Political News

బీఆర్ఎస్ రాగానే ఐటీ రైడ్స్ వుండవట

ఇటీవ‌ల ఐటీ దాడుల‌తో తీవ్ర‌స్థాయిలో వార్త‌ల్లోకి వ‌చ్చిన తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే దేశ‌వ్యాప్తంగా ఐటీ చ‌ట్టాన్ని మారుస్తామ‌ని చెప్పారు. ఎంతైనా సంపాయించుకు నేందుకు హ‌క్కుక‌ల్పించ‌డంతోపాటు.. సంపాయించుకున్న‌వారే టాక్సులు క‌ట్టేలా కూడా స‌వ‌రిస్తామ‌ని చెప్పారు. 2024లో ఢిల్లీ ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం పునరావాస కాలనీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి.. ఐటీ మినహాయింపు ఇవ్వడంతో పాటు సంపాదించిన ఆస్తిలో వాళ్లే స్వతహాగా టాక్స్ చెల్లించే విధంగా చట్టాన్ని తీసుకువస్తామ న్నారు. తనపై 500 మంది నిపెట్టి ఐటీ దాడులు చేయించారని.. అయినా తాను భయపడలేదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంతకాలం తనకు భయం లేదన్నారు. దేశ ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారని తెలిపారు.

ఈ దేశంలో విద్యుత్తు ఉన్నప్పటికీ దానిని ఉత్పత్తి చేసి ప్రజలకు అందించే దమ్ము బీజేపీకి లేదని నిప్పులు చెరిగారు. తాగు సాగునీరు సమృద్ధిగా ఉన్న ప్రజలకు అందించడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు. అందుకే ప్రజలంతా కేసీఆర్ వైపే చూస్తున్నారని అన్నారు. 2024లో ఢిల్లీలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ ఎస్ అధికారంలోకి వ‌స్తే.. ఐటీ రైడ్స్ ఉండ‌వ‌ని చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రూ ఎంతైనా సంపాయించుకోవ‌చ్చ‌న్నారు.

“ముఖ్యమంత్రి కేసీఆర్ మామూలు వ్యక్తి కాదు. మహాత్ముడు. ఓ గొప్ప వ్యక్తి“ అని మంత్రి మ‌ల్లారెడ్డి అన్నారు. ప్రజలకు అంబేద్కర్ తర్వాత సేవ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం కేసీఆర్ మాత్ర‌మేన‌ని చెప్పారు. ఢిల్లీలో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఐటీ మినహాయింపు ఇవ్వడంతో పాటు సంపాదించిన ఆస్తిలో వాళ్లే స్వతహాగా టాక్స్ చెల్లించే విధంగా చట్టాన్ని తీసుకువస్తామని తెలిపారు. 2024లో ఢిల్లీలో అధికారంలోకి రావడం ఖాయం. లాల్కోటపై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమ‌ని చెప్పారు.

This post was last modified on November 28, 2022 2:39 pm

Share
Show comments

Recent Posts

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

40 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

60 minutes ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

4 hours ago