Political News

నాయకులు లేరు.. నిధులు లేవు..

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కేవీపీ రామచంద్రరావు హవా ఇంకా కొనసాగుతోంది వైఎస్ హయాంలో తెగ చక్రం తిప్పిన ఆయన, ప్రస్తుతం పార్టీ పతన దిశలో ఉన్నా కూడా తన పంతం నెగ్గించుకుంటున్నారు. తన వర్గానికి చెందిన గిడుగు రుద్రరాజుకు పీసీసీ అధ్యక్ష పదవి ఇప్పించుకున్నారు…. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేదా పల్లంరాజుకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని భావించిన నేపథ్యంలో అనూహ్యంగా గిడుగు రుద్రరాజుకు ఆ పదవి దక్కింది. రుద్రరాజు గతంలో ఎమ్మెల్సీగా సేవలు అందించారు. ఏఐసీసీ కార్యదర్శిగా ఒడిశా సహాయ ఇంఛార్జి బాధ్యతలు నిర్వహించారు. దివంగత నేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి, ఆయన ఆప్త మిత్రుడిగా చెబుతారు. ఈ క్రమంలోనే కేవీపీతో సన్నిహిత సంబంధాలున్నాయి..

నిజానికి ఖర్గే జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జరిగిన తొలి నియామకం ఇది. 2014…. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కించుకోలేకపోయింది. ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క లోక్ సభ సభ్యుడు కూడా లేరు.

విభజన సమయంలో తిరబడిన నేతల్లో చాలా మంది వెళ్లిపోయారు. నిధులు తీసుకొచ్చి పార్టీని నడిపించగలిగిన నేతలు ఇప్పుడు వైసీపీ, టీడీపీలో చేరిపోయారు. కాంగ్రెస్ కు ఎందుకు ఓటెయ్యాలని, ఎవరిని చూసి ఓటెయ్యాలని ప్రశ్నించుకుంటే సమాధానం దొరకదు. పైగా కాంగ్రెస్ పార్టీ దగ్గర నిధుల కొరత ఉందని చెబుతున్నారు. ప్రతిపక్షంలోకి వెళ్లిపోయిన ఆ పార్టీకి ఎవరూ ఫండ్ ఇవ్వడం లేదు..అయినా సరే 2024లో పార్టీ పరిస్థితి మెరుగు పడుతుందన్న ఆశతో కార్యవర్గాన్ని మార్చినట్లు చెబుతున్నారు.

కొత్తగా ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్గా పల్లంరాజు నియమితులయ్యారు. క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా హర్షకుమార్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. మీడియా, సోషల్ మీడియా కమిటీ చైర్మన్గా తులసిరెడ్డి నియమితులయ్యారు. ఐదుగురు వర్కింగ్ ప్రెసిండెట్స్, 18 మంది పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు, 34 మందితో కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయడం బాగానే ఉన్నా ప్రత్యర్థి పార్టీలు జోకులు వేస్తున్నాయి. వెళ్లిన వాళ్లు వెళ్లిపోగా కాంగ్రెస్ లో మిగిలిన వారందరికీ పదవులు వచ్చాయని కామెడీ చేస్తున్నారు.

చిన్నాభిన్నమైన పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలకు, ఈగోలకు తక్కువేమీ ఉండదు. రుద్రరాజు సహనాన్ని ప్రదర్శిస్తూ అందరినీ కలుపుకుపోవాలి. ఎవరు తమపై అలిగి కూర్చోకుండా చూసుకోవాలి. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదన్నర మాత్రమే ఉన్న నేపథ్యంలో విస్తృతంగా పర్యటనలు జరుపుతూ కాంగ్రెస్ కేడర్ ను ఉత్తేజ పరచాలి. మరి గిడుగు రుద్రరాజు అందుకు సిద్ధంగా ఉన్నారో లేదో చూడాలి..

This post was last modified on November 24, 2022 10:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

3 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

5 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

9 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

9 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

10 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

10 hours ago