Political News

ఒకే మీటింగులో ఆ ఇద్దరూ.. పలుకరించుకుంటారా…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిసెంబరు 5 ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీ వేదికగా ఏం జరగబోతోందన్న చర్చ మొదలైంది. ఎదురు పడే సీఎం జగన్, చంద్రబాబు మధ్య మాటల తూటాలు పేలతాయా అన్న ఆలోచన కొందరి మదిలో మెదులుతోంది. జీ – 20 సలహాల సమావేశంలో టీ-20 మ్యాచ్ జరుగుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి..

జీ-20 దేశాల సదస్సుకు భారత ప్రభుత్వం అధ్యక్షత వహించబోతోంది. వచ్చే ఏడాది సెప్టెంబరులో న్యూఢిల్లీ వేదికగా 18వ వార్షిక జీ-20 సదస్సు జరుగుతుంది. అప్పుడు మన దేశం వహించాల్సిన వైఖరిపై ప్రధాన పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని ప్రైమ్ మినిష్టర్ మోదీ నిర్ణయించారు. అందుకోసం నిర్వహించే సమావేశానికి ప్రధాన పార్టీల అధ్యక్షులను ఆహ్వానించారు. ఏపీ నుంచి సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానాలు అందాయి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ స్వయంగా ఫోన్ చేసి చంద్రబాబును ఆహ్వానించారు.

రాష్ట్రపతి భవన్లో డిసెంబరు 5 సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించే సదస్సులో దేశంలో అన్ని పెద్దల పార్టీల నేతలు పాల్గొంటారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నట్లు టీడీపీ వర్గాలు ధృవీకరించాయి. మోదీ పిలిచిన తర్వాత జగన్ వెళ్లకుండా ఉంటారా. జగన్, చంద్రబాబు ఓకే హాల్లో కూర్చోవాల్సి వచ్చినప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుందన్న చర్చ ఏపీలో జోరుగాసాగుంది. ఎడమొహం, పెడమొహంగా ఉంటారని కొందరు.. మొహానికి నవ్వు పులుముకుని మొక్కుబడిగా పలుకరించుకుంటారని మరికొందరు వాదిస్తున్నారు. ఏపీ వేరు, ఢిల్లీ వేరని.. అక్కడ ఇద్దరూ నేతలు స్నేహంగానే మాట్లాడుకుంటారని కొన్ని వర్గాలు వాదిస్తున్నాయి. ఇటీవలి కాలంలో దుష్టచతుష్టయం, బై బై బాబు లాంటి నినాదాలను వైసీపీ బాగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఎదురుపడినప్పుడు నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో మరి…

నిజానికి స్వాతంత్ర దినోత్సవం రోజున ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ రాజ్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జగన్, చంద్రబాబు హాజరయ్యారు.. ఇద్దరూ ఎదురు పడతారని భావించారు. అందుకు భిన్నంగా ముందు చంద్రబాబు వచ్చి మర్యాదపూర్వకంగా కాసేపు ఉండి వెళ్లిపోయారు. తర్వాతే జగన్ అక్కడకు చేరుకున్నారు. దానితో ఇద్దరు నేతలు కలిసే అవకాశం రాలేదు. ఢిల్లీలో అలా జరగకపోవచ్చు..

This post was last modified on November 25, 2022 11:17 am

Share

Recent Posts

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

2 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

3 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

3 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

4 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

4 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

5 hours ago