వంద మాటల్లో చెప్పలేనిది.. ఒక్క చిత్రంలో చూపించడం.. చిత్రకారుడి నైపుణ్యం.. ప్రతిభ కూడా. ప్రపంచ మహిళా సౌందర్యాన్ని మొత్తాన్ని ఒక్క మొనాలిసా చిత్తరువులో కూర్చేసిన కళాకారుడు కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టినట్టుగా.. రాజకీయాల్లోనూ చిన్నపాటి కార్టూన్లు నేతల గుట్టును.. వారి మాటల్లోని లోగుట్టును కూడా బయటపెట్టిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఇదే పనిచేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
వంద మాటలతో వైసీపీపై ఎదురు దాడి చేయడం కన్నా, ఒక్క చిత్రంతో ఏకిపారేయడమే బెటర్ అనుకున్నట్టుగా ఉన్నారు. ఇటీవల నర్సాపురం సభలో జనసేనపై ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ అధినేత పవన్ తీవ్రంగా ఖండించారు. జగన్ వ్యాఖ్యలకు కౌంటర్గా పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేవలం చిన్న కార్టూన్ను ట్వీట్టర్లో పోస్టు చేశారు. దీనిలో వంద అర్థాలను గుప్పించేశారు. ప్రభుత్వ అవినీతి, పాలన, నేతల దూకుడు ఇలా అనేక అంశాలను ఒకే ఒక్క చిత్తరువులో ప్రజలకు చూపించారు.
ముఖ్యమంత్రి జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మౌనంగానే మండిపడ్డారు. జనసేనపై సీఎం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఓ కార్టూన్ను ట్వీట్ చేశారు. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలను వైసీపీ నేతలు ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఆ కార్టూన్లో వివరించారు. వైసీపీ ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతున్న ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకోవడంపై చిత్రంలో స్పష్టంగా చూపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పాటుపడుతుంటే.. తమ పార్టీని రౌడీసేన అని ముఖ్యమంత్రి ఎలా వ్యాఖ్యానిస్తారంటూ అర్థం వచ్చేలా కార్టూన్ని పోస్టు చేశారు. దీనికి సమాధానం చెప్పలేక వైసీపీ నాయకులు తర్జన భర్జన పడుతుండడం గమనార్మం.
This post was last modified on November 22, 2022 9:35 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…