ఏపీ బీజేపీలో జనసేన పార్టీ విషయంపై కలవరం ప్రారంభమైందా? వచ్చే ఎన్నికల్లో పవన్తో కలిసి ముందుకు సాగాలన్న రాష్ట్ర కమలనాథులు..ఎందుకు మథనపడుతున్నారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. అంతేకాదు, తాజాగా ఓ కీలక నాయకుడు హుటాహుటిన ఢిల్లీ పెద్దలను కలిసేందుకు వెళ్లిపోయారు. అయితే, అక్కడ నాయకులు అందరూ గుజరాత్ ఎన్నికల వేళ బిజీబిజీగా ఉన్నారు. అయినా, ఈయన మాత్రం అర్జంట్ చర్చించాల్సిన విషయం ఉందని పేర్కొంటూ ఫ్లైటెక్కడం గమనార్హం.
ఇంతకీ ఏం జరుగుతోందంటే.. ఏపీలో జనసేన తమతో పొత్తులో ఉందని రాష్ట్ర కమలనాథులు ప్రచారం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమని, అధికారంలోకి రావడం ఖాయమని కూడా చెబుతున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. ఇదే విషయంలో పవన్ మాత్రం నోరు మెదపడం లేదు. ఆదిలో అంటే.. 2020-21 మధ్యకాలంలో మాత్రం కొంత వరకు బీజేపీని వెంటేసుకుని తిరిగారు.
తిరుపతి ఉప ఎన్నిక, బద్వేల్ ఉప పోరు తర్వాత ఆయన బీజేపీని పక్కన పెట్టేశారు. అలాగని కటీఫ్ చేసుకోలేదు. కేంద్ర నాయకత్వంతో మాత్రమే ఆయన టచ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలప్రధాని మోడీతో భేటీ అయ్యారు. అయితే.. ఇలా ఉన్నప్పటికీ.. అటు విజయనగరంలో జరిగిన సభలో కానీ తాజాగా మంగళగిరిలో తూర్పు కాపులు, ఇప్పటం కూల్చివేతల బాధితులతో భేటీ అయినప్పుడు కానీ, పవన్ బీజేపీ గురించిన మాట కనీసం ప్రస్తావించలేదు.
పైగా.. నా యుద్ధం నేనే చేస్తానన్నారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో ‘జనసేన’ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అంతేకాదు.. ‘బీజేపీ-జనసేన’ కూటమి ప్రభుత్వం వస్తుందని ఆయనచెప్పలేదు. కనీసం బీజేపీ గురించిన ప్రస్తావన అసలు తీసుకురానేలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకులకు కలవరం ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల వరకు పవన్ ఇలానే ఉండి..చివరి నిముషంలో ప్లేట్ ఫిరాయిస్తే.. ఏం చేయాలనే చర్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే విషయాన్ని ఢిల్లీలో తేల్చుకునేందుకు కీలక నేత ఒకరు ఢిల్లీకి వెళ్లారు. మరి అక్కడ ఏం చేస్తారో.. పవన్కు ఏం చెప్పిస్తారో చూడాలి.
This post was last modified on November 29, 2022 10:16 am
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…
నటసింహం బాలయ్య హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన అఖండ్-2 సినిమాలకు బాలారిష్టాలు తీరడం లేదు. ఈ నెల తొలి…