ఇటీవల ఐటీ దాడులతో తీవ్రస్థాయిలో వార్తల్లోకి వచ్చిన తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ఐటీ చట్టాన్ని మారుస్తామని చెప్పారు. ఎంతైనా సంపాయించుకు నేందుకు హక్కుకల్పించడంతోపాటు.. సంపాయించుకున్నవారే టాక్సులు కట్టేలా కూడా సవరిస్తామని చెప్పారు. 2024లో ఢిల్లీ ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం పునరావాస కాలనీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి.. ఐటీ మినహాయింపు ఇవ్వడంతో పాటు సంపాదించిన ఆస్తిలో వాళ్లే స్వతహాగా టాక్స్ చెల్లించే విధంగా చట్టాన్ని తీసుకువస్తామ న్నారు. తనపై 500 మంది నిపెట్టి ఐటీ దాడులు చేయించారని.. అయినా తాను భయపడలేదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంతకాలం తనకు భయం లేదన్నారు. దేశ ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారని తెలిపారు.
ఈ దేశంలో విద్యుత్తు ఉన్నప్పటికీ దానిని ఉత్పత్తి చేసి ప్రజలకు అందించే దమ్ము బీజేపీకి లేదని నిప్పులు చెరిగారు. తాగు సాగునీరు సమృద్ధిగా ఉన్న ప్రజలకు అందించడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు. అందుకే ప్రజలంతా కేసీఆర్ వైపే చూస్తున్నారని అన్నారు. 2024లో ఢిల్లీలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ ఎస్ అధికారంలోకి వస్తే.. ఐటీ రైడ్స్ ఉండవని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎంతైనా సంపాయించుకోవచ్చన్నారు.
“ముఖ్యమంత్రి కేసీఆర్ మామూలు వ్యక్తి కాదు. మహాత్ముడు. ఓ గొప్ప వ్యక్తి“ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రజలకు అంబేద్కర్ తర్వాత సేవ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. ఢిల్లీలో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఐటీ మినహాయింపు ఇవ్వడంతో పాటు సంపాదించిన ఆస్తిలో వాళ్లే స్వతహాగా టాక్స్ చెల్లించే విధంగా చట్టాన్ని తీసుకువస్తామని తెలిపారు. 2024లో ఢిల్లీలో అధికారంలోకి రావడం ఖాయం. లాల్కోటపై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు.
This post was last modified on November 28, 2022 2:39 pm
కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల రాజకీయాలు చేస్తున్నారా? లేక ఎండ వేడిమి తట్టుకోలేక.. ఇంటి పట్టునే ఉంటున్నారా? అంటే..…
ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తాజాగా సొంత పార్టీ బీజేపీ నేతలపై కా మెంట్లు…
వైసీపీ ఇప్పుడున్న పరిస్థితి నుంచి పైలేవాలంటే.. ఖచ్చితంగా పార్టీని పూర్తిగా జీరో నుంచే మొదలు పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. 2012లో…
తెలుగులో ఇప్పుడు సీక్వెల్స్, ఫ్రాంఛైజీ చిత్రాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి కానీ.. ఒకప్పుడు ఆ తరహా చిత్రాలు చాలా తక్కువగా…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపుగా నెల…
ఒకప్పుడు తెలుగులో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో తమన్నా భాటియా ఒకరు. కానీ తన తరం మిగతా హీరోయిన్ల లాగే…