Political News

వివేకా హ‌త్య కేసులో జగన్ కు షాక్

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసు విచార‌ణ‌ను సుప్రీం కోర్టు తెలంగాణ సీబీఐ ప్ర‌త్యేక కోర్టుకు బ‌దిలీ చేసింది. వివేకా కుమార్తె.. డాక్ట‌ర్ సునీత అభ్య‌ర్థ‌న‌.. ఏపీ ప్ర‌భుత్వ అంగీకారం నేప‌థ్యంలో వివేకా హ‌త్య కేసు విచార‌ణ‌ను తెలంగాణ‌లోని కోర్టుకు బ‌దిలీ చేస్తున్నామ‌ని సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువ‌రించిం ది.

దీని ప్ర‌కారం.. వివేకా కేసులో నిందితులు ఎవ‌రు ఉన్న‌ప్ప‌టికీ, హైద‌రాబాద్ కోర్టులోనే విచార‌ణ జ‌ర‌గ‌నుంది. అదేవిధంగా ఈ కేసులో అభ్యంత‌రాలు ఉన్నా.. ఇంప్లీడ్ అవ్వాల‌ని ఎవ‌రైనా అనుకున్నా హైద‌రాబాద్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కేసు విచార‌ణ సంద‌ర్భంగా.. న్యాయ‌మూర్తులు వ్యాఖ్యానిస్తూ.. కేసు విచార‌ణ‌లో మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త కోస‌మే హైద‌రాబాద్‌కు బ‌దిలీ చేస్తున్నామ‌ని చెప్పారు.

త‌న తండ్రి వివేకా కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సునీత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వాస్త‌వానికి ఈ పిటిషన్‌పై అక్టోబర్ 19న జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం విచారణ ముగించింది. ఈ క్రమంలోనే కడప సీబీఐ కోర్టు నుంచి హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది. వివేకా కుమార్తె, భార్యకు కేసు విచారణపై అసంతృప్తి ఉన్నందున బదిలీకి ఆదేశాలిస్తున్నట్టు సుప్రీం తెలిపింది.

ప్రాథమిక హక్కులను పరిగణన‌లోకి తీసుకున్నామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసులో సాక్ష్యాలను చెరిపేసిన ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమంటూ సుప్రీం వ్యాఖ్యానించింది.

This post was last modified on November 29, 2022 12:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

23 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago