Political News

ఏపీలో వందేళ్ల త‌ర్వాత‌.. ఈ క్రెడిట్ జ‌గ‌న్‌దే బ్రో!

వందేళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా ఏపీలో దాదాపు చేపట్టిన సమగ్ర భూముల రీ సర్వే ప్రారంభ‌మైంది. వాస్త‌వానికి గ‌త ఏడాది ట్ర‌య‌ల్ ర‌న్‌గా ప్రారంభించిన ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా ముందుకు సాగింది. తాజాగా శ్రీకాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట‌లో సీఎం జ‌గ‌న్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించి.. కొంద‌రికి హ‌క్కు ప‌త్రాలు మంజూరు చేశారు. తొలిదశలో 2 వేల గ్రామాల్లో స‌ర్వే పూర్తి అయింది. ఆధునిక డిజిటల్‌ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా భూసర్వే చేపడుతున్నామ‌ని తెలిపారు. 17 వేలకు పైగా రెవిన్యూ గ్రామాల్లో భూములు సర్వే చేస్తున్నామ‌న్నారు. “రెండేళ్ల కింద‌ట‌ గొప్ప కార్యక్రమాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభించాం. తొలిదశలో రెండు వేల రెవిన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన జరిగాయి. 7,92,238 మంది రైతులకు భూహక్కు పత్రాలు అందించాం. ఫిబ్రవరిలో రెండో దశలో 4వేల గ్రామాల్లో సర్వే. మే 2023 కల్లా 6వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు. ఆగస్ట్‌, 2023 కల్లా 9వేల గ్రామాల్లో సర్వే పూర్తి అవుతుంది” అని సీఎం జగన్‌ తెలిపారు.

అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా మార్కింగ్‌

వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రమంతటా సమగ్ర సర్వే పూర్తవుతుంది. సివిల్‌ కేసుల్లో ఎక్కువ భూవివాదాలే ఉన్నాయి. సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. ఆ పరిస్థితులను మార్చాలని అడుగులు ముందుకు వేస్తున్నామని సీఎం జ‌గ‌న్ అన్నారు. రాష్ట్రమంతటా భూములకు కొలతలు వేసి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా మార్కింగ్‌ ఇస్తామ‌ని తెలిపారు. ప్రతి కమతానికీ ఒక ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ ఇస్తామ‌న్నారు.

1000 కోట్ల‌తో ..

దేశంలో ఎక్కడాలేని విధంగా చేస్తున్న ఈ స‌ర్వే కోసం 13,849 మంది సర్వేయర్లను నియమించారు. రూ.1000 కోట్లతో ఈ కార్యక్రమం చేపట్టారు. సర్వే పూర్తయ్యాక భూ హక్కు పత్రాలను రైతులకు అందిస్తారు. క్రయవిక్రయాలన్నీ గ్రామాల్లో జరిగేలా కొత్త మార్పునకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లోని సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఎవరూ మోసం చేయడానికి వీళ్లేకుండా వ్యవస్థను మార్చుతున్నామ‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు. లంచాలకు ఎక్కడా తావులేదని పేర్కొన్నారు.

This post was last modified on November 23, 2022 2:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

1 hour ago

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

2 hours ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

3 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

5 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

7 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

12 hours ago