Political News

వేటు వేసిన వేళ పైలెట్ పయనమెటు?

రాజస్థాన్ రాజకీయం మరిన్ని మలుపులు తిరిగింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభంపై అధినాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

తిరుగుబావుటా ఎగరవేసిన యువనేత సచిన్ పైలట్ పై వేటు వేయటంతో పాటు.. ఆయన్ను ఉపముఖ్యమంత్రి పదవి నుంచే కాదు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు అత్యంత సన్నిహితులైన విశ్వేంద్రసింగ్.. రమేశ్ మీనా ఇద్దరు మంత్రులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అదే సమయంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కు అండగా నిలిచిన పార్టీ.. మరిన్ని కీలక నిర్ణయాలకు తాను సిద్ధమన్న సంకేతాల్ని ఇచ్చింది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రెండుసార్లు సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించటం.. ఆ రెండు సమావేశాలకు సచిన్ పైలెట్ హాజరు కాకపోవటం ఒక ఎత్తు అయితే.. కాంగ్రెస్ అధినాయకత్వం తరఫున రంగంలోకి దిగిన రాహుల్.. ప్రియాంకలు ఎంత చెప్పినా వినని ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహంలో ఉన్నట్లు చెబుతున్నారు.

రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న పైలెట్ తో పాటు.. ఆయనకు దన్నుగా ఉన్న ఇద్దరు మంత్రుల్ని తొలగిస్తున్నట్లుగా రాష్ట్ర గవర్నర్ కు ప్రభుత్వం లేఖను అందించింది. ఇదిలా జరిగిన వెంటనే సచిన్ పైలెట్ తన ట్విట్టర్ ఖాతాలోని ప్రొఫైల్ ను మార్చుకోవటం గమనార్హం.

తన హోదాల్ని మార్చిన ఆయన.. తనను తాను టోంక్ ఎమ్మెల్యేగా.. కేంద్ర మాజీ మంత్రిగా మాత్రమే హోదాల్ని ఆయన పేర్కొన్నారు. ఆయన బీజేపీలోకి చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే.. అలాంటిదేమీ జరగదని పైలట్ వర్గీయులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే..సచిన్ పైలట్ తమ పార్టీలోకి రావాలనుకుంటే ద్వారాలు తెరిచే ఉంటాయని పేర్కొన్నారు.

2023లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిలకు ఏడాది ముందుగా తనను సీఎంను చేయాలన్న డిమాండ్ పార్టీ అధినాయకత్వాన్ని చిరాకు పుట్టించినట్లు చెబుతున్నారు. బీజేపీ ట్రాప్ లో ఆయన పూర్తిగా పడిపోయినట్లుగా చెబుతున్నారు. తనతో పాటు తనకు అండగా నిలిచిన పదహారు మంది ఎమ్మెల్యేలకు గెహ్లోత్ సర్కారులో గౌరవప్రదమైన స్థానాలు కల్పించాలన్న డిమాండ్ కు అధినాయకత్వం ససేమిరా అంది.

ఇలాంటి క్రమశిక్షణరాహిత్యం పార్టీకి ఏ మాత్రం మేలు చేయదన్న ఉద్దేశంతోనే కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. తమ పార్టీకి ఇప్పటికి 122 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు కాంగ్రెస్ చెబుతుంటే.. అసెంబ్లీ వేదికగా చేసుకొని ఆ పార్టీ తన మెజార్టీ నిరూపించుకోవాలని విపక్ష బీజేపీ డిమాండ్ చేస్తోంది.రాజస్థాన్లో బీజేపీ ఆటలు సాగవని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.

తన చర్యల కత్తికి మరింత పదును పెడుతూ కాంగ్రెస్ అధినాయకత్వం తాజాగా మరిన్ని నిర్ణయాల్ని తీసుకున్నారు. సచిన్ పైలట్ పై వేటు వేసిన గంటల వ్యవధిలోనే ఆయనకు అండగా నిలిచిన సంజయ్ ఝూను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం పార్టీలో ఇప్పుడు సంచలనంగా మారింది. అసమ్మతి బెదిరింపులకు పార్టీ లొంగదన్న సంకేతాలతో పాటు.. గీత దాటిన వారు ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవన్న సందేశాన్ని తాజా చర్యతో స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు.

This post was last modified on July 15, 2020 1:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సీనియర్ స్టార్ల సంక్రాంతి… క్లాష్ సాధ్యమేనా

పెళ్లి లేదు ప్రెగ్నెంటూ లేదు, కొడుకు పేరు కృష్ణమనోహర్ అనేది కొత్త సామెత. కొన్ని రిలీజ్ డేట్ల వ్యవహారం చూస్తుంటే…

2 minutes ago

ఫ‌లించిన ప‌వ‌న్ ప్ర‌య‌త్నం.. బ‌డ్జెట్‌లో `కొబ్బ‌రి`కి కీల‌క స్థానం

ఏపీలోని కోన‌సీమ ప్రాంతంలో కొబ్బ‌రి సాగు ఎక్కువ‌. దేశంలో కేర‌ళ త‌ర్వాత‌.. కోన‌సీమ‌లో భారీ ఎత్తున కొబ్బ‌రి సాగు చేస్తున్నారు.…

51 minutes ago

వరప్రసాద్ గారు కాస్త ఊపిరినిచ్చారు

సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…

60 minutes ago

మూడోసారి దొరికిపోయిన మర్దాని

ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…

1 hour ago

శాంతి కోసం చాలా కష్టపడ్డారు కానీ

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…

3 hours ago

పాక్ నక్క బుద్ధి… నష్టం తట్టుకోలేరు

టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…

3 hours ago