ఏపీ అధికార పార్టీ వైఎస్సార్సీపీలో కీలక నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి సెల్ఫోన్ పోయినట్టు ఆయన వ్యక్తిగత సహాయకుడు లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 21 నుంచి సెల్ఫోన్ కనిపించడం లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 12 ప్రో సెల్ఫోన్ పోయిందని విజయసాయి పీఏ తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫోన్ అత్యంత విలువైన సమాచారం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి సీఎం జగన్కు ఎంత భద్రత ఉంటుందో వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డికి కూడా దాదాపు అంతే భద్రత ఉంటుంది. ఆయనకు ఆరుగురు వరకు వ్యక్తిగత సహాయకులు ఉన్నారు. ఆయన వెంట ఎప్పుడూ నలుగురు ఉంటారు. ఇక, ఆయన అప్పాయింట్మెంట్ కావాలన్నా.. అంత ఈజీఏమీ కాదు. ఎంతో పక్కా సమాచారం, అవసరం ఉంటేనే ఆయన అప్పాయింట్మెంట్ ఇస్తారు. మరి అలాంటి నాయకుడి అత్యంత విలువైన సెల్ ఫోన్ పోయిందంటే ఇదేమీ తేలికగా తీసుకునే విషయం కాదని అంటున్నారు పరిశీలకులు.
కానీ, సెల్ ఫోన్ పోయిందని ఫిర్యాదు చేశారు. దీని వెనుక ఏదైనా జరిగిందా? జరుగుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి కుటుంబ బంధువు శరత్ చంద్రారెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. దరిమిలా ఈ కేసుతో సంబంధం ఉన్న అనేక మందిని వరుస పెట్టి విచారిస్తోంది. అదేవిధంగా సాయిరెడ్డి బంధువు కాబట్టి.. ఈయనను కూడా విచారించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా సాయిరెడ్డి ఫోన్ మిస్ కావడం.. దీనిపై హుటాహుటిన పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటివి తెరవెనుక వ్యూహం ఉందా? అనే సందేహాలకు బలాన్ని చేకూరుస్తుండడం గమనార్హం. మరి చూడాలి ఏం జరుగుతుందో.
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…