Political News

అనూహ్యంగా తెర మీదకు వచ్చిన పేరు.. ఎమ్మెల్సీ వారికేనా?

పదవుల పంపకం విషయం ఏపీలో ఆసక్తికరంగా మారింది. ఒకేసమయంలో దాదాపు ఆరు పదవులకు సంబంధించి అంశం కావటంతో.. ఆశావాహులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఒక్కోపదవికి సరాసరిన నలుగురైదుగురు పోటీ పడుతుండటంతో.. ఎవరికి పదవులు వరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. రెండు మంత్రి పదవులతో పాటు నాలుగు ఎమ్మెల్సీ పదవులు ఎవరిని వరిస్తాయన్నది ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.

వ్యూహాత్మకంగా తనకు సన్నిహితులైన పిల్లి సుభాష్ చంద్రబోస్.. మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపిన జగన్.. ఏకంగా నాలుగు పదవులకు కొత్త వారిని ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. గవర్నర్ కోటాలో మరో రెండు ఎమ్మెల్సీ పదవులు అధికార పార్టీకే చెందనున్నాయి. మంత్రుల రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీల కంటే గవర్నర్ కోటా మీదనే అందరి చూపులు ఉన్నాయి.

ఇప్పటికే ఈ రెండుస్థానాల్లో ఒకటి మర్రి రాజశేఖర్ కు పక్కా అన్న మాట వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మాటతో పోటీ నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఈసారి ఆయనకు బెర్తు పక్కా అని చెబుతున్నారు. ఇక.. మరో స్థానానికి మాత్రం అనూహ్యంగా కొత్త పేర్లు తెర మీదకు రావటం గమనార్హం.

కడప జిల్లా రాయచోటికి చెందిన ముస్లిం నేత అఫ్జల్ ఖాన్ సతీమణి జకియా ఖాన్ కు దక్కే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. మరోవైపు.. ఆమెకంటే కూడా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మోసెస్ రాజుకే దక్కుతాయన్న వాదన వినిపిస్తోంది. వీరిద్దరిలో ఎవరో ఒకరికి ఖాయంగా పదవి దక్కుతుందన్న మాట వినిపిస్తోంది. మరి.. జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

This post was last modified on July 15, 2020 11:43 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

1 hour ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

2 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

3 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

4 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago