ఏపీ అధికార పార్టీ వైఎస్సార్సీపీలో కీలక నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి సెల్ఫోన్ పోయినట్టు ఆయన వ్యక్తిగత సహాయకుడు లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 21 నుంచి సెల్ఫోన్ కనిపించడం లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 12 ప్రో సెల్ఫోన్ పోయిందని విజయసాయి పీఏ తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫోన్ అత్యంత విలువైన సమాచారం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి సీఎం జగన్కు ఎంత భద్రత ఉంటుందో వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డికి కూడా దాదాపు అంతే భద్రత ఉంటుంది. ఆయనకు ఆరుగురు వరకు వ్యక్తిగత సహాయకులు ఉన్నారు. ఆయన వెంట ఎప్పుడూ నలుగురు ఉంటారు. ఇక, ఆయన అప్పాయింట్మెంట్ కావాలన్నా.. అంత ఈజీఏమీ కాదు. ఎంతో పక్కా సమాచారం, అవసరం ఉంటేనే ఆయన అప్పాయింట్మెంట్ ఇస్తారు. మరి అలాంటి నాయకుడి అత్యంత విలువైన సెల్ ఫోన్ పోయిందంటే ఇదేమీ తేలికగా తీసుకునే విషయం కాదని అంటున్నారు పరిశీలకులు.
కానీ, సెల్ ఫోన్ పోయిందని ఫిర్యాదు చేశారు. దీని వెనుక ఏదైనా జరిగిందా? జరుగుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి కుటుంబ బంధువు శరత్ చంద్రారెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. దరిమిలా ఈ కేసుతో సంబంధం ఉన్న అనేక మందిని వరుస పెట్టి విచారిస్తోంది. అదేవిధంగా సాయిరెడ్డి బంధువు కాబట్టి.. ఈయనను కూడా విచారించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా సాయిరెడ్డి ఫోన్ మిస్ కావడం.. దీనిపై హుటాహుటిన పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటివి తెరవెనుక వ్యూహం ఉందా? అనే సందేహాలకు బలాన్ని చేకూరుస్తుండడం గమనార్హం. మరి చూడాలి ఏం జరుగుతుందో.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…