Political News

ఉపాధ్యాయులు ఇక జగన్ ను ఓడించలేరు

ఏపీలో ఉపాధ్యాయులు కొన్నేళ్లుగా కోరుతున్న.. డిమాండ్ చేస్తున్న.. విన్న‌విస్తున్న.. కీల‌క‌మైన అంశానికి అనుకూలంగా ఏపీ స‌ర్కారు అడుగులు వేసింది. వారిని.. బోధ‌నేత‌ర ప‌నుల‌కు దూరంగా ఉంచాల‌ని నిర్ణ‌యించింది. అంటే.. ఇక‌పై.. రాష్ట్రంలో టీచ‌ర్లు.. కేవ‌లం పాఠాలు, పాఠ‌శాల‌లు, విద్యార్థులు, పుస్త‌కాల‌కే ప‌రిమితం కానున్నారు. సో.. ఇది మంచిదే. దేశంలోనే ఎప్ప‌టినుంచో ఉన్న ఈ డిమాండ్‌ను వైసీపీ స‌ర్కారు నెర‌వేర్చింద‌నే చెప్పాలి.

స్వామి కార్యం.. స్వ‌కార్యం కూడా..!

ఇక్క‌డే వైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. ఉపాధ్యాయుల‌కు మేలు చేస్తున్న‌ట్టు క‌నిపిస్తూనే.. మ‌రోవైపు.. త‌నకు కీల‌క‌మైన ఎన్నిక‌ల విధుల నుంచి వారిని ప‌క్కాగా త‌ప్పించేసింది. అంటే, రేపు ఏ ఎన్నికల్లోనైనా టీవర్లదే కీలక పాత్ర. ప్ర‌స్తుతం వారంతా స‌ర్కారుపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌. ఈ వ్యతిరేకతను త‌ప్పించేందుకు ఈ వ్యూహం ఉప‌యోగ‌ప‌డుతుంది. అసలు టీచర్లే లేకుండా ఎన్నికలు జరిగితే ఈ గోలే ఉండదు. అనే వ్యూహంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఏం జ‌రిగింది?
ఏపీలో ఉపాద్యాయులను బోధనేతర పనులకు దూరంగా ఉంచేలా వారి సర్వీసు రూల్స్‌కు ప్ర‌భుత్వం సవరణ చేయబోతోంది. బోధనేతర పనులు అంటే ఇక ఏ ఇతర పనినీ టీచర్లు చేయకూడదు. అప్పుడు సాధారణ పనులతో కీలకమైన ఎన్నికలు కూడా వారి నుంచి దూరమవుతాయి. నిజానికి ఓట్ల జాబితాల పరిశీలన నుంచి ఎన్నికల రోజు ఓటింగ్ వరకు వారే ఉంటారు. సార్వత్రిక ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా ఎన్నిక సజావుగా సాగేలా చూడటం వారి బాధ్యత. ప్రజలు వారి ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకునే ప్రక్రియలో టీచర్లే ప్రత్యక్ష సాక్షలుగా నిలుస్తారు.

అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ వర్గాలు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొం టున్నాయి. వారి డిమాండ్లు అటుంచి అసలు జీతాలు, సాధారణ ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో పొందడానికే నానా పాట్లు పడాల్సిన దుస్థితి ఏర్ప ఉంది. దీంతో ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక భావన వచ్చింది. అయితే అందులోనూ ఈ విషయంలో ఉపాధ్యాయులు మ‌రింత ఫైర్ అవుతున్నారు. అందుకే గతేడాది విజయవాడలో నిర్వహించిన వారీ ధర్నాలో ఉపాధ్యాయులే కీలక పాత్ర పోషించి, అది విజయవంతం అవ్వడానికి కారణమయ్యారు.

అనంతరం కొత్తగా ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత హాజరు పై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పటికే పలురకాల మొబైల్ యాప్లతో సతమతమవుతున్న టీచర్లకు ఇది మింగుడుపడలేదు. అనంతరం ముఖ ఆధారిత హాజరుపై ఉపాధ్యాయులు మౌనం వహించినా అసం తృప్తి తీవ్ర స్థాయిలో ఉంది. ఇవన్నీ గమనిస్తున్న ప్రభుత్వం ఎన్నికల్లో టీచర్లు వ్యతిరేకంగా ఉంటారనే అంచనాకు వచ్చినట్లు అర్థమవుతోంది. అందుకే వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కసరత్తు చేస్తోంది.

Satya

Recent Posts

వెంకీ మామ స్పీడు పెంచుతున్నారు

గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…

9 minutes ago

తెలంగాణ మా జాగీరే పవన్ కల్యాణ్: కేటీఆర్

తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…

2 hours ago

మాలలో మాస్ మహారాజ… కొత్తగా ఉందే

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…

2 hours ago

రెహమాన్ సత్తాకు ‘జెన్ జీ’ పరీక్ష

ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…

2 hours ago

ఆజ్ కీ షామ్… పెద్దికే నామ్

మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…

3 hours ago

విజయ్ vs అన్నామలై… అసలు సాధ్యమేనా?

తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…

4 hours ago