ఏపీ సీఎం జగన్ చిన్నాన్న.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సుప్రీం కోర్టు తెలంగాణ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసింది. వివేకా కుమార్తె.. డాక్టర్ సునీత అభ్యర్థన.. ఏపీ ప్రభుత్వ అంగీకారం నేపథ్యంలో వివేకా హత్య కేసు విచారణను తెలంగాణలోని కోర్టుకు బదిలీ చేస్తున్నామని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించిం ది.
దీని ప్రకారం.. వివేకా కేసులో నిందితులు ఎవరు ఉన్నప్పటికీ, హైదరాబాద్ కోర్టులోనే విచారణ జరగనుంది. అదేవిధంగా ఈ కేసులో అభ్యంతరాలు ఉన్నా.. ఇంప్లీడ్ అవ్వాలని ఎవరైనా అనుకున్నా హైదరాబాద్కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కేసు విచారణ సందర్భంగా.. న్యాయమూర్తులు వ్యాఖ్యానిస్తూ.. కేసు విచారణలో మరింత పారదర్శకత కోసమే హైదరాబాద్కు బదిలీ చేస్తున్నామని చెప్పారు.
తన తండ్రి వివేకా కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సునీత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వాస్తవానికి ఈ పిటిషన్పై అక్టోబర్ 19న జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం విచారణ ముగించింది. ఈ క్రమంలోనే కడప సీబీఐ కోర్టు నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది. వివేకా కుమార్తె, భార్యకు కేసు విచారణపై అసంతృప్తి ఉన్నందున బదిలీకి ఆదేశాలిస్తున్నట్టు సుప్రీం తెలిపింది.
ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకున్నామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసులో సాక్ష్యాలను చెరిపేసిన ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమంటూ సుప్రీం వ్యాఖ్యానించింది.
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…