Political News

సాయిరెడ్డి సెల్ పోయింది.. అనేక సందేహాలు?!

ఏపీ అధికార పార్టీ వైఎస్సార్సీపీలో కీల‌క నాయ‌కుడు, ఎంపీ విజయసాయిరెడ్డి సెల్ఫోన్ పోయిన‌ట్టు ఆయన వ్యక్తిగత సహాయకుడు లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 21 నుంచి సెల్ఫోన్ కనిపించడం లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 12 ప్రో సెల్ఫోన్ పోయిందని విజయసాయి పీఏ తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫోన్ అత్యంత విలువైన సమాచారం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

వాస్త‌వానికి సీఎం జ‌గ‌న్‌కు ఎంత భ‌ద్ర‌త ఉంటుందో వైసీపీలో నెంబ‌ర్ 2గా ఉన్న విజ‌య‌సాయిరెడ్డికి కూడా దాదాపు అంతే భ‌ద్ర‌త ఉంటుంది. ఆయ‌న‌కు ఆరుగురు వ‌ర‌కు వ్య‌క్తిగ‌త స‌హాయ‌కులు ఉన్నారు. ఆయ‌న వెంట ఎప్పుడూ న‌లుగురు ఉంటారు. ఇక‌, ఆయ‌న అప్పాయింట్మెంట్ కావాల‌న్నా.. అంత ఈజీఏమీ కాదు. ఎంతో ప‌క్కా స‌మాచారం, అవ‌స‌రం ఉంటేనే ఆయ‌న అప్పాయింట్‌మెంట్ ఇస్తారు. మ‌రి అలాంటి నాయ‌కుడి అత్యంత విలువైన‌ సెల్ ఫోన్ పోయిందంటే ఇదేమీ తేలిక‌గా తీసుకునే విష‌యం కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

కానీ, సెల్ ఫోన్ పోయింద‌ని ఫిర్యాదు చేశారు. దీని వెనుక ఏదైనా జ‌రిగిందా? జ‌రుగుతుందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో విజ‌య‌సాయిరెడ్డి కుటుంబ బంధువు శ‌ర‌త్ చంద్రారెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ద‌రిమిలా ఈ కేసుతో సంబంధం ఉన్న అనేక మందిని వ‌రుస పెట్టి విచారిస్తోంది. అదేవిధంగా సాయిరెడ్డి బంధువు కాబ‌ట్టి.. ఈయ‌న‌ను కూడా విచారించే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో అనూహ్యంగా సాయిరెడ్డి ఫోన్ మిస్ కావ‌డం.. దీనిపై హుటాహుటిన పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం వంటివి తెర‌వెనుక వ్యూహం ఉందా? అనే సందేహాల‌కు బ‌లాన్ని చేకూరుస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చూడాలి ఏం జ‌రుగుతుందో.

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

15 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

59 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago