Political News

నాకు-మానాన్న‌కు సంబంధం లేదు: వైసీపీ ఎమ్మెల్యే

ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు విషయంలో తన తండ్రి వసంత నాగేశ్వరరావు వైసీపీ ప్ర‌భుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఖండించారు. తన తండ్రి వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, ఆయన వ్యక్తిగత అభిప్రాయంతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. “నాకు-మానాన్న‌కు రాజ‌కీయంగా సంబందం లేదు. ఆయ‌న నోటికి తాళం వేయలేను” అని అన్నారు. అయితే, తన తండ్రిగా ఆయ‌న‌ను ఎప్పుడు గౌరవిస్తానన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలను తాను పట్టించుకోనని, సీఎం జగన్ మాటే తనకు శిరోధార్యమని స్పష్టం చేశారు.

నియోజకవర్గంలో కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమేనని, కొందరు కావాలనే సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. ఒక వర్గం పని కట్టుకొని వర్గ విభేదాలు సృష్టిస్తున్నారన్నారు. ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లే మూడు వారాలు నియోజకవర్గానికి దూరంగా ఉన్నట్లు చెప్పారు. తన నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చానన్నారు.

తన జీవితం అంతా వైసీపీతోనేనని, ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేస్తానని, ఇతరులకు ఇస్తే సహకరిస్తానన్నారు. త్వరలోనే పార్టీ అధిష్టానాన్ని కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులను వివరిస్తానన్నారు. సీఎం బీజీగా ఉండటంతో ఇప్పటి వరకు ఆయనను కలవలేదని పేర్కొన్నారు. చాడీలు చెప్పే మనస్తత్వం తనది కాదని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.

మ‌రోవైపు ఆయ‌న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో ఉన్న చికాకులపై సజ్జలకు వివరించారు. మంత్రి జోగి ర‌మేష్‌పై విమర్శల విషయాన్ని సజ్జలకు వివరించానన్నారు. అన్ని వర్గాలకు తన నియోజకవర్గంలో సమ ప్రాధాన్యం ఉందని… అయినా తనకు చికాకులు తప్పడం లేదనే విషయాన్ని సజ్జలకు చెప్పానన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే వెల్లడించారు.

This post was last modified on November 24, 2022 9:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సునీతా 9 నెలల అంతరిక్ష ప్రయాణం… సంపాదన ఎంతో తెలుసా?

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ ఎనిమిది రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, అనుకోని సమస్యల…

33 minutes ago

ఫ్యామిలీకి దూరంగా.. బీసీసీఐ నిబంధనపై కోహ్లీ అసహనం!

టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ…

1 hour ago

లాంఛనం పూర్తి… రాజధానికి రూ.11 వేల కోట్లు

నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…

2 hours ago

అక్క బదులు తమ్ముడు… మరో వివాదంలో భూమా

టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…

2 hours ago

ఎల్2….సినిమాని తలదన్నే బిజినెస్ డ్రామా

మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ వచ్చే వారం మార్చి 27 విడుదల కానుంది. ఇది ఎప్పుడో ప్రకటించారు. అయితే నిర్మాణ…

3 hours ago

కోర్ట్ – టాలీవుడ్ కొత్త ట్రెండ్ సెట్టర్

ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా, పరిచయం లేని జంటను తీసుకుని, విలన్ ని హైలైట్ చేస్తూ ఒక చిన్న బడ్జెట్…

3 hours ago