కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఒక విధంగా వ్యవహరిస్తుంటే.. రాష్ట్రంలోని కీలక నాయకుడు జీవీఎల్ నరసింహారావు మాత్రం తన రూటే సెపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇటీవల ఓ సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు బాగా జరిగాయని, కానీ, తాను ఆనాడు చూడలేక పోయానని అన్నారు. దీనికి కారణం.. అప్పట్లో కేంద్ర జల శక్తి మంత్రిగా నితిన్ గడ్కరీ ఉన్నారు.
అంటే.. ఒక రకంగా.. షెకావత్.. నాటి చంద్రబాబు సర్కారుకు యోగ్యతా పత్రం ఇచ్చారనే చెప్పాలి. ఇది జరిగి మూడు నెలలు కూడా కాలేదు. కీలకమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యల దరిమిలా.. వైసీపీ నాయకులు మౌనంగా ఉండిపోయారు. అయితే, ఇప్పుడు ఇదే బీజేపీకి చెందిన రాష్ట్ర నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు.. అదే చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేయడం.. “వాటీజ్ దిస్ బాస్!” అని నెటిజన్లతో అనిపించేలా చేసింది.
తాజాగా మరోసారి ఏపీలో పోలవరం ప్రాజెక్టు విషయం చర్చకు వచ్చింది. ఇటీవల ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లిన చంద్రబాబు.. గురువారం రాత్రి పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని కోరారు. అయితే, దీనికి అధికారులు అడ్డంకులు చెప్పడం.. ఆయన ధర్నా చేయడం ఇవన్నీ ఒకరకంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. రాజకీయంగా అదికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధానికి కూడా కారణమయ్యాయి. అయితే. ఈ విషయంలో జోక్యం చేసుకున్న జీవీఎల్ ఫక్తు వైసీపీ డ్యూటీ ఒప్పుకొన్నట్టుగా వ్యవహరించారని నెటిజన్లు అంటున్నారు.
“జీతం బీజేపీ నుంచి తీసుకుంటూ.. పని మాత్రం వైసీపీ దొడ్లో చేస్తున్నారా?” అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనికి కారణం.. చంద్రబాబు హయాంలో ఒక్క ప్రాజెక్టయినా కట్టారా? అని జీవీఎల్ ప్రశ్నించడమే. మరి పట్టిసీమ కట్టిందెవరు? అనేదానికి ఆయన దగ్గర సమాధానం లేదు. నదుల అనుసంధానం చేయాలని, చేసింది.. ఎవరు జీవీఎల్ దగ్గర సమాధానం దొరకదు. కానీ, చంద్రబాబుపై మాత్రం యాగీ చేయాలి.
ఆయనను బద్నాం చేయాలి.. ఇదే జీవీఎల్ డ్యూటీగా పెట్టుకున్నారా? అనేది నెటిజన్ల టాక్. పోనీ.. పోలవరంపై ఇంత ప్రేమ కురిపిస్తున్న జీవీఎల్.. తన పలుకుబడిని ఉపయోగించి ఒక బస్తా సిమెంటు తీసుకువచ్చారా? అనేది కూడా నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్నే. మొత్తానికి తాజాగా జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు ఆయనకే బూమరాంగ్ అవుతున్నాయి.
This post was last modified on December 4, 2022 9:56 pm
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…