సభ ఏదైనా.. సమావేశం ఎలాంటిదైనా సీఎం జగన్ ఇటీవలకాలంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల పశ్చిమ గోదావరిజిల్లాలోని నరసాపురంలో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన జగన్.. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నియోజకవర్గంలో నిర్వహించిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షణ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా రాజకీయ వేదికగా మారేశారు.
ఈ సందర్భంగా జగన్.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాజకీయమంటే జవాబు దారీతనమన్న జగన్.. ఇది లేని వారే.. ఇప్పుడు అధికారం కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబులాగా తానుదుష్టచతుష్టయాన్ని నమ్ముకోలేదన్నారు. భూహక్కు.. అంటే తన భూమిపై తనకు సంపూర్ణ హక్కులు ఉన్నవాడన్న జగన్, తన భూమిపై ఎలాంటి హక్కులు లేకుండా అనుభవించేవాడు భూ కబ్జాదారుడని అన్నారు. ఈ మాటలను చంద్రబాబుకు ముడిపెడుతూ.. కీలక వ్యాఖ్యలుచేశారు.
రాజకీయ కబ్జాదారు చంద్రబాబు అని.. ఆయన పార్టీ కానిదానిని ఆయన ఏలుతున్నాడని అన్నారు. భూహక్కుదారులు అంటే.. ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అని వ్యాఖ్యానించారు. తమ పార్టీలను తాము పెట్టుకుని ప్రజల్లో గెలిచిన వారని తెలిపారు. మోసం, వెన్నుపోటు పొడిచేవారికి మరో ఛాన్స్ ఇస్తారా? అని ప్రశ్నించారు. మంచి చేసిన మీ బిడ్డ(జగన్)ను ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు.
తన భార్య కోసం యుద్ధం చేస్తే రాముడంటారు. పరాయి స్త్రీని ఎత్తుకు పోతే రావణుడంటారు. రాముడు దేవుడయ్యాడు. రావణుడిని, దుర్యోధనుడిని ఎవరూ సరమర్థించబోరని వ్యాఖ్యానించారు. బాబూ మీ సేవలుమాకొద్దు.. అంటూ బాబుకు బైబై చెప్పి ఇంటికి పంపించాలో వద్దో మీరే ఆలోచించుకోండి.. అని జగన్ పిలుపునిచ్చారు.
హఠాత్తుగా ఇరుముడి విడుదల తేదీ ప్రకటించేశారు. ఆగస్ట్ 21 థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా…
సోషల్ మీడియా టాక్స్, యూట్యూబ్ రివ్యూల హడావిడి ఎలా ఉన్నా పెద్ది బలంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న వైనం స్పష్టం.…
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ రాజకీయాలు వేడెక్కాయి. గత రెండేళ్ల పాల నలో తాను చేసిన అభివృద్ధిని చూపించేందుకు..…
ఏపీ రాజధాని అమరావతికి అంత భూమి ఎందుకు? ఇంత భూమి ఎందుకు? ఏం చేసుకుంటారు.? 500 ఎకరాలు చాలవా? వెయ్యి…
ఫాం హౌస్లో కేడీ- ఢిల్లీలో మోడీ.. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. తెలంగాణలో అభివృద్ధిని ఆపలేరు అని సీఎం రేవంత్…
ఈ నెల 25 నుంచి టీడీపీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటింటికీ.. పేరుతో ఓ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు…