ఏపీ అధికార పార్టీ వైసీపీలో కీలక మార్పులు జరిగాయి. మార్పంటే మార్పే కాదు.. కీలక తలకాయలను సైతం పక్కన పెట్టేశారు. అత్యత ముఖ్యమైన ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యతల నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని వంటి ఫైర్ బ్రాండ్ నేతలకు కూడా చుక్కలు చూపించారు. మరో ఎనిమిది జిల్లాల పార్టీ అధ్యక్షులనూ మార్చేశారు.
“మీరు చేయగలిగితే చేయండి.. లేదా కొత్తవాళ్లకు బాధ్యతలు అప్పగిస్తా”… ఇదీ.. ఇటీవల గడప గడపకు కార్యక్రమంపై సమీక్ష సందర్భంగా సీఎం జగన్ నేతలకు ఇచ్చిన అల్టిమేటం. మరి నేతలు దీనిని కామన్ అనుకున్నారేమో.. తెలియదు కానీ, అధినేత మాత్రం అనుకున్నది చేసి.. మార్చేశారు! ఇప్పుడు పార్టీలో పెద్దఎత్తున మార్పులు చేర్పులు చేశారు.
ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి, అవంతి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, బుర్రా మధుసూదన్ యాదవ్, వై. బాలనాగిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిని.. జిల్లా పార్టీ బాధ్యతల నుంచి తొలగించారు. ఇక, కీలకమైన నియోజకవర్గం(చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు) కుప్పం వైసీపీ బాధ్యుడిగా ఉన్న ఎమ్మెల్సీ భరత్ను.. చిత్తూరు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తీసేశారు.
ప్రాంతీయ సమన్వయకర్తలుగా ఉన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్కుమార్ యాదవ్ను బాధ్యతల నుంచి తప్పించారు. అయితే, ఏ కారణం చేతో.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కి మాత్రమే కొనసాగింపు దక్కింది.
మార్పులు ఇవీ..
This post was last modified on November 24, 2022 3:54 pm
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న కేటీఆర్ ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. సభలు,…
గత ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించిన బేబీ సంచలనం ఏకంగా దాన్ని హిందీలో…
మహానటిలో సావిత్రిగా తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ…
'ఎక్కడున్నా భారత్కు తిరిగొచ్చి విచారణకు హాజరవ్వు. తప్పించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏ తప్పూ చేయకపోతే.. ఎందుకు భయపడుతున్నావ్? ఎన్ని రోజులు…
ఏపీలో ఎన్నికలు ముగిసి.. వారం రోజులు అయిపోయింది. ఈ నెల 13న నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా…
కాంగ్రెస్ హైకమాండ్ ఎంత చెప్పినా తెలంగాణలోని ఆ పార్టీకి చెందిన కొంతమంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని తెలిసింది.…