పదవుల పంపకం విషయం ఏపీలో ఆసక్తికరంగా మారింది. ఒకేసమయంలో దాదాపు ఆరు పదవులకు సంబంధించి అంశం కావటంతో.. ఆశావాహులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఒక్కోపదవికి సరాసరిన నలుగురైదుగురు పోటీ పడుతుండటంతో.. ఎవరికి పదవులు వరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. రెండు మంత్రి పదవులతో పాటు నాలుగు ఎమ్మెల్సీ పదవులు ఎవరిని వరిస్తాయన్నది ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.
వ్యూహాత్మకంగా తనకు సన్నిహితులైన పిల్లి సుభాష్ చంద్రబోస్.. మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపిన జగన్.. ఏకంగా నాలుగు పదవులకు కొత్త వారిని ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. గవర్నర్ కోటాలో మరో రెండు ఎమ్మెల్సీ పదవులు అధికార పార్టీకే చెందనున్నాయి. మంత్రుల రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీల కంటే గవర్నర్ కోటా మీదనే అందరి చూపులు ఉన్నాయి.
ఇప్పటికే ఈ రెండుస్థానాల్లో ఒకటి మర్రి రాజశేఖర్ కు పక్కా అన్న మాట వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మాటతో పోటీ నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఈసారి ఆయనకు బెర్తు పక్కా అని చెబుతున్నారు. ఇక.. మరో స్థానానికి మాత్రం అనూహ్యంగా కొత్త పేర్లు తెర మీదకు రావటం గమనార్హం.
కడప జిల్లా రాయచోటికి చెందిన ముస్లిం నేత అఫ్జల్ ఖాన్ సతీమణి జకియా ఖాన్ కు దక్కే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. మరోవైపు.. ఆమెకంటే కూడా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మోసెస్ రాజుకే దక్కుతాయన్న వాదన వినిపిస్తోంది. వీరిద్దరిలో ఎవరో ఒకరికి ఖాయంగా పదవి దక్కుతుందన్న మాట వినిపిస్తోంది. మరి.. జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on July 15, 2020 11:43 pm
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…
థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…