Political News

ఆయన మగతనంతో నాకు పనేంటి: షర్మిల

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కారు అద్దాలు ధ్వంసం చేయడం, బస్సుకు నిప్పు పెట్టడం వంటి ఘటనలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇక, కారులో షర్మిల కూర్చొని ఉండగానే ఆమె కారును క్రేన్ సాయంతో ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించడం, ఆ తర్వాత ట్రాఫిక్ కు ఆటంకం కలిగించారని కేసు పెట్టడం తెలంగాణలో రాజకీయ దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసైకి షర్మిల తాజాగా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.

గవర్నర్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల…గత 2 రోజులుగా జరిగిన ఘటనలను గవర్నర్‌ కు వివరించానని అన్నారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించకున్నా తనను అరెస్ట్ చేశారని, వాహనంలో ఉండగానే తీసుకువెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలను, నేతలను పోలీసులు కొట్టారని ఆరోపించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల కింద కేసు పెట్టి రిమాండ్ ఎలా అడగతారని ప్రశ్నించారు.

తాను పెద్ది సుదర్శన్ రెడ్డిని ఏమీ అనలేదని అన్నారు. అయినా, ఆయన మగతనంతో నాకేం పని అంటూ షర్మిల సంచలన కామెంట్లు చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి.. మగతనం ఆమె భార్య కు తెలుస్తుంది, నాకేమి అవసరం అంటూ ఫైర్ అయ్యారు. చెప్పుతో కొడతా అని ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నానని తెలిపారు. మంత్రి నిరంజన్ రెడ్డి తనను మరదలు అంటే దానికి బదులుగా తాను చెప్పుతో కొడతా అని దీటుగా జవాబిచ్చానని చెప్పారు. ఆయనంటే తప్పు లేదని, తానన్న మాటే తప్పా అని ప్రశ్నించారు. ఆయన కేసు పెడితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారని, తాను కేసు పెడితే మాత్రం ఫైల్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో ఇదేనా మహిళలకున్న గౌరవం అని నిలదీశారు. తాను ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డను అని, తాను కేసు పెడితేనే తీసుకోవడం లేదని, ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, టీఆర్ఎస్ నేతలపై సంచలన విమర్శలు గుప్పించిన షర్మిల…టీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని, దేశంలో కేసీఆర్ ది రిచెస్ట్ పొలిటికల్ ఫ్యామిలీ అని ఆరోపించారు.

తెలంగాణలో తాలిబన్ల మాదిరి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, టీఆర్ఎస్ వారంతా తాలిబన్లని ఆరోపించారు. తనకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అంటూ విమర్శించారు.

This post was last modified on December 1, 2022 10:16 pm

Share

Recent Posts

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

3 minutes ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

4 minutes ago

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

17 minutes ago

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

1 hour ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

1 hour ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

1 hour ago