ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పోరాటాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో కొత్త కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. ‘ఇదేం ఖర్మ’ పేరుతో మరో సరికొత్త కార్యక్రమాన్ని మొదలు పెట్టిం ది. తాజాగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబా బు.. పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ… మూడున్నరేళ్లలో ఏపీలో ఎంతో విధ్వంసం జరిగిందని అన్నారు.
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎన్నో దారుణాలు జరిగాయన్నారు. దారుణాలు ఏ టెర్రరిస్టులో చేయలేదని.. పోలీసుల సహకారంతో ప్రభుత్వమే విధ్వంసం సృష్టించిందని మండిపడ్డారు. టీడీపీ ఎప్పుడూ జాతీయ భావాలతోనే వెళ్లిందని తెలిపారు. టీడీపీ జాతీయ ప్రత్యామ్నాయాల్లో కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పుకొచ్చారు. పలు సంస్కరణలతో టీడీపీ ముందుందని… దేశానికే దిక్సూచిగా ఉండేలా కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
ప్రతిపక్షంలో కూడా అంతే బాధ్యతగా ఉన్నామన్నారు. ‘‘చాలా మంది సీఎంలను చూశాను.. ఎన్నో ప్రభు త్వాలను చూశాను. ఇంతటి దారుణమైన.. నీచమైన ప్రభుత్వాన్ని చూడలేదు’’ అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై పోరాడేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని బాబు పిలుపు నిచ్చారు. ఇదేం ఖర్మ కార్యక్రమంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ప్రతినియోజకవర్గంలోనూ ఈ కార్యక్రమం నిర్వహించాలని చంద్రబాబు సూచించారు.
This post was last modified on November 19, 2022 1:39 pm
మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు…
బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…
ఏపీ అధికార పార్టీ వైసీపీ కీలక నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ ఉందని…
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…