Political News

నిజ‌మే క‌దా.. ఈ విష‌యాన్ని ప‌వన్ చెప్పాలేమో..!

కొన్ని కొన్ని విష‌యాల‌ను రాజ‌కీయ నేత‌లు స్కిప్ చేసేందుకు వీలు కాదు. ఇప్పుడు కాక‌పోతే..రేప‌యినా.. వారు వాటిని ప్ర‌స్తావించాలి.. నిజాలు ప్ర‌జ‌ల‌కు చెప్పాలి. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కు కూడా వ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీలకులు. ఎలాగంటే.. ఇప్పుడు అసలు.. ఆయ‌న చేతిలో ఉన్న నాయ‌కులు ఎంత‌మంది? ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌ల‌కు బెల్ మోగితే.. ప‌వ‌న్ ఏం చేస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది.

ఎందుకు ఈ చ‌ర్చ ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చిందంటే.. ఖ‌చ్చితంగా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించు కుంటామ‌ని.. అధికారంలోకి వ‌చ్చి.. వైసీపీ నేత‌ల తాట తీస్తామ‌ని, అప్ప‌టికి జీరోల‌య్యే ఇప్ప‌టి వైసీపీ హీరోల‌ను త‌రిమి త‌రిమి కొడ‌తామ‌ని అన్నారు. ఓకే.. ఒక నాయ‌కుడిగా.. పార్టీ అధినేత‌గా ఆమాత్రం ప‌వ‌ర్ చూపిం చాల్సిందే.. ఆ మాత్రం కామెంట్లు కుమ్మ‌రించాల్సిందే. అయితే.. అధికారం చేప‌ట్టాలంటే.. మాత్రం మాట‌లు చెప్పినంత ఈజీకాదు క‌దా!

ఇప్పుడు ఇదే విష‌యం పై నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లుచేస్తున్నారు. “ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు పెడితే.. నాకు టికెట్ ఇస్తారా ప‌వ‌న్ స‌ర్‌” అని కొంద‌రు అంటే.. మ‌రికొంద‌రు.. నేను గెలిచే ఛాన్స్ ఉంది.. ట్రై చేయొచ్చా! అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా ఎందుకు జ‌రుగుతోంది? అంటే.. పార్టీపై న‌మ్మ‌కం గురించి ప‌క్క‌న పెడితే..రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో 100 తీసేసినా.. 75 స్థానాల్లో అయినా.. ప‌వ‌న్ అభ్య‌ర్థులు ఉన్నారా? అనేది ప్ర‌శ్న‌.

ఇదిలేదు. దాదాపు 100 కు పైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన‌కు అభ్య‌ర్థులు లేరు. ఇక‌, మిగిలిన 75 నియోజక వ‌ర్గాల్లో ఉన్న‌ వారిలో స‌త్తా చూపించేవారు 10 నుంచి 15 మంది లోపే. మిగిలిన వారు.. కేవ‌లం నామ్‌కే వాస్తే.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించేవారే. ఒక్క ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో మాత్రం ఒకింత ఊపు ఉంది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ 15 మంది నాయ‌కులు ఉండొచ్చు. అంత‌కుమించి.. ఇత‌ర జిల్లాల ప‌రిస్థితి ఒక‌టి అర‌గానే ఉంది. మ‌రి ఇలాంటివారిని పెట్టుకుని ప‌వ‌న్‌.. అధికారంలోకి వ‌స్తారా? అనేది ప్ర‌శ్న‌. అందుకే ఏవేవో చెప్పే బ‌దులు ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తే.. బెట‌ర్ క‌దా! అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on November 29, 2022 10:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

45 minutes ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

1 hour ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

4 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

5 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

6 hours ago

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

8 hours ago