Political News

జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న అంటే మామూలుగా వుండదు మరి

ఏపీ సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న అంటేనే ప్ర‌జ‌లు బెంబేలెత్తుతున్నారు. ప్ర‌తిప‌క్షాలేమో.. ఆయన తాడేప‌ల్లి ప్యాలెస్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. దీంతో సీఎం జ‌గ‌న్ ఏదో ఒక కార్య‌క్ర‌మం పెట్టుకుని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నారు. అయితే, ఈ ప‌ర్య‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎం స‌ర్ వ‌స్తున్నారంటే చాలు.. దుకాణాలు బంద్‌, ర‌హ‌దారులు బంద్‌, హోట‌ళ్లు బంద్‌, చివ‌ర‌కు పాఠ‌శాల‌ల‌కు కూడా తాళాలు వేసేస్తున్నారు.

తాజాగా ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని న‌ర‌సాపురంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో నరసాపురం ఖాకీ వనంలా మారిందనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.. పట్టణాన్ని పోలీసులు దిగ్బంధించారు. బందోబస్తు కోసం పశ్చిమగోదావరి జిల్లా నుంచే కాకుండా కృష్ణా, తూర్పు జిల్లాల నుంచి కూడా దాదాపు 2 వేల మంది పోలీసులను రప్పించారు. సీఎం దిగే హెలిప్యాడ్‌ నుంచి సభ వేదిక వరకు దాదాపు 5 కిలోమీటర్ల పొడవునా.. రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు.

సీఎం కాన్వాయ్‌ వెళ్లే సమయంలో జనం రోడ్డు మీదకు రాకుండా తెరలు కట్టారు. కీల‌క‌మైన‌ పాతబజార్‌లోని దుకాణాలన్నీ మూసివేశారు. ఈ ఆంక్షలు సీఎం వచ్చి వెళ్లే వరకు ఉంటాయని.. దుకాణాలు మూసివేయాల్సిందేనని ఆదేశించారు. కొన్ని చోట్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇక స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.

జనసమీకరణ కోసం అన్ని విద్యా సంస్థల బస్సులను స్వాధీనం చేసుకున్నారు. నరసాపురం నియోజకవర్గం నుంచే కాకుండా పాలకొల్లు, భీమవరం, తణుకు నుంచి కూడా జనాన్ని తరలించడానికి 700 బస్సులు సిద్ధం చేశారు. జనసమీకరణ బాధ్యతను వలంటీర్లు, డ్వాక్రా సంఘాలు, గ్రామస్థాయి సిబ్బందికి అప్పగించారు. భోజనాలు, బస్సులకు ఆయిల్‌ ఇతర ఖర్చుల భారాన్ని తమపై మోపారని మండల స్థాయిు అధికారులు వాపోతున్నారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

7 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

9 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

11 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

11 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

12 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

12 hours ago