గత ఆదివారం జనతా కర్ఫ్యూ తర్వాత తెలంగాణలో ఈ నెల 31 వరకు టోటల్ లాక్ డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజులు లాక్ డౌన్ అమలు చేసింది. దీంతో జనాలు ఎక్కడిక్కడ ఆగిపోయారు. ఈ పరిస్థితి వస్తుందని ముందే తెలిస్తే సొంత ఊర్లకు వెళ్లిపోయేవాళ్లమే అని బాధ పడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాళ్లు ఈ విషయంలో ఆవేదనతో ఉన్నారు.
బయట హోటళ్లు, రెస్టారెంట్లుతో పాటు చిన్న చిన్న టిఫిన్ సెంటర్లూ బంద్ అయిపోవడంతో విద్యార్థులు, ఇంట్లో వంట చేసుకోలేని వాళ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. అమీర్ పేట, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో హాస్టళ్లలో ఉండే వాళ్లకు ఇబ్బందులు తప్పట్లేదు. ఇక్కడ కిక్కిరిసిన హాస్టళ్లలో కరోనా ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్న భయం మొదలైంది. దీంతో హాస్టళ్లు ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు.
ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తూ.. పోలీస్ స్టేషన్లో అనుమతి పత్రం తీసుకుని తమ ఊర్లకు వెళ్లిపోవచ్చని ఆదేశాలిచ్చింది. దీంతో ఒక్కసారిగా వేల మంది రోడ్ల మీదికి వచ్చేశారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ బయట పెద్ద ఎత్తున కుర్రాళ్లు గుమిగూడారు. అక్కడి నుంచి క్యూ మొదలుపెడితే కిలోమీటర్లు కిలోమీటర్లు జనం బారులు తీరారు. వీళ్లంతా ఒకరికొకరు అత్యంత సమీపంలో నిలబడ్డారు.
ఇలా వేల మంది ఒకచోట పోగవడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ప్రమాదమని తెలిసినా పోలీస్ స్టేషన్లో అనుమతి పత్రం నిబంధన ఎందుకు పెట్టారో ఏమిటో? ఈ షరతులేమీ లేకుండా పంపడమో.. దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేయడమో చేయాల్సింది. ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచన లేకుండా పెద్ద తప్పు చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వచ్చే వారం జూలై 30 శ్రీనివాస మంగాపురం విడుదలవుతోంది. హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తదాని రెగ్యులర్ గా ప్రమోషన్లలో…
కాపు ఉద్యమ నేత, సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభం విగ్రహం బెజవాడలో త్వరలోనే ఏర్పాటు కానుంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం…
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర…
నిజమే... యువత తిరగబడింది. రాజ్యం ఉలిక్కిపడింది. యువతలో ఆగ్రహావేశాలకు కారణంగా నిలిచిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి…
మూడేళ్ళ క్రితం బేబీ విడుదలై బ్లాక్ బస్టర్ సాధించాక అందరి అటెన్షన్ తీసుకున్న అమ్మాయి వైష్ణవి చైతన్య. అప్పటిదాకా చిన్న…
కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.…