ఆంధ్రప్రదేశ్ సీయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్ని వైసీపీ నేతలు ఘనంగా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 21న జగన్ పుట్టినరోజు. ఐతే.. ఈసారి ముందుగానే జగన్ అభిమానులు సంబరాలు జరుపుకోవటానికి కారణం ఉంది. ఈ పుట్టినరోజుతో జగన్ 51వ పడిలో పడుతున్నారు. అందుకే ముందుగానే జగనన్నన పుట్టినరోజు సంబరాలు ప్రారంభించారు వైసీపీ నాయకులు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు జరుగుతున్నాయి. ఆంధ్రాలోని ముఖ్య పట్టణాల్లో ఇప్పటికే పుట్టినరోజు సంబరాలు మొదలయ్యాయి. వైసీపీ నేతలు, జగన్ అభిమానులు ముందుండి ఈ వేడుకల్ని జరిపిస్తున్నారు. ముఖ్యంగా నగిరి ఎమ్మెల్యే రోజా జగన్న స్వర్ణోత్సవాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ వేడుకలకు రోజా సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు.
గుంటూరు, తిరుపతిలో జరిగిన జగనన్న స్వర్ణోత్సవ వేడుకల్లో రోజా పాల్గొన్నారు. స్టేజ్ పై డీజె స్టెప్పులు వేసి ఓ రేంజ్ లో దుమ్మురేపారు రోజా. ఆ డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఐతే ప్రతి పుట్టినరోజుకు ఓ అరుదైన గిఫ్ట్ ఇచ్చి జగన్ ను సర్ ప్రైజ్ చేస్తుంటారు రోజా. మరి ఈసారి రోజా ఏం ప్లాన్ చేశారు.. ? ఆ గిఫ్ట్ ఎలా ఉండబోతుంది.. ?
జగన్ ను జననేత అంటారు. అలాంటి జననేతకు ఎలాంటి గిఫ్ట్ ఇస్తే.. ఆనందపడతారో రోజాకు బాగా తెలుసు. అందుకే 2020లో జగన్ బర్త్ డేకి ఓ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఓ నిరుపేద అమ్మాయిన దత్తత తీసుకుని ఆమె యోగ క్షేమాలు మొత్తం తానే చూసుకుంటానని చెప్పారు రోజా. ఇక 2021 జగన్ పుట్టినరోజుకి మరో ఇంట్రెస్టింగ్ గిఫ్ట్ ఇచ్చారు రోజా. నగిరి నియోజకవర్గంలోని మీరాసాబ్ పాలెం అనే ముస్లిం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఆ గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చూసుకుంటానని ప్రామిస్ చేశారు రోజా. ఐతే.. ఈసారి రోజా ఎలాంటి గిఫ్ట్ ప్లాన్ చేశారు అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. జననేత 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న స్పెషల్ బర్త్ డే కాబట్టి, రోజా ఇవ్వబోతున్న గిఫ్ట్ కూడా అంతే స్పెషల్ గా ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారుఐతే.. తనదైన మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తూ, జగన్ మనసుకు ఆనందం కలిగించే గిఫ్ట్ ఇస్తుందన్నది మాత్రం వాస్తవం. ఆ గిఫ్ట్ ఏంటో తెలియాలంటే డిసెంబర్ 21 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.
స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో నటించినపుడు వారి ఇమేజ్కు తగ్గ పాత్రలు లేకపోతే.. అభిమానులు ఫీలవడం…
ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి.…
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…