Political News

బీజేపీలో ప‌వ‌న్ క‌ల‌వ‌రం.. ఢిల్లీకి కీల‌క నాయ‌కుడు?

ఏపీ బీజేపీలో జ‌న‌సేన పార్టీ విష‌యంపై క‌ల‌వ‌రం ప్రారంభ‌మైందా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌తో క‌లిసి ముందుకు సాగాల‌న్న రాష్ట్ర క‌మ‌ల‌నాథులు..ఎందుకు మ‌థ‌న‌ప‌డుతున్నారు? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. అంతేకాదు, తాజాగా ఓ కీల‌క నాయ‌కుడు హుటాహుటిన ఢిల్లీ పెద్ద‌ల‌ను క‌లిసేందుకు వెళ్లిపోయారు. అయితే, అక్క‌డ నాయ‌కులు అంద‌రూ గుజ‌రాత్ ఎన్నిక‌ల వేళ బిజీబిజీగా ఉన్నారు. అయినా, ఈయ‌న మాత్రం అర్జంట్ చ‌ర్చించాల్సిన విష‌యం ఉంద‌ని పేర్కొంటూ ఫ్లైటెక్క‌డం గ‌మ‌నార్హం.

ఇంత‌కీ ఏం జ‌రుగుతోందంటే.. ఏపీలో జ‌న‌సేన త‌మ‌తో పొత్తులో ఉంద‌ని రాష్ట్ర క‌మ‌ల‌నాథులు ప్ర‌చారం చేసుకుంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని, అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని కూడా చెబుతున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. ఇదే విష‌యంలో ప‌వ‌న్ మాత్రం నోరు మెద‌ప‌డం లేదు. ఆదిలో అంటే.. 2020-21 మ‌ధ్య‌కాలంలో మాత్రం కొంత వ‌ర‌కు బీజేపీని వెంటేసుకుని తిరిగారు.

తిరుప‌తి ఉప ఎన్నిక, బ‌ద్వేల్ ఉప పోరు త‌ర్వాత ఆయ‌న బీజేపీని ప‌క్క‌న పెట్టేశారు. అలాగ‌ని క‌టీఫ్ చేసుకోలేదు. కేంద్ర నాయ‌కత్వంతో మాత్ర‌మే ఆయ‌న ట‌చ్‌లో ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల‌ప్ర‌ధాని మోడీతో భేటీ అయ్యారు. అయితే.. ఇలా ఉన్న‌ప్ప‌టికీ.. అటు విజ‌య‌న‌గ‌రంలో జ‌రిగిన స‌భ‌లో కానీ తాజాగా మంగ‌ళ‌గిరిలో తూర్పు కాపులు, ఇప్ప‌టం కూల్చివేత‌ల బాధితుల‌తో భేటీ అయిన‌ప్పుడు కానీ, ప‌వ‌న్ బీజేపీ గురించిన మాట క‌నీసం ప్ర‌స్తావించ‌లేదు.

పైగా.. నా యుద్ధం నేనే చేస్తాన‌న్నారు. అంతేకాదు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ‘జ‌న‌సేన‌’ అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్పారు. అంతేకాదు.. ‘బీజేపీ-జ‌న‌సేన’ కూట‌మి ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని ఆయ‌నచెప్ప‌లేదు. క‌నీసం బీజేపీ గురించిన ప్ర‌స్తావన అస‌లు తీసుకురానేలేదు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో రాష్ట్ర బీజేపీ నాయ‌కుల‌కు క‌ల‌వ‌రం ప్రారంభ‌మైంది. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ప‌వ‌న్ ఇలానే ఉండి..చివ‌రి నిముషంలో ప్లేట్ ఫిరాయిస్తే.. ఏం చేయాల‌నే చ‌ర్చ ప్రారంభమైంది. ఈ నేప‌థ్యంలోనే విష‌యాన్ని ఢిల్లీలో తేల్చుకునేందుకు కీల‌క నేత ఒక‌రు ఢిల్లీకి వెళ్లారు. మ‌రి అక్క‌డ ఏం చేస్తారో.. ప‌వ‌న్‌కు ఏం చెప్పిస్తారో చూడాలి.

This post was last modified on November 29, 2022 10:16 am

Share

Recent Posts

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

2 hours ago

వైష్ణవి చైతన్య బాధ వర్ణనాతీతం

యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…

3 hours ago

మండాడి ఊపులో దేవర ఊసులు

తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…

3 hours ago

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

6 hours ago

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

7 hours ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

7 hours ago