ఏపీ బీజేపీలో జనసేన పార్టీ విషయంపై కలవరం ప్రారంభమైందా? వచ్చే ఎన్నికల్లో పవన్తో కలిసి ముందుకు సాగాలన్న రాష్ట్ర కమలనాథులు..ఎందుకు మథనపడుతున్నారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. అంతేకాదు, తాజాగా ఓ కీలక నాయకుడు హుటాహుటిన ఢిల్లీ పెద్దలను కలిసేందుకు వెళ్లిపోయారు. అయితే, అక్కడ నాయకులు అందరూ గుజరాత్ ఎన్నికల వేళ బిజీబిజీగా ఉన్నారు. అయినా, ఈయన మాత్రం అర్జంట్ చర్చించాల్సిన విషయం ఉందని పేర్కొంటూ ఫ్లైటెక్కడం గమనార్హం.
ఇంతకీ ఏం జరుగుతోందంటే.. ఏపీలో జనసేన తమతో పొత్తులో ఉందని రాష్ట్ర కమలనాథులు ప్రచారం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమని, అధికారంలోకి రావడం ఖాయమని కూడా చెబుతున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. ఇదే విషయంలో పవన్ మాత్రం నోరు మెదపడం లేదు. ఆదిలో అంటే.. 2020-21 మధ్యకాలంలో మాత్రం కొంత వరకు బీజేపీని వెంటేసుకుని తిరిగారు.
తిరుపతి ఉప ఎన్నిక, బద్వేల్ ఉప పోరు తర్వాత ఆయన బీజేపీని పక్కన పెట్టేశారు. అలాగని కటీఫ్ చేసుకోలేదు. కేంద్ర నాయకత్వంతో మాత్రమే ఆయన టచ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలప్రధాని మోడీతో భేటీ అయ్యారు. అయితే.. ఇలా ఉన్నప్పటికీ.. అటు విజయనగరంలో జరిగిన సభలో కానీ తాజాగా మంగళగిరిలో తూర్పు కాపులు, ఇప్పటం కూల్చివేతల బాధితులతో భేటీ అయినప్పుడు కానీ, పవన్ బీజేపీ గురించిన మాట కనీసం ప్రస్తావించలేదు.
పైగా.. నా యుద్ధం నేనే చేస్తానన్నారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో ‘జనసేన’ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అంతేకాదు.. ‘బీజేపీ-జనసేన’ కూటమి ప్రభుత్వం వస్తుందని ఆయనచెప్పలేదు. కనీసం బీజేపీ గురించిన ప్రస్తావన అసలు తీసుకురానేలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకులకు కలవరం ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల వరకు పవన్ ఇలానే ఉండి..చివరి నిముషంలో ప్లేట్ ఫిరాయిస్తే.. ఏం చేయాలనే చర్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే విషయాన్ని ఢిల్లీలో తేల్చుకునేందుకు కీలక నేత ఒకరు ఢిల్లీకి వెళ్లారు. మరి అక్కడ ఏం చేస్తారో.. పవన్కు ఏం చెప్పిస్తారో చూడాలి.
This post was last modified on November 29, 2022 10:16 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…