జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఇప్పుడు పెద్ద సంకటమే వచ్చిందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఆయన శనివారం మంగళగిరి సమీపంలోని ఇప్పటంలో పర్యటించి.. ఇక్కడి కూల్చివేతల బాధితులకు రూ.లక్ష చొప్పున నిధులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే బాధితులను కూడా సెలక్టు చేశారు. వీరికి వారి ఇంటి వద్దే ఈ నిధులు పంపిణీ చేయాలా? లేక ఆఫీసుకు తీసుకువచ్చి ఇవ్వాలా? అనేది ఇంకా స్పష్టత రాలేదు.
దీనికన్నా.. ముందు అసలు పవన్ వచ్చే అవకాశం కూడా తక్కువగానే ఉందని అంటున్నారు పార్టీ నాయ కులు. ఎందుకంటే.. ఇప్పటంలో తన పార్టీ బహిరంగ సభకు భూములు ఇచ్చిన వారి ఇళ్లను ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా రాత్రికి రాత్రి చెప్పాపెట్టకుండా కూల్చేసిందని.. పవన్ చెప్పుకొచ్చారు. అదేసమయం లో ఆయన ఇక్కడ పాదయాత్రగా వెళ్లి బాధితుల గోడు విన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శ లు కూడా గుప్పించారు.
అయితే, తాజాగా హైకోర్టు విచారణలో ఇక్కడి బాధితులపై న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభు త్వం ముందుగానే నోటీసులు జారీ చేసినా..దానిని దాచిపెట్టారని పేర్కొంది. అంతేకాదు, పిటిషన్లు దాఖ లు చేసిన 14 మంది కి తలకో లక్ష చొప్పున ఫైన్ కూడా వేసింది. ఇది అంత తేలికగా తీసుకునే పరిణామం కాదు. ఎందుకంటే.. ఇక్కడి సమస్యపై తాను గంభీరమైన ఉద్యమం చేసినప్పుడు.. దాని తాలూకు వాస్తవాలు గ్రహించి ఉంటే బాగుండేదని జనసేన వర్గాలే అభిప్రాయపడుతున్నాయి.
అయితే, ఇక్కడి బాధితులు చెప్పినవే పవన్ విన్నారు తప్ప.. వాస్తవాలను గుర్తించలేక పోయారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు.. ఒక్క అక్కడివారికే కాకుండా పవన్ను కూడా ఇరకాటంలోకి నెట్టేసింది. వైసీపీ నేతల నుంచి కౌంటర్లు కూడా పడుతున్నాయి. సో.. ఇలాంటి సమయంలో పవన్వచ్చి బాధితులకు రూ.లక్ష ఇచ్చే ప్రతిపాదన .. మరింతగా మైనస్ అవుతుందని జనసేన అభిప్రాయపడుతోంది. ఈ క్రమంలో పవన్ అసలు వస్తారా? రారా? అనే చర్చ జరుగుతుండడం గమనార్హం.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…