Political News

జ‌గ‌న్ స‌భ‌లో మ‌హిళ‌ల‌ చున్నీలు తీయించేసిన పోలీసులు

ఏపీ సీఎం జగన్ తాజాగా న‌ర‌సాపురంలో ప‌ర్య‌టించారు. మ‌త్స్యకార దినోత్స‌వం సంద‌ర్భంగా ఇక్క‌డ ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు శంకు స్థాప‌న చేశారు. అయితే, ఈ సభలో మహిళలకు తీవ్ర అవమానం జరిగింది. నల్ల చున్నీలు ధరించివచ్చిన మహిళలను గేట్‌ వద్దే ఆపేశారు. వారి చున్నీలను బలవంతంగా తీయించివేశారు. దీనిపై మహిళలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పోలీసులు చర్యను ప్రతిఘటించారు. అయినప్పటికీ పోలీసులు ససేమిరా అంటూ పోలీసులు తమ మాటనే నెగ్గించుకున్నారు.

స్వాధీనం చేసుకున్న చున్నీలను బారికేడ్‌ల కోసం ఏర్పాటు చేసిన‌ కర్రలపై పడేశారు. వర్షం పడుతుందన్న భయంతో నల్ల గొడుగులు తెచ్చుకున్న మహిళలకు చేదు అనుభవమే మిగిలింది. గేటు వద్దే గొడుగుల్ని స్వాదీనం చేసుకున్నారు. ఇస్తేగాని లోనికి అనుమతించలేదు. దీంతో చాలామంది చేసేది లేక మహిళలు సభ వెళ్లారు. మరికొంత మంది ఇంటి ముఖం పట్టారు. ఇంతకి నల్ల రంగును చూసి పోలీసులు ఎందుకు భయపడ్డారంటే కొంత మంది జగన్‌ సభలో నిరసన వ్యక్తం చేస్తారేమోనని భయాందోళనకు గురయ్యారు.

దీంతో సీఎం సభకు హాజరుకావాలంటే తప్పనిసరిగా నల్ల చున్నీలు, ఓణీలు తీసిరావాలని పోలీసులు ఖరాఖండిగా చెప్పడంతో మహిళలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సీఎం కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చామని,.. దయచేసి అనుమతి ఇవ్వాలని వేడుకున్నారు. పోలీసులు కుదరదని తేల్చి చెప్పడంతో.. తప్పని పరిస్థితుల్లో చున్నీలు బారికేడ్లపై వేసి లోపలి వెళ్లారు. భద్రతా సిబ్బంది తీరుపై మహిళా ఉద్యోగులు సైతం మండిపడ్డారు.

అందుకే తీసివేయించార‌ట‌!

జగన్‌ మాట్లాడుతున్న సమయంలో నల్ల గొడుగులు, చున్నీలు పైకి ఎత్తుతారన్న ముందస్తు భయంతో స్వాదీనం చేసుకున్నామని పోలీసులు చెప్పడం గమనార్హం. అయితే, ఈ వ్య‌వ‌హారంపై రాష్ట్ర వ్యాప్తంగా మ‌హిళ‌లు మండిప‌డుతున్నారు.

This post was last modified on November 22, 2022 8:53 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

13 minutes ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

51 minutes ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

53 minutes ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

2 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

4 hours ago

బెంగాల్ కోసం మోదీ ఎంత పరితపించారో

దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…

5 hours ago