అనుకూలంగా నినాదాలు చేయడంతో సభ మొత్తం రసాబాసగా మారింది. పైన వేదికపై నాయకులు జై వైసీపీ అంటే.. కిందనున్న విద్యార్థులు మాత్రం జై టీడీపీ నినాదాలతో హోరెత్తించారు.
This post was last modified on December 5, 2022 7:48 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…