Political News

ఇప్ప‌టానికి మ‌రోసారి ప‌వ‌న్.. ఎప్పుడు? ఎందుకు?

‘ఇప్ప‌టం’ ఈ మాట కొన్ని రోజుల పాటు ఏపీ రాజ‌కీయాల‌ను కుదిపేసిన విష‌యం తెలిసిందే. ఉమ్మడి గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఈ గ్రామంలో ప్ర‌భుత్వం ర‌హ‌దారి విస్త‌ర‌ణ అంటూ కొంద‌రి ఇళ్ల‌ను కూల్చివేయ‌డం రాష్ట్రంలో రాజ‌కీయ పెనుదుమారానికి దారితీసింది. త‌న పార్టీ ఆవిర్భావ స‌ద‌స్సుకు భూములు ఇచ్చార‌నే కార‌ణంగానే రైతుల ఇళ్ల‌ను ప్ర‌భుత్వం కూల్చేసిందని ప‌వ‌న్ ఆరోపించారు. అయితే, ఇదంతా ఎప్పుడో తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. మొత్తంగా ఈ గ్రామం రాజ‌కీయ ర‌ణ‌రంగానికి కొన్ని రోజులు వేదిక‌గా మారింది.

ఇక‌, ఇప్పుడు మ‌రోసారి ఇప్పటంలో ప‌వ‌న్ ప‌ర్య‌టించ‌నున్నారు. ఇక్క‌డి ఇళ్ల‌ కూల్చివేతల్లో నష్టపోయిన వారికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పరిహారం అందించనున్నారు. 27న మంగళగిరి రానున్న జనసేనాని.. తాను ప్రకటించిన లక్ష రూపాయల పరిహారాన్ని ఇవ్వనున్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీకి చెందిన పలువురు కార్యకర్తలు తమకు పరిహారం వద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో పరిహారం తీసుకునేందుకు ఎంతమంది అంగీకరిస్తారన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి పార్టీ తరపున పరిహారం అందించనున్నారు. ఈ నెల 4వ తేదీన ఇప్పటం గ్రామంలో అధికారులు రహదారి విస్తరణ పేరిట ఇళ్లు, ఇతర నిర్మాణాలను తొలగించిన సంగతి తెలిసిందే. అప్పట్లో దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. పవన్ కల్యాణ్ స్వయంగా ఇప్పటం గ్రామానికి వచ్చి బాధితులను పరామర్శించి.. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చినందునే ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చివేశారని పవన్ ఆరోపించారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. ఆ పరిహారాన్ని అందించేందుకు పవన్ కల్యాణ్ ఈ నెల 27న రానున్నారు. అయితే ఈ పరిహారాన్ని పవనే స్వయంగా ఇప్పటం వెళ్లి అందించే అవకాశముందని.. వీలుకాని పక్షంలో బాధితులను మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి పిలిపించి అందించనున్నట్లు సమాచారం.

పవన్ పరిహారం ప్రకటించిన తర్వాత తమకు అవేమీ వద్దని వైసీపీకి చెందిన కొందరు ఫ్లెక్సీలు కట్టారు. దీంతో పరిహారం ఎందరికి ఇవ్వాలనే విషయంలో స్పష్టత రాలేదు. బాధితుల నుంచి వివరాలు సేకరించి ఎవరైతే పరిహారం తీసుకునేందుకు అంగీకరిస్తారో వారికి ఇవ్వాలని జనసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతమందికి అందించేది రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తానికి మ‌రోసారి ఇప్ప‌టం రాజ‌కీయ వేదిక‌పైకి వ‌చ్చింది. ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on November 22, 2022 9:43 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ప్రేమికుడుని ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు

దర్శకుడు శంకర్ రెండో సినిమాగా ప్రేమికుడు మీద మూవీ లవర్స్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొరియోగ్రాఫర్ గా ఉన్న…

3 mins ago

పరశురామ్‌కు దిద్దుకోలేనంత డ్యామేజీ

యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ డైరెక్టర్లలో ఒకడిగా కనిపించాడు పరశురామ్.…

1 hour ago

ఉద్యోగాలపై ఇదేం లాజిక్ జగన్ సార్?

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న…

3 hours ago

కమల్ సినిమాకు కమల్ సినిమా సంకటం

లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఇక దీని కంటే ముందు మొదలై మధ్యలో ఆగి..…

4 hours ago

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు బ్యాలెట్ నెంబ‌ర్ ఖ‌రారు.. ఈజీగా ఓటేయొచ్చు!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి  జిల్లాలోని పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ…

4 hours ago

మొదటిసారి ద్విపాత్రల్లో అల్లు అర్జున్ ?

పుష్ప 2 ది రూల్ విడుదల ఇంకో నాలుగు నెలల్లోనే ఉన్నా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా…

5 hours ago