ఏపీ అధికార పార్టీ వైసీపీలో కీలక మార్పులు జరిగాయి. మార్పంటే మార్పే కాదు.. కీలక తలకాయలను సైతం పక్కన పెట్టేశారు. అత్యత ముఖ్యమైన ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యతల నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని వంటి ఫైర్ బ్రాండ్ నేతలకు కూడా చుక్కలు చూపించారు. మరో ఎనిమిది జిల్లాల పార్టీ అధ్యక్షులనూ మార్చేశారు.
“మీరు చేయగలిగితే చేయండి.. లేదా కొత్తవాళ్లకు బాధ్యతలు అప్పగిస్తా”… ఇదీ.. ఇటీవల గడప గడపకు కార్యక్రమంపై సమీక్ష సందర్భంగా సీఎం జగన్ నేతలకు ఇచ్చిన అల్టిమేటం. మరి నేతలు దీనిని కామన్ అనుకున్నారేమో.. తెలియదు కానీ, అధినేత మాత్రం అనుకున్నది చేసి.. మార్చేశారు! ఇప్పుడు పార్టీలో పెద్దఎత్తున మార్పులు చేర్పులు చేశారు.
ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి, అవంతి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, బుర్రా మధుసూదన్ యాదవ్, వై. బాలనాగిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిని.. జిల్లా పార్టీ బాధ్యతల నుంచి తొలగించారు. ఇక, కీలకమైన నియోజకవర్గం(చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు) కుప్పం వైసీపీ బాధ్యుడిగా ఉన్న ఎమ్మెల్సీ భరత్ను.. చిత్తూరు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తీసేశారు.
ప్రాంతీయ సమన్వయకర్తలుగా ఉన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్కుమార్ యాదవ్ను బాధ్యతల నుంచి తప్పించారు. అయితే, ఏ కారణం చేతో.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కి మాత్రమే కొనసాగింపు దక్కింది.
మార్పులు ఇవీ..
This post was last modified on November 24, 2022 3:54 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…