రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను ఐదుగురు దోచుకుంటున్నారని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. పనిచేయని వారికి టికెట్లు ఇవ్వవద్దని చంద్రబాబును కోరుతున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికలు ఎంతో కీలకం కాబట్టి.. ఎటువంటి రాజీలు లేకుండా ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర సంక్షేమం కోసం అందరి సహకారం తీసుకోవడంలో తప్పులేదని తెలిపారు.
సమయం లేదు మిత్రమా అనే బాలకృష్ణ డైలాగ్ స్ఫూర్తితో అంతా ఎన్నికలకు సిద్ధం కావాలని అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ఫలానా నేత పనికిరాడని భావిస్తే టిక్కెట్ల కేటాయింపులో రాజీపడొద్దని చంద్రబాబుని కోరారు. తాను పనిచేయట్లేదని భావిస్తే… తనకు టిక్కెట్టివ్వొద్దన్నారు. వచ్చే ఎన్నికలు ఎంతో కీలకం కాబట్టి.. ఎలాంటి రాజీ లేకుండా ముందుకెళ్లాలన్నారు. ప్రజలు మన పక్షాన ఉన్నప్పుడు టెన్షన్ పడొద్దని అధినేతకు సూచించారు.
చంద్రబాబు కూల్గా ఉండి నిర్ణయాలు తీసుకుంటే చాలన్నారు. రావణాసుడిని నేరుగా చంపే సత్తా శ్రీరాముడికి ఉన్నా.. లోక కళ్యాణం కోసం ఉడత నుంచి రావణాసురుడి సోదరుడు సహా అందరి సహకారం తీసుకున్నాడన్నారు. మనమూ అదే ధోరణితో వెళ్లాలని తెలిపారు. 2019 ఎన్నికలు ఓ పీడకల అని.. ఇక దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని క్షేత్రస్థాయిలో ప్రజలు బలంగా ఉన్నారని స్పష్టం చేశారు.
ఎన్నికల పోరులో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని, ఈ విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అయ్యన్న పాత్రుడు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలోలాగానే మూడు జిల్లాలకు ఒక ఇన్చార్జ్ను నియమించాలని చంద్రబాబుకు సూచించారు. పార్టీ నేతలంతా ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించాలని కోరారు.
This post was last modified on November 20, 2022 10:31 am
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…