Political News

ఇప్ప‌టం.. పవన్ తొందర పడ్డాడా?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఇప్పుడు పెద్ద సంక‌ట‌మే వ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఆయ‌న శ‌నివారం మంగ‌ళ‌గిరి స‌మీపంలోని ఇప్ప‌టంలో ప‌ర్య‌టించి.. ఇక్క‌డి కూల్చివేత‌ల బాధితుల‌కు రూ.ల‌క్ష చొప్పున నిధులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇప్ప‌టికే బాధితుల‌ను కూడా సెల‌క్టు చేశారు. వీరికి వారి ఇంటి వ‌ద్దే ఈ నిధులు పంపిణీ చేయాలా? లేక ఆఫీసుకు తీసుకువ‌చ్చి ఇవ్వాలా? అనేది ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.

దీనిక‌న్నా.. ముందు అస‌లు ప‌వ‌న్ వ‌చ్చే అవ‌కాశం కూడా త‌క్కువ‌గానే ఉంద‌ని అంటున్నారు పార్టీ నాయ కులు. ఎందుకంటే.. ఇప్ప‌టంలో త‌న పార్టీ బ‌హిరంగ స‌భ‌కు భూములు ఇచ్చిన వారి ఇళ్ల‌ను ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కంగా రాత్రికి రాత్రి చెప్పాపెట్ట‌కుండా కూల్చేసిందని.. ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. అదేస‌మ‌యం లో ఆయ‌న ఇక్క‌డ పాద‌యాత్ర‌గా వెళ్లి బాధితుల గోడు విన్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ లు కూడా గుప్పించారు.

అయితే, తాజాగా హైకోర్టు విచార‌ణ‌లో ఇక్క‌డి బాధితుల‌పై న్యాయ‌మూర్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌భు త్వం ముందుగానే నోటీసులు జారీ చేసినా..దానిని దాచిపెట్టార‌ని పేర్కొంది. అంతేకాదు, పిటిష‌న్‌లు దాఖ లు చేసిన 14 మంది కి త‌ల‌కో ల‌క్ష చొప్పున ఫైన్ కూడా వేసింది. ఇది అంత తేలిక‌గా తీసుకునే ప‌రిణామం కాదు. ఎందుకంటే.. ఇక్క‌డి స‌మ‌స్య‌పై తాను గంభీర‌మైన ఉద్య‌మం చేసిన‌ప్పుడు.. దాని తాలూకు వాస్త‌వాలు గ్ర‌హించి ఉంటే బాగుండేద‌ని జ‌న‌సేన వ‌ర్గాలే అభిప్రాయ‌ప‌డుతున్నాయి.

అయితే, ఇక్క‌డి బాధితులు చెప్పిన‌వే ప‌వ‌న్ విన్నారు త‌ప్ప‌.. వాస్త‌వాల‌ను గుర్తించ‌లేక పోయారు. ఈ నేప‌థ్యంలో హైకోర్టు తీర్పు.. ఒక్క అక్క‌డివారికే కాకుండా ప‌వ‌న్‌ను కూడా ఇర‌కాటంలోకి నెట్టేసింది. వైసీపీ నేత‌ల నుంచి కౌంట‌ర్లు కూడా ప‌డుతున్నాయి. సో.. ఇలాంటి స‌మ‌యంలో ప‌వ‌న్‌వ‌చ్చి బాధితుల‌కు రూ.ల‌క్ష ఇచ్చే ప్ర‌తిపాద‌న .. మ‌రింతగా మైన‌స్ అవుతుంద‌ని జ‌న‌సేన అభిప్రాయ‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ అస‌లు వ‌స్తారా? రారా? అనే చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on November 26, 2022 11:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని 500 కోట్లు కొట్టాలంటే…

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సినిమా సినిమాకు తన మార్కెట్ రేంజ్ ను మరో లెవెల్ కు తీసుకు వెళుతున్నాడు.…

5 minutes ago

మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఇంకెప్పుడు?

బాలయ్య అభిమానులు ఎదురుచూసే కొద్దీ దూరం వెళ్తున్నాడు మోక్షజ్ఞ. ఎప్పుడెప్పుడాని వెయిట్ చేస్తుంటే ఇప్పుడప్పుడే కాదనే తరహాలో ఇస్తున్న సంకేతాలు…

2 hours ago

వంగా అసలు ఆలోచన ఏంటి?

సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. ‘యానిమల్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన…

2 hours ago

ఘట్టమనేని వారసుడి గురించి టాక్ ఏంటి

ఘట్టమనేని మూడో తరం నుంచి వస్తున్న మొదటి వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం టీజర్ ఇటీవలే విడుదలయ్యింది.…

3 hours ago

గాయపడ్డ హీరో గట్టిగా కొడతాడా

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కల్ట్ మూవీస్ తో ఒక ప్రత్యేక ముద్ర వేసిన దర్శకుడు తరుణ్…

7 hours ago

ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ప్లానింగా?

మూడేళ్ల ముందు పాన్ ఇండియ ా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అదేమీ బ్యాడ్…

8 hours ago