Political News

నాకు-మానాన్న‌కు సంబంధం లేదు: వైసీపీ ఎమ్మెల్యే

ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు విషయంలో తన తండ్రి వసంత నాగేశ్వరరావు వైసీపీ ప్ర‌భుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఖండించారు. తన తండ్రి వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, ఆయన వ్యక్తిగత అభిప్రాయంతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. “నాకు-మానాన్న‌కు రాజ‌కీయంగా సంబందం లేదు. ఆయ‌న నోటికి తాళం వేయలేను” అని అన్నారు. అయితే, తన తండ్రిగా ఆయ‌న‌ను ఎప్పుడు గౌరవిస్తానన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలను తాను పట్టించుకోనని, సీఎం జగన్ మాటే తనకు శిరోధార్యమని స్పష్టం చేశారు.

నియోజకవర్గంలో కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమేనని, కొందరు కావాలనే సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. ఒక వర్గం పని కట్టుకొని వర్గ విభేదాలు సృష్టిస్తున్నారన్నారు. ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లే మూడు వారాలు నియోజకవర్గానికి దూరంగా ఉన్నట్లు చెప్పారు. తన నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చానన్నారు.

తన జీవితం అంతా వైసీపీతోనేనని, ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేస్తానని, ఇతరులకు ఇస్తే సహకరిస్తానన్నారు. త్వరలోనే పార్టీ అధిష్టానాన్ని కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులను వివరిస్తానన్నారు. సీఎం బీజీగా ఉండటంతో ఇప్పటి వరకు ఆయనను కలవలేదని పేర్కొన్నారు. చాడీలు చెప్పే మనస్తత్వం తనది కాదని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.

మ‌రోవైపు ఆయ‌న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో ఉన్న చికాకులపై సజ్జలకు వివరించారు. మంత్రి జోగి ర‌మేష్‌పై విమర్శల విషయాన్ని సజ్జలకు వివరించానన్నారు. అన్ని వర్గాలకు తన నియోజకవర్గంలో సమ ప్రాధాన్యం ఉందని… అయినా తనకు చికాకులు తప్పడం లేదనే విషయాన్ని సజ్జలకు చెప్పానన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే వెల్లడించారు.

This post was last modified on November 24, 2022 9:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`పీపీపీ`కి కేంద్రం అండ‌… బాబుకు భ‌రోసా… !

ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…

12 minutes ago

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

50 minutes ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

4 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

5 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

5 hours ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

5 hours ago