Political News

నాయకులు లేరు.. నిధులు లేవు..

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కేవీపీ రామచంద్రరావు హవా ఇంకా కొనసాగుతోంది వైఎస్ హయాంలో తెగ చక్రం తిప్పిన ఆయన, ప్రస్తుతం పార్టీ పతన దిశలో ఉన్నా కూడా తన పంతం నెగ్గించుకుంటున్నారు. తన వర్గానికి చెందిన గిడుగు రుద్రరాజుకు పీసీసీ అధ్యక్ష పదవి ఇప్పించుకున్నారు…. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేదా పల్లంరాజుకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని భావించిన నేపథ్యంలో అనూహ్యంగా గిడుగు రుద్రరాజుకు ఆ పదవి దక్కింది. రుద్రరాజు గతంలో ఎమ్మెల్సీగా సేవలు అందించారు. ఏఐసీసీ కార్యదర్శిగా ఒడిశా సహాయ ఇంఛార్జి బాధ్యతలు నిర్వహించారు. దివంగత నేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి, ఆయన ఆప్త మిత్రుడిగా చెబుతారు. ఈ క్రమంలోనే కేవీపీతో సన్నిహిత సంబంధాలున్నాయి..

నిజానికి ఖర్గే జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జరిగిన తొలి నియామకం ఇది. 2014…. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కించుకోలేకపోయింది. ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క లోక్ సభ సభ్యుడు కూడా లేరు.

విభజన సమయంలో తిరబడిన నేతల్లో చాలా మంది వెళ్లిపోయారు. నిధులు తీసుకొచ్చి పార్టీని నడిపించగలిగిన నేతలు ఇప్పుడు వైసీపీ, టీడీపీలో చేరిపోయారు. కాంగ్రెస్ కు ఎందుకు ఓటెయ్యాలని, ఎవరిని చూసి ఓటెయ్యాలని ప్రశ్నించుకుంటే సమాధానం దొరకదు. పైగా కాంగ్రెస్ పార్టీ దగ్గర నిధుల కొరత ఉందని చెబుతున్నారు. ప్రతిపక్షంలోకి వెళ్లిపోయిన ఆ పార్టీకి ఎవరూ ఫండ్ ఇవ్వడం లేదు..అయినా సరే 2024లో పార్టీ పరిస్థితి మెరుగు పడుతుందన్న ఆశతో కార్యవర్గాన్ని మార్చినట్లు చెబుతున్నారు.

కొత్తగా ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్గా పల్లంరాజు నియమితులయ్యారు. క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా హర్షకుమార్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. మీడియా, సోషల్ మీడియా కమిటీ చైర్మన్గా తులసిరెడ్డి నియమితులయ్యారు. ఐదుగురు వర్కింగ్ ప్రెసిండెట్స్, 18 మంది పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు, 34 మందితో కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయడం బాగానే ఉన్నా ప్రత్యర్థి పార్టీలు జోకులు వేస్తున్నాయి. వెళ్లిన వాళ్లు వెళ్లిపోగా కాంగ్రెస్ లో మిగిలిన వారందరికీ పదవులు వచ్చాయని కామెడీ చేస్తున్నారు.

చిన్నాభిన్నమైన పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలకు, ఈగోలకు తక్కువేమీ ఉండదు. రుద్రరాజు సహనాన్ని ప్రదర్శిస్తూ అందరినీ కలుపుకుపోవాలి. ఎవరు తమపై అలిగి కూర్చోకుండా చూసుకోవాలి. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదన్నర మాత్రమే ఉన్న నేపథ్యంలో విస్తృతంగా పర్యటనలు జరుపుతూ కాంగ్రెస్ కేడర్ ను ఉత్తేజ పరచాలి. మరి గిడుగు రుద్రరాజు అందుకు సిద్ధంగా ఉన్నారో లేదో చూడాలి..

This post was last modified on November 24, 2022 10:41 pm

Share

Recent Posts

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

2 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

2 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

2 hours ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

5 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

5 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

7 hours ago