Political News

బీజేపీ అలా.. జీవీఎల్ ఇలా.. వాటీజ్ దిస్ బాస్‌!!

కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు ఒక విధంగా వ్య‌వ‌హ‌రిస్తుంటే.. రాష్ట్రంలోని కీల‌క నాయ‌కుడు జీవీఎల్ న‌ర‌సింహారావు మాత్రం త‌న రూటే సెప‌రేటు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల ఓ సంద‌ర్భంగా కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ మాట్లాడుతూ.. చంద్ర‌బాబు హ‌యాంలో పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు బాగా జ‌రిగాయ‌ని, కానీ, తాను ఆనాడు చూడ‌లేక పోయాన‌ని అన్నారు. దీనికి కార‌ణం.. అప్ప‌ట్లో కేంద్ర జ‌ల శ‌క్తి మంత్రిగా నితిన్ గ‌డ్క‌రీ ఉన్నారు.

అంటే.. ఒక ర‌కంగా.. షెకావ‌త్‌.. నాటి చంద్ర‌బాబు స‌ర్కారుకు యోగ్య‌తా ప‌త్రం ఇచ్చార‌నే చెప్పాలి. ఇది జ‌రిగి మూడు నెల‌లు కూడా కాలేదు. కీల‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల ద‌రిమిలా.. వైసీపీ నాయ‌కులు మౌనంగా ఉండిపోయారు. అయితే, ఇప్పుడు ఇదే బీజేపీకి చెందిన రాష్ట్ర నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు.. అదే చంద్ర‌బాబుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం.. “వాటీజ్ దిస్ బాస్‌!” అని నెటిజ‌న్ల‌తో అనిపించేలా చేసింది.

తాజాగా మ‌రోసారి ఏపీలో పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇటీవ‌ల‌ ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన చంద్ర‌బాబు.. గురువారం రాత్రి పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శిస్తాన‌ని కోరారు. అయితే, దీనికి అధికారులు అడ్డంకులు చెప్ప‌డం.. ఆయ‌న ధ‌ర్నా చేయ‌డం ఇవ‌న్నీ ఒక‌ర‌కంగా తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారితీశాయి. రాజ‌కీయంగా అదికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య యుద్ధానికి కూడా కార‌ణ‌మ‌య్యాయి. అయితే. ఈ విష‌యంలో జోక్యం చేసుకున్న జీవీఎల్ ఫ‌క్తు వైసీపీ డ్యూటీ ఒప్పుకొన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించార‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

“జీతం బీజేపీ నుంచి తీసుకుంటూ.. ప‌ని మాత్రం వైసీపీ దొడ్లో చేస్తున్నారా?” అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. దీనికి కార‌ణం.. చంద్ర‌బాబు హ‌యాంలో ఒక్క ప్రాజెక్ట‌యినా క‌ట్టారా? అని జీవీఎల్ ప్ర‌శ్నించ‌డ‌మే. మ‌రి ప‌ట్టిసీమ క‌ట్టిందెవ‌రు? అనేదానికి ఆయ‌న ద‌గ్గ‌ర స‌మాధానం లేదు. న‌దుల అనుసంధానం చేయాల‌ని, చేసింది.. ఎవ‌రు జీవీఎల్ ద‌గ్గ‌ర స‌మాధానం దొర‌క‌దు. కానీ, చంద్ర‌బాబుపై మాత్రం యాగీ చేయాలి.

ఆయ‌న‌ను బ‌ద్నాం చేయాలి.. ఇదే జీవీఎల్ డ్యూటీగా పెట్టుకున్నారా? అనేది నెటిజ‌న్ల టాక్‌. పోనీ.. పోల‌వ‌రంపై ఇంత ప్రేమ కురిపిస్తున్న జీవీఎల్‌.. త‌న ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి ఒక బ‌స్తా సిమెంటు తీసుకువ‌చ్చారా? అనేది కూడా నెటిజ‌న్లు సంధిస్తున్న ప్ర‌శ్నే. మొత్తానికి తాజాగా జీవీఎల్ చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న‌కే బూమ‌రాంగ్ అవుతున్నాయి.

Satya

Recent Posts

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

18 minutes ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

27 minutes ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

5 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

11 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

14 hours ago