Political News

‘వైఎస్ క‌నుసైగ చేసి ఉంటే.. బాబు అప్పుడే అయిపోయేవారు!’

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై వైసీపీ నాయ‌కుడు, అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అప్పట్లో మొద్దు శీనుకు ఒక్కమాట చెప్పుంటే చంద్రబాబును ఆయన ఇంట్లోనే చంపేసేవాడని వ్యాఖ్యానించారు. తమ ప్రాంతంలో హత్యా రాజకీయాలు జరిగితే.. మొదట చంద్రబాబు కొడుకునే టార్గెట్ చేస్తామని హెచ్చరించా రు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు పై ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

తెలుగుదేశం హయాంలో రాప్తాడులో జాకీ పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది తెలంగాణకు తరలిపోయింది. అయితే, దీనికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి బెదిరింపులే కారణమని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప‌రిటాల సునీత ఇవే వ్యాఖ్య‌లు చేశారు. ఈ నేపథ్యంలో.. ఎమ్మెల్యే సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖ‌ర్ రెడ్డి రగిలిపోయారు.

తాజాగా రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఆయ‌న చేసిన పలు వివాదాస్పద వ్యాఖ్యలు తాజాగా వెలుగు చూశాయి. ఈ సంద‌ర్భంగా చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి చంద్రబాబును పరుష పదజాలం తో దూషించారు. జాకీ పరిశ్రమ వెళ్లిపోవడాన్ని అడ్డుపెట్టుకొని తమ కుటుంబం మీద, తమ సోదరుడి మీద అనేక రకాలుగా వార్త‌లు రాయిస్తున్నార‌ని, వాటిని భరించలేకపోతున్నామని అన్నారు.

రూ.వేల కోట్లు సంపాదించుకున్న సీఎం రమేష్, సుజనా చౌదరిని బీజేపీ దగ్గర పెట్టావ్ కదా చంద్రబాబూ. మరో వైపు కమ్యూనిస్టులను పోషిస్తున్నావ్‌. చంద్రబాబుకు సిద్ధాంతాలు లేవు. నీవు రెండెకరాల భూస్వామివి. మాకు 500 ఎకరాల భూమ ఉంది. నీకు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? సీబీఐ దర్యాప్తు జరిపిద్దామా? అని సవాలు విసిరారు.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కనుసైగ చేసుంటే మీ ప్రాణాలు ఉండేవి కాదని చంద్రబాబును హెచ్చరించారు. తమ ప్రాంతంలో హత్యారాజకీయాలు జరిగితే తమ మొదటి టార్గెట్ నారా లోకేషే నని చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారు. లోకేష్ పాదయాత్రకు ముందు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి ఆయనను టార్గెట్ చేస్తామని నేరుగా హెచ్చరించడం కలకలం రేపుతోంది. దీనిపై టీడీపీ నాయ‌కులు మౌనంగా ఉన్నారు.

Satya

Recent Posts

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

47 minutes ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

1 hour ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

1 hour ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

4 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

6 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

12 hours ago