గత ఆదివారం జనతా కర్ఫ్యూ తర్వాత తెలంగాణలో ఈ నెల 31 వరకు టోటల్ లాక్ డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజులు లాక్ డౌన్ అమలు చేసింది. దీంతో జనాలు ఎక్కడిక్కడ ఆగిపోయారు. ఈ పరిస్థితి వస్తుందని ముందే తెలిస్తే సొంత ఊర్లకు వెళ్లిపోయేవాళ్లమే అని బాధ పడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాళ్లు ఈ విషయంలో ఆవేదనతో ఉన్నారు.
బయట హోటళ్లు, రెస్టారెంట్లుతో పాటు చిన్న చిన్న టిఫిన్ సెంటర్లూ బంద్ అయిపోవడంతో విద్యార్థులు, ఇంట్లో వంట చేసుకోలేని వాళ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. అమీర్ పేట, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో హాస్టళ్లలో ఉండే వాళ్లకు ఇబ్బందులు తప్పట్లేదు. ఇక్కడ కిక్కిరిసిన హాస్టళ్లలో కరోనా ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్న భయం మొదలైంది. దీంతో హాస్టళ్లు ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు.
ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తూ.. పోలీస్ స్టేషన్లో అనుమతి పత్రం తీసుకుని తమ ఊర్లకు వెళ్లిపోవచ్చని ఆదేశాలిచ్చింది. దీంతో ఒక్కసారిగా వేల మంది రోడ్ల మీదికి వచ్చేశారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ బయట పెద్ద ఎత్తున కుర్రాళ్లు గుమిగూడారు. అక్కడి నుంచి క్యూ మొదలుపెడితే కిలోమీటర్లు కిలోమీటర్లు జనం బారులు తీరారు. వీళ్లంతా ఒకరికొకరు అత్యంత సమీపంలో నిలబడ్డారు.
ఇలా వేల మంది ఒకచోట పోగవడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ప్రమాదమని తెలిసినా పోలీస్ స్టేషన్లో అనుమతి పత్రం నిబంధన ఎందుకు పెట్టారో ఏమిటో? ఈ షరతులేమీ లేకుండా పంపడమో.. దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేయడమో చేయాల్సింది. ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచన లేకుండా పెద్ద తప్పు చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…