Political News

ఉపాధ్యాయులు ఇక జగన్ ను ఓడించలేరు

ఏపీలో ఉపాధ్యాయులు కొన్నేళ్లుగా కోరుతున్న.. డిమాండ్ చేస్తున్న.. విన్న‌విస్తున్న.. కీల‌క‌మైన అంశానికి అనుకూలంగా ఏపీ స‌ర్కారు అడుగులు వేసింది. వారిని.. బోధ‌నేత‌ర ప‌నుల‌కు దూరంగా ఉంచాల‌ని నిర్ణ‌యించింది. అంటే.. ఇక‌పై.. రాష్ట్రంలో టీచ‌ర్లు.. కేవ‌లం పాఠాలు, పాఠ‌శాల‌లు, విద్యార్థులు, పుస్త‌కాల‌కే ప‌రిమితం కానున్నారు. సో.. ఇది మంచిదే. దేశంలోనే ఎప్ప‌టినుంచో ఉన్న ఈ డిమాండ్‌ను వైసీపీ స‌ర్కారు నెర‌వేర్చింద‌నే చెప్పాలి.

స్వామి కార్యం.. స్వ‌కార్యం కూడా..!

ఇక్క‌డే వైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. ఉపాధ్యాయుల‌కు మేలు చేస్తున్న‌ట్టు క‌నిపిస్తూనే.. మ‌రోవైపు.. త‌నకు కీల‌క‌మైన ఎన్నిక‌ల విధుల నుంచి వారిని ప‌క్కాగా త‌ప్పించేసింది. అంటే, రేపు ఏ ఎన్నికల్లోనైనా టీవర్లదే కీలక పాత్ర. ప్ర‌స్తుతం వారంతా స‌ర్కారుపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌. ఈ వ్యతిరేకతను త‌ప్పించేందుకు ఈ వ్యూహం ఉప‌యోగ‌ప‌డుతుంది. అసలు టీచర్లే లేకుండా ఎన్నికలు జరిగితే ఈ గోలే ఉండదు. అనే వ్యూహంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఏం జ‌రిగింది?
ఏపీలో ఉపాద్యాయులను బోధనేతర పనులకు దూరంగా ఉంచేలా వారి సర్వీసు రూల్స్‌కు ప్ర‌భుత్వం సవరణ చేయబోతోంది. బోధనేతర పనులు అంటే ఇక ఏ ఇతర పనినీ టీచర్లు చేయకూడదు. అప్పుడు సాధారణ పనులతో కీలకమైన ఎన్నికలు కూడా వారి నుంచి దూరమవుతాయి. నిజానికి ఓట్ల జాబితాల పరిశీలన నుంచి ఎన్నికల రోజు ఓటింగ్ వరకు వారే ఉంటారు. సార్వత్రిక ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా ఎన్నిక సజావుగా సాగేలా చూడటం వారి బాధ్యత. ప్రజలు వారి ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకునే ప్రక్రియలో టీచర్లే ప్రత్యక్ష సాక్షలుగా నిలుస్తారు.

అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ వర్గాలు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొం టున్నాయి. వారి డిమాండ్లు అటుంచి అసలు జీతాలు, సాధారణ ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో పొందడానికే నానా పాట్లు పడాల్సిన దుస్థితి ఏర్ప ఉంది. దీంతో ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక భావన వచ్చింది. అయితే అందులోనూ ఈ విషయంలో ఉపాధ్యాయులు మ‌రింత ఫైర్ అవుతున్నారు. అందుకే గతేడాది విజయవాడలో నిర్వహించిన వారీ ధర్నాలో ఉపాధ్యాయులే కీలక పాత్ర పోషించి, అది విజయవంతం అవ్వడానికి కారణమయ్యారు.

అనంతరం కొత్తగా ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత హాజరు పై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పటికే పలురకాల మొబైల్ యాప్లతో సతమతమవుతున్న టీచర్లకు ఇది మింగుడుపడలేదు. అనంతరం ముఖ ఆధారిత హాజరుపై ఉపాధ్యాయులు మౌనం వహించినా అసం తృప్తి తీవ్ర స్థాయిలో ఉంది. ఇవన్నీ గమనిస్తున్న ప్రభుత్వం ఎన్నికల్లో టీచర్లు వ్యతిరేకంగా ఉంటారనే అంచనాకు వచ్చినట్లు అర్థమవుతోంది. అందుకే వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కసరత్తు చేస్తోంది.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

8 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

10 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

12 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

12 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

13 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

13 hours ago