ఇటీవల ఐటీ దాడులతో తీవ్రస్థాయిలో వార్తల్లోకి వచ్చిన తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ఐటీ చట్టాన్ని మారుస్తామని చెప్పారు. ఎంతైనా సంపాయించుకు నేందుకు హక్కుకల్పించడంతోపాటు.. సంపాయించుకున్నవారే టాక్సులు కట్టేలా కూడా సవరిస్తామని చెప్పారు. 2024లో ఢిల్లీ ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం పునరావాస కాలనీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి.. ఐటీ మినహాయింపు ఇవ్వడంతో పాటు సంపాదించిన ఆస్తిలో వాళ్లే స్వతహాగా టాక్స్ చెల్లించే విధంగా చట్టాన్ని తీసుకువస్తామ న్నారు. తనపై 500 మంది నిపెట్టి ఐటీ దాడులు చేయించారని.. అయినా తాను భయపడలేదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంతకాలం తనకు భయం లేదన్నారు. దేశ ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారని తెలిపారు.
ఈ దేశంలో విద్యుత్తు ఉన్నప్పటికీ దానిని ఉత్పత్తి చేసి ప్రజలకు అందించే దమ్ము బీజేపీకి లేదని నిప్పులు చెరిగారు. తాగు సాగునీరు సమృద్ధిగా ఉన్న ప్రజలకు అందించడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు. అందుకే ప్రజలంతా కేసీఆర్ వైపే చూస్తున్నారని అన్నారు. 2024లో ఢిల్లీలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ ఎస్ అధికారంలోకి వస్తే.. ఐటీ రైడ్స్ ఉండవని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎంతైనా సంపాయించుకోవచ్చన్నారు.
“ముఖ్యమంత్రి కేసీఆర్ మామూలు వ్యక్తి కాదు. మహాత్ముడు. ఓ గొప్ప వ్యక్తి“ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రజలకు అంబేద్కర్ తర్వాత సేవ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. ఢిల్లీలో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఐటీ మినహాయింపు ఇవ్వడంతో పాటు సంపాదించిన ఆస్తిలో వాళ్లే స్వతహాగా టాక్స్ చెల్లించే విధంగా చట్టాన్ని తీసుకువస్తామని తెలిపారు. 2024లో ఢిల్లీలో అధికారంలోకి రావడం ఖాయం. లాల్కోటపై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు.
This post was last modified on November 28, 2022 2:39 pm
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…