Political News

ఏపీ రాజ‌కీయాల్లో ‘వెంట్రుక’ లాగిజ‌మ్‌!

ఇటీవ‌ల కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయ నేత‌ల్లో ప్ర‌స్టేష‌న్ బాగా పెరిగిపోతోంది. విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసే స‌మ‌యంలో పార్టీల అధినేత‌ల మొద‌లు కింది స్థాయి చోటామోటా నాయ‌కుల వ‌ర‌కు కొన్ని సార్లు బూతు పురాణం అందుకుంటున్నారు. కొంత‌మంది నేత‌లైతే వారు మాట్లాడే భాష వినాలంటే చెవులు మూసుకోవాల్సి వ‌స్తోంది. అంత‌గా నేత‌లు త‌మ ప్ర‌త్య‌ర్థుల‌పైన మాట్లాడే స‌మ‌యంలో కంట్రోల్ త‌ప్పుతున్నారు. ఒక‌ప్పుడు ఒక చిన్న ప‌రుష ప‌ద‌జాలం అనాలంటే నాయ‌కులు చాలా సంకోచించేవారు. మ‌రీ ప్ర‌స్టేష‌న్ ఎక్కువైన సంద‌ర్భాల్లో చాలా అరుదుగా ఎక్క‌డైనా ఒక చిన్న మాట తూలేవారు. అది త‌రువాత రాజ‌కీయ ధుమారం రేపేది.

ఇప్పుడు తెలుగు రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా ఏపీ రాజ‌కీయాల్లో ట్రెండ్ మారిపోయింది. బూతుపుర‌ణాలు, అస‌భ్య ప‌ద‌జాలాల ప్ర‌యోగం స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయింది. ‘పీక‌లేరు’ అనే ప‌దం రాజ‌కీయ నాయ‌కుల‌కు ఇప్పుడొక ఊత‌ప‌దంలా మారిపోయింది. వైరి ప‌క్ష నేత‌ల‌నుద్దేశించి పార్టీల అధినేత‌లు ఏకంగా ‘వాళ్లు నా వెంట్రుక కూడా పీక‌లేరు’ అని చాలా సులభంగా యథాలాపంగా అనేస్తున్నారు. వై.ఎస్‌.జ‌గ‌న్‌, నారా చంద్ర‌బాబు నాయుడు, నారా లోకేష్‌, వైసీపీ మంత్రుల్లో కొడాలి నానీ లాంటి నేత‌లు, టీడీపీ నేతలు ఈ ప‌దాన్ని ప్ర‌స్టేష‌న్‌లో ఉప‌యోగించేస్తున్నారు.

గత ఏప్రిల్ నెల‌లో నంద్యాల‌లో జ‌రిగిన జ‌గ‌న‌న్న విద్యా దీవెన ప‌థ‌కం బ‌హిరంగ స‌భలో ఏపీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్ బ‌హిరంగ వేదికపై ప్ర‌తిప‌క్షాల‌నుద్దేశించి మాట్లాడుతూ వాళ్లు నా వెంట్రుక కూడా పీక‌లేరు అన్న మాట పెను దుమారం సృష్టించింది. దీనికి కౌంట‌ర్‌గా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న కుమారుడు నారా లోకేష్ లు కూడా ఇదే ప‌దాన్ని అందుకుని ప‌లు స‌భ‌ల్లో ఎదురు దాడి చేశారు. వైసీపీ వాళ్లు నా వెంట్రుక కూడా పీక‌లేర‌ని చిన‌బాబు దూకుడు పెంచారు. ఇక కిందిస్థాయి టీడీపీ, వైసీపీ నేత‌లు అయితే విమ‌ర్శ‌లు, తీవ్ర ప‌ద‌జాలాలు, దూష‌ణ‌ల ప‌ర్వంతో తెగ‌రెచ్చిపోతున్నారు.

టీడీపీలో బోండా ఉమా, బుద్దా వెంక‌న్న‌, గ్రీష్మ‌, వంగ‌ల‌పూడి అనిత లాంటి నాయ‌కులు వైసీపీలో కొడాలి నానీ, పేర్ని నాని, జోగి ర‌మేష్‌, దువ్వాడ శ్రీను త‌దిత‌ర నేత‌లంతా మ‌రింత ముందుకెళ్లి దూష‌ణ‌ల ప‌ర్వాల‌కు కూడా దిగుతున్నారు. దీంతో ఒక్కోసారి నాయ‌కులు భూతు పురాణం విన‌డానికే జ‌నాల‌కు జుగుప్స క‌లిగిస్తోంది. ప్రెస్‌మీట్ల‌లో వీరు బొచ్చుపీక‌లేరు, గూట్లే, బ‌చ్చా, లుచ్చా, నా కొడ‌కా లాంటి తిట్ల దండ‌కాలు ఏమాత్రం సంకోచం లేకుండా వ‌ల్లించేస్తుంటారు.

ఒక‌ప్పుడు వెంట్రుక పీక‌లేవు అంటే ప‌ర‌మ బూతు ప‌దంగా చూసేవారు. ఇప్పుడు రాజ‌కీయ నాయ‌కులు ఏ మాత్రం ఏవ‌గింపు లేకుండా ఈ తిట్టు ప‌దాన్ని య‌థేచ్ఛ‌గా వింటున్నారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కూడా వైసీపీ నేత‌ల‌పై విరుచుకుప‌డుతూ సంక‌ల్ప‌సిద్ధి కుంభ‌కోణంలో సీఐడీ పోలీసులు, పోలీసులు ఏం పీకుతున్నారు అంటూ ప్ర‌శ్నించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ నేత‌లు త‌క్కువేమీ తిన‌లేదు. అక్క‌డ కూడా ముఖ్య‌మంత్రి కేసీఆర్ నుంచీ అన్ని పార్టీల నాయ‌కులు తిట్ల దండ‌కం ఎత్తుకుంటుంటారు.

This post was last modified on December 6, 2022 11:16 am

Share

Recent Posts

జాన్విని మ‌ళ్లీ చూస్తామా?

బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయ‌డం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేట‌స్ సంపాదించాక‌, తెలుగులో…

5 hours ago

చివరి సినిమా చేదు జ్ఞాపకమే అయ్యింది

గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…

6 hours ago

వైసీపీ నాయకులకు సరైన భరోసా లేదా?

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై కేసులు కొన‌సాగుతున్నాయి. అనేక మంది నాయ‌కుల‌పై కేసులు న‌మోదై... ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లో ఉన్నాయి.…

6 hours ago

‘జగన్ వస్తున్నారా.. అయితే మూతే’

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…

7 hours ago

వైసీపీకి చెక్‌: మండలి వైస్ చైర్మన్‌పై కూటమి కీలక నిర్ణయం!

ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…

7 hours ago

గంజాయి బ్యాచ్ హద్దులు మీరుతుంది

హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…

7 hours ago