Political News

అనూహ్యంగా తెర మీదకు వచ్చిన పేరు.. ఎమ్మెల్సీ వారికేనా?

పదవుల పంపకం విషయం ఏపీలో ఆసక్తికరంగా మారింది. ఒకేసమయంలో దాదాపు ఆరు పదవులకు సంబంధించి అంశం కావటంతో.. ఆశావాహులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఒక్కోపదవికి సరాసరిన నలుగురైదుగురు పోటీ పడుతుండటంతో.. ఎవరికి పదవులు వరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. రెండు మంత్రి పదవులతో పాటు నాలుగు ఎమ్మెల్సీ పదవులు ఎవరిని వరిస్తాయన్నది ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.

వ్యూహాత్మకంగా తనకు సన్నిహితులైన పిల్లి సుభాష్ చంద్రబోస్.. మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపిన జగన్.. ఏకంగా నాలుగు పదవులకు కొత్త వారిని ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. గవర్నర్ కోటాలో మరో రెండు ఎమ్మెల్సీ పదవులు అధికార పార్టీకే చెందనున్నాయి. మంత్రుల రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీల కంటే గవర్నర్ కోటా మీదనే అందరి చూపులు ఉన్నాయి.

ఇప్పటికే ఈ రెండుస్థానాల్లో ఒకటి మర్రి రాజశేఖర్ కు పక్కా అన్న మాట వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మాటతో పోటీ నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఈసారి ఆయనకు బెర్తు పక్కా అని చెబుతున్నారు. ఇక.. మరో స్థానానికి మాత్రం అనూహ్యంగా కొత్త పేర్లు తెర మీదకు రావటం గమనార్హం.

కడప జిల్లా రాయచోటికి చెందిన ముస్లిం నేత అఫ్జల్ ఖాన్ సతీమణి జకియా ఖాన్ కు దక్కే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. మరోవైపు.. ఆమెకంటే కూడా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మోసెస్ రాజుకే దక్కుతాయన్న వాదన వినిపిస్తోంది. వీరిద్దరిలో ఎవరో ఒకరికి ఖాయంగా పదవి దక్కుతుందన్న మాట వినిపిస్తోంది. మరి.. జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

Satya

Recent Posts

ఒక నయనతార.. ఒక త్రిష.. ఒక నివేథా

కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…

1 hour ago

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

3 hours ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

4 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

4 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

4 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

5 hours ago