Political News

వాట్ నెక్ట్స్‌.. రాజ‌ధాని పై వైసీపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌

ఇప్పుడు ఏం చేద్దాం.. సుప్రీం తీర్పు పై వైసీపీ డోలాయ‌మానం!

రాష్ట్రంలో మూడు రాజ‌ధానుల‌ను నిర్మించ‌డ‌మో.. లేక ఉన్న వాటినే డెవ‌ల‌ప్ చేయ‌డ‌మో చేసి… ఎన్నిక‌ల కు ముందు ప్ర‌జ‌ల మ‌న‌సు దోచాల‌ని అనుకుంటున్న ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఇప్పుడు పాలుపోని ప‌రిస్థితి వ‌చ్చింది. మూడు రాజ‌ధానులు అని ప్ర‌క‌టించి వ‌చ్చే ఏడాది మార్చి నాటికి మూడేళ్లు పూర్త‌వుతు న్నాయి. 2020 మార్చిలో జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో సీఎం జ‌గ‌న్ మూడును ప్ర‌క‌టించారు. ద‌రిమిలా.. వెల్లువెత్తిన రైతుల ఆగ్ర‌హం.. న్యాయ‌స్థానాల జోక్యంతో ఇది కీల‌క‌మైన మ‌లుపు తిరిగింది.

చేసిన చ‌ట్టాల‌ను కూడా ర‌ద్దు చేసుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇంత‌లోనే హైకోర్టు.. మూడు కాదు.. ఒక‌టే అంటూ చెప్ప‌డం.. ఇక్క‌డే మూడు, ఆరు నెల‌ల్లోనే నిర్మాణం పూర్తికావాల‌న‌డం.. సంచ‌ల‌నంగా మారింది. అయితే, తాజాగా సుప్రీంకోర్టు ఏమైనా ఉప‌శ‌మ‌నం ఇస్తుంద‌ని వైసీపీ నాయ‌కులు ఆలోచించారు. హైకోర్టు పెట్టిన గ‌డువు పూర్తికావ‌డంతో సుప్రీంకోర్టుకు వెళ్లిన ప్ర‌భుత్వం.. రాజ‌ధాని పై చ‌ట్టం చేసే హ‌క్కు రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేద‌న్న హైకోర్టు వాద‌న‌ను కొట్టేయాల‌ని కోరుకుంది.

అయితే, సుప్రీంకోర్టు దీనిని ‘త‌ర్వాత‌’ విచారిస్తామంటూ.. ముందు హైకోర్టు పెట్టిన ‘టైంబౌండ్‌’ను త‌ప్పుబ‌డుతూ.. వాటిపైనే ప్ర‌ధానంగా స్టే విధించింది. దీంతో వైసీపీ ప్ర‌భుత్వానికి ఇప్ప‌టికిప్పుడు హైకోర్టు చెప్పిన‌ట్టు.. అమ‌రావ‌తిలో నిర్మాణాలు, మౌలిక స‌దుపాయాలు క‌ల్పించాల్సిన అవ‌స‌రం లేనేలేదు. అంటే.. ఇది ఒక రిలీఫ‌నే చెప్పాలి. మ‌రి.. అదే స‌మ‌యంలో తాను భావిస్తున్న మూడు రాజ‌ధానుల‌కు మాత్రం.. సుప్రీం కోర్టు నుంచి కొంచెం కూడా.. సాన‌కూల ప‌రిస్థితి క‌నిపించ‌లేదు.

దీంతో ఇప్పుడు ఏం చేయాలి? అనేది వైసీపీ అధినేత నుంచి కీల‌క నాయ‌కుల వ‌ర‌కు త‌ల‌ప‌ట్టుకు ప‌రిస్థితి వ‌చ్చింది. సుప్రీం ఇచ్చిన స్టే ఒక‌ వైపు కొంత ఆనందం క‌లిగిస్తున్నా.. మ‌రో వైపు త‌మ మూడు రాజ‌ధానుల క‌ల మాటేమిటి? అనేది ఇప్పుడు అధిష్టానాన్ని త‌ర్జ‌న భ‌ర్జ‌న‌కు గురిచేస్తోంద‌నేది వాస్త‌వం. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర‌లోపే స‌మ‌యం ఉండడం.. త‌మ‌కు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన మూడు రాజ‌ధానుల‌కు.. ఎక్క‌డా దారి క‌నిపించ‌క‌పోవ‌డం.. చిత్ర‌మైన వాతావ‌ర‌ణంగానే వైసీపీ కీల‌క నాయ‌కులు భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్ప‌టికిప్పుడు రాజ‌ధాని విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి ఎలా తీసుకు వెళ్లాల‌నే విష‌యంపై వైసీపీ ప్ర‌భుత్వం స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీనిపై సీనియ‌ర్ న్యాయ నిపుణుల‌తో చ‌ర్చించి.. విశాఖ‌కు త‌క్ష‌ణ‌మే అంటే.. వ‌చ్చే జ‌న‌వ‌రి 31లోపు సీఎం కార్యాల‌యాన్ని త‌ర‌లించేస్తే.. ఎలా ఉంటుంది? ఏమైనా చిక్కులు వ‌స్తాయా? అనే దానిపై దృష్టిపెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. రాబోయే 60 రోజుల్లో ఏదో ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం అయితే.. తీసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు సీనియ‌ర్ నాయ‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Satya

Recent Posts

ర‌జినీ సినిమాలో రాశి… ఏం చేస్తుంద‌బ్బా?

కొన్నేళ్ల ముందు వ‌ర‌కు తెలుగులో రాశి ఖ‌న్నా కెరీర్ మంచి ఊపులో ఉండేది. జూనియ‌ర్ ఎన్టీఆర్ సహా ప‌లువురు స్టార్…

11 minutes ago

సూటిగా చెప్పిన సమాధానాల్లో సునీత గారి పాఠాలు

గాయని సునీత అంటే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. చిత్ర, జానకి లాంటి సీనియర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న టైంలో…

1 hour ago

కేంద్ర మంత్రివ‌ర్గంలో ఏపీ నుంచి మ‌రో ఇద్ద‌రు?

కేంద్ర మంత్రివ‌ర్గం ప్ర‌క్షాళ‌న దాదాపు ఖ‌రారైన నేప‌థ్యంలో ఏపీ నుంచి మ‌రో ఇద్ద‌రు ఎంపీల‌కు మంత్రి యోగం ప‌ట్ట‌నుంద‌ని టీడీపీ…

2 hours ago

వారణాసి సెట్… 7 గంటలకు షూటింగ్ అంటే

కెరీర్లో ఒక ద‌శ వ‌ర‌కు మామూలు మాస్ మ‌సాలా సినిమాలే తీశాడు రాజ‌మౌళి. మ‌గ‌ధీర నుంచి ఆయ‌నలోని మ‌రో కోణం…

4 hours ago

సైలెంటుగా పరుగులు పెడుతున్న బంగారం

సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.…

7 hours ago

దీదీ వర్సెస్ రీతబ్రత… అసలైన తృణమూల్ ఎవరిది?

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…

9 hours ago