Political News

ఒకే మీటింగులో ఆ ఇద్దరూ.. పలుకరించుకుంటారా…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిసెంబరు 5 ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీ వేదికగా ఏం జరగబోతోందన్న చర్చ మొదలైంది. ఎదురు పడే సీఎం జగన్, చంద్రబాబు మధ్య మాటల తూటాలు పేలతాయా అన్న ఆలోచన కొందరి మదిలో మెదులుతోంది. జీ – 20 సలహాల సమావేశంలో టీ-20 మ్యాచ్ జరుగుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి..

జీ-20 దేశాల సదస్సుకు భారత ప్రభుత్వం అధ్యక్షత వహించబోతోంది. వచ్చే ఏడాది సెప్టెంబరులో న్యూఢిల్లీ వేదికగా 18వ వార్షిక జీ-20 సదస్సు జరుగుతుంది. అప్పుడు మన దేశం వహించాల్సిన వైఖరిపై ప్రధాన పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని ప్రైమ్ మినిష్టర్ మోదీ నిర్ణయించారు. అందుకోసం నిర్వహించే సమావేశానికి ప్రధాన పార్టీల అధ్యక్షులను ఆహ్వానించారు. ఏపీ నుంచి సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానాలు అందాయి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ స్వయంగా ఫోన్ చేసి చంద్రబాబును ఆహ్వానించారు.

రాష్ట్రపతి భవన్లో డిసెంబరు 5 సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించే సదస్సులో దేశంలో అన్ని పెద్దల పార్టీల నేతలు పాల్గొంటారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నట్లు టీడీపీ వర్గాలు ధృవీకరించాయి. మోదీ పిలిచిన తర్వాత జగన్ వెళ్లకుండా ఉంటారా. జగన్, చంద్రబాబు ఓకే హాల్లో కూర్చోవాల్సి వచ్చినప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుందన్న చర్చ ఏపీలో జోరుగాసాగుంది. ఎడమొహం, పెడమొహంగా ఉంటారని కొందరు.. మొహానికి నవ్వు పులుముకుని మొక్కుబడిగా పలుకరించుకుంటారని మరికొందరు వాదిస్తున్నారు. ఏపీ వేరు, ఢిల్లీ వేరని.. అక్కడ ఇద్దరూ నేతలు స్నేహంగానే మాట్లాడుకుంటారని కొన్ని వర్గాలు వాదిస్తున్నాయి. ఇటీవలి కాలంలో దుష్టచతుష్టయం, బై బై బాబు లాంటి నినాదాలను వైసీపీ బాగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఎదురుపడినప్పుడు నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో మరి…

నిజానికి స్వాతంత్ర దినోత్సవం రోజున ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ రాజ్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జగన్, చంద్రబాబు హాజరయ్యారు.. ఇద్దరూ ఎదురు పడతారని భావించారు. అందుకు భిన్నంగా ముందు చంద్రబాబు వచ్చి మర్యాదపూర్వకంగా కాసేపు ఉండి వెళ్లిపోయారు. తర్వాతే జగన్ అక్కడకు చేరుకున్నారు. దానితో ఇద్దరు నేతలు కలిసే అవకాశం రాలేదు. ఢిల్లీలో అలా జరగకపోవచ్చు..

This post was last modified on November 25, 2022 11:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

11 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

12 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

13 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

13 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

13 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

14 hours ago