వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలని పక్కాగా నిర్ణయించుకుని, ఆదిశగానే అడుగులు వేస్తున్న చంద్రబాబు.. తాజాగా మరోసారి తమ్ముళ్ల పరిస్థితిని, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని అంచనా వేయించుకుని సర్వే రిపోర్టును తెప్పించుకున్నట్టు టీడీపీ సీనియర్లు చెబుతున్నారు. దీంతో ఎవరికి టికెట్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వకూడదో ఇక, కుండబద్దలు కొట్టినట్టు ఆయన నిర్ణయించేస్తారనే టాక్ వినిపిస్తోంది. దీంతో టికెట్పై ఆశలు పెట్టుకున్న చాలా మందికి వస్తుందో రాదో అనే ఫీవర్ పట్టుకోవడం గమనార్హం.
తాజాగా చంద్రబాబుకు అందిన సర్వే రిపోర్ట్ ఆధారంగా రాబోయే ఎన్నికల్లో ధన బలం, అంగబలం ఉన్న వారికే టికెట్లు కేటాయించాలని భావిస్తున్నట్టు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. జిల్లాల్లో ఇప్పటికే టీడీపీ రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ టీమ్ క్షేత్రస్థాయిలోపర్యటించింది. అంతర్గత రహస్య సర్వేలో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ మాజీ నేతలకు సానుకూల పరిస్థితులు లేనట్లు గుర్తించిందని సమాచారం. ఈ పరిణామాలతో తమ భవిష్యత్ ఎలా ఉండబోతుందోనని తమ్ముళ్లు టెన్షన్ పడుతున్నారు.
దీంతో టీడీపీలో చక్రం తిప్పిన, క్రియాశీలకంగా వ్యవహరించిన మాజీలకు రాబోయే ఎన్నికల్లో మొండి చేయి తప్పేటట్లు లేదు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ‘కొత్త ముఖాల’ను తెరమీదికి తీసుకురావాలని నిర్ణయించారు. అయితే, పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లో కొత్త ముఖాలు కూడా ప్రముఖంగా దూసుకుపోవడం లేదని రాబిన్ బృందం స్పష్టం చేసిందని సమాచారం.
సీటు తమదేనని అనుకుంటున్న సిట్టింగ్ మాజీలు యువతను పైకి ఎదగనివ్వడం లేదని సర్వే స్పష్టం చేసింది. దీంతో యువ ఆశావహులు సైతం అంతర్మథనంలో పడ్డారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డామని చెబుతున్నా.. టికెట్ దక్కించుకునే ఛాన్సు కోల్పోతున్నామనే బెంగ పట్టుకుంది. వరుస ఓటమి చెందిన నేతలకు ఈ దఫా టికెట్ లేదని ఇప్పటికే స్పష్టం చేయడంతో చాలా జిల్లాల్లో నేతలు అంతర్మథనం చెందుతున్నారు. ఎలా చూసినా.. మొత్తం ఉమ్మడి 13జిల్లాల పరిధిలో పదుల సంఖ్యలో నాయకులకు ఇప్పుడు చంద్రబాబు ధైర్యం చెప్పి.. నడిపించాల్సిన అవసరం ఉందని.. సర్వే స్పష్టం చేయడం గమనార్హం. మరి ఏం చేస్తారో చూడాలి.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…