Political News

ఇప్ప‌టం.. పవన్ తొందర పడ్డాడా?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఇప్పుడు పెద్ద సంక‌ట‌మే వ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఆయ‌న శ‌నివారం మంగ‌ళ‌గిరి స‌మీపంలోని ఇప్ప‌టంలో ప‌ర్య‌టించి.. ఇక్క‌డి కూల్చివేత‌ల బాధితుల‌కు రూ.ల‌క్ష చొప్పున నిధులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇప్ప‌టికే బాధితుల‌ను కూడా సెల‌క్టు చేశారు. వీరికి వారి ఇంటి వ‌ద్దే ఈ నిధులు పంపిణీ చేయాలా? లేక ఆఫీసుకు తీసుకువ‌చ్చి ఇవ్వాలా? అనేది ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.

దీనిక‌న్నా.. ముందు అస‌లు ప‌వ‌న్ వ‌చ్చే అవ‌కాశం కూడా త‌క్కువ‌గానే ఉంద‌ని అంటున్నారు పార్టీ నాయ కులు. ఎందుకంటే.. ఇప్ప‌టంలో త‌న పార్టీ బ‌హిరంగ స‌భ‌కు భూములు ఇచ్చిన వారి ఇళ్ల‌ను ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కంగా రాత్రికి రాత్రి చెప్పాపెట్ట‌కుండా కూల్చేసిందని.. ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. అదేస‌మ‌యం లో ఆయ‌న ఇక్క‌డ పాద‌యాత్ర‌గా వెళ్లి బాధితుల గోడు విన్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ లు కూడా గుప్పించారు.

అయితే, తాజాగా హైకోర్టు విచార‌ణ‌లో ఇక్క‌డి బాధితుల‌పై న్యాయ‌మూర్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌భు త్వం ముందుగానే నోటీసులు జారీ చేసినా..దానిని దాచిపెట్టార‌ని పేర్కొంది. అంతేకాదు, పిటిష‌న్‌లు దాఖ లు చేసిన 14 మంది కి త‌ల‌కో ల‌క్ష చొప్పున ఫైన్ కూడా వేసింది. ఇది అంత తేలిక‌గా తీసుకునే ప‌రిణామం కాదు. ఎందుకంటే.. ఇక్క‌డి స‌మ‌స్య‌పై తాను గంభీర‌మైన ఉద్య‌మం చేసిన‌ప్పుడు.. దాని తాలూకు వాస్త‌వాలు గ్ర‌హించి ఉంటే బాగుండేద‌ని జ‌న‌సేన వ‌ర్గాలే అభిప్రాయ‌ప‌డుతున్నాయి.

అయితే, ఇక్క‌డి బాధితులు చెప్పిన‌వే ప‌వ‌న్ విన్నారు త‌ప్ప‌.. వాస్త‌వాల‌ను గుర్తించ‌లేక పోయారు. ఈ నేప‌థ్యంలో హైకోర్టు తీర్పు.. ఒక్క అక్క‌డివారికే కాకుండా ప‌వ‌న్‌ను కూడా ఇర‌కాటంలోకి నెట్టేసింది. వైసీపీ నేత‌ల నుంచి కౌంట‌ర్లు కూడా ప‌డుతున్నాయి. సో.. ఇలాంటి స‌మ‌యంలో ప‌వ‌న్‌వ‌చ్చి బాధితుల‌కు రూ.ల‌క్ష ఇచ్చే ప్ర‌తిపాద‌న .. మ‌రింతగా మైన‌స్ అవుతుంద‌ని జ‌న‌సేన అభిప్రాయ‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ అస‌లు వ‌స్తారా? రారా? అనే చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. 

Satya

Recent Posts

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

5 minutes ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

3 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

8 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

11 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

11 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

12 hours ago