Political News

కేసీఆర్ స‌ర్ విన్నారా.. కామ్రెడ్లు కండిష‌న్ పెట్టేశారు!

ఇటీవ‌ల జ‌రిగిన మునుగోడు ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి, విజ‌యంలో భాగ‌స్వామ్యమైన కామ్రెడ్లు.. తాజాగా సీఎం కేసీఆర్‌కు కొన్ని కండిష‌న్లు పెట్టారు. ఈ కండిష‌న్ల‌కు ఒప్పుకొంటేనే.. తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తామ‌ని తేల్చి చెప్పారు. మ‌రి దీనిపై సీఎం కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఇంత‌కీ కామ్రెడ్‌.. సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కూనంనేని సాంబ‌శివ‌రావు ఏమ‌న్నారంటే.. భవిష్యత్తులోనూ టీఆర్ఎస్‌తో కలిసి పని చేస్తామని.. అయితే అది టీఆర్ఎస్ చేతిలోనే ఉందని పేర్కొన్నారు. బీజేపీపై టీఆర్ఎస్ పోరాటం ఇలాగే కొనసాగితే తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఎఫ్ఆర్వో శ్రీనివాస్రావు హత్యను సీపీఐ ఖండిస్తోందని కూనంనేని పేర్కొన్నారు. అటవీ సిబ్బందికి తుపాకులివ్వడం అనే డిమాండ్ను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. పోడు భూముల సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని సూచించారు. దీనిని బ‌ట్టే త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇక‌, ఐటీ, ఈడీ దాడులతో దేశంలో విపక్షాలను మోడీ సర్కార్‌ బెదిరిస్తోందని కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. ఎనిమిదేళ్లలో 3వేల ఈడీ దాడులు జరిగితే.. బీజేపీ నేతలపై ఎన్ని జరిగాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే ఇదేనా అని నిలదీశారు. ప్రధాని మోడీ దేశంలో అరాచకం, రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని సాంబశివరావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలన సమయంలోనూ ఇలా లేదన్నారు.

ఈడీ, ఐటీ, ఎలక్షన్ కమిషన్, జ్యుడీషియరీ ఉపయోగించి కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కూనంనేని ఆరోపించారు. ఈ ఎనిమిదేళ్లలో 3 వేల పైచిలుకు ఈడీ దాడులు చేశారని.. విపక్ష నేతలను లొంగదీసుకునేందుకే ఈ దాడులని ఆక్షేపించారు. చట్టాలు తెలియని అజ్ఞాని బండి సంజయ్ అని.. పోసాని కృష్ణమురళికి నకలు అని ఎద్దేవా చేశారు.

This post was last modified on November 25, 2022 10:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

45 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago