Political News

సాయిరెడ్డి సెల్ పోయింది.. అనేక సందేహాలు?!

ఏపీ అధికార పార్టీ వైఎస్సార్సీపీలో కీల‌క నాయ‌కుడు, ఎంపీ విజయసాయిరెడ్డి సెల్ఫోన్ పోయిన‌ట్టు ఆయన వ్యక్తిగత సహాయకుడు లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 21 నుంచి సెల్ఫోన్ కనిపించడం లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 12 ప్రో సెల్ఫోన్ పోయిందని విజయసాయి పీఏ తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫోన్ అత్యంత విలువైన సమాచారం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

వాస్త‌వానికి సీఎం జ‌గ‌న్‌కు ఎంత భ‌ద్ర‌త ఉంటుందో వైసీపీలో నెంబ‌ర్ 2గా ఉన్న విజ‌య‌సాయిరెడ్డికి కూడా దాదాపు అంతే భ‌ద్ర‌త ఉంటుంది. ఆయ‌న‌కు ఆరుగురు వ‌ర‌కు వ్య‌క్తిగ‌త స‌హాయ‌కులు ఉన్నారు. ఆయ‌న వెంట ఎప్పుడూ న‌లుగురు ఉంటారు. ఇక‌, ఆయ‌న అప్పాయింట్మెంట్ కావాల‌న్నా.. అంత ఈజీఏమీ కాదు. ఎంతో ప‌క్కా స‌మాచారం, అవ‌స‌రం ఉంటేనే ఆయ‌న అప్పాయింట్‌మెంట్ ఇస్తారు. మ‌రి అలాంటి నాయ‌కుడి అత్యంత విలువైన‌ సెల్ ఫోన్ పోయిందంటే ఇదేమీ తేలిక‌గా తీసుకునే విష‌యం కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

కానీ, సెల్ ఫోన్ పోయింద‌ని ఫిర్యాదు చేశారు. దీని వెనుక ఏదైనా జ‌రిగిందా? జ‌రుగుతుందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో విజ‌య‌సాయిరెడ్డి కుటుంబ బంధువు శ‌ర‌త్ చంద్రారెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ద‌రిమిలా ఈ కేసుతో సంబంధం ఉన్న అనేక మందిని వ‌రుస పెట్టి విచారిస్తోంది. అదేవిధంగా సాయిరెడ్డి బంధువు కాబ‌ట్టి.. ఈయ‌న‌ను కూడా విచారించే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో అనూహ్యంగా సాయిరెడ్డి ఫోన్ మిస్ కావ‌డం.. దీనిపై హుటాహుటిన పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం వంటివి తెర‌వెనుక వ్యూహం ఉందా? అనే సందేహాల‌కు బ‌లాన్ని చేకూరుస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చూడాలి ఏం జ‌రుగుతుందో.

Share
Show comments
Published by
satya

Recent Posts

సత్యదేవ్ ఇంకొంచెం ఆగాల్సింది

ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత…

17 mins ago

నీ ముగ్గురు భార్యలకూ టికెట్లు ఇప్పిస్తా .. ఓకేనా ?!

‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…

3 hours ago

ఈ రెండే హాట్ టాపిక్‌

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఏపీలో రెండు సంచ‌ల‌న విష‌యాల‌పై నెటిజ‌న్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జ‌గ‌న్ విదేశీ…

3 hours ago

మాఫియాల‌కు .. కౌంట్ డౌన్ మొద‌లైంది: మోడీ వార్నింగ్‌

ఏపీలో మాఫియాలు చెల‌రేగిపోతున్నాయ‌ని.. ఇసుక మాఫియా కార‌ణంగా అన్న‌మ‌య్య డ్యాం కొట్టుకుపోయింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో…

4 hours ago

త‌మ్ముడ‌ని కూడా చూడ‌వా అక్కా: అవినాష్ రెడ్డి

"నా అక్క‌లు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. త‌మ్ముడ‌ని కూడా చూడ‌కుండా మాట‌లు…

5 hours ago

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు రిలీఫ్‌

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…

6 hours ago