ఏపీ వైసీపీ నాయకుడు, పొలిటికల్ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని.. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీలో రాళ్లు చేరడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. దాదాపు వారం రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. మూడు రోజుల క్రితమే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది.
శుక్రవారం రాత్రి కొడాలి నానికి వైద్యులు కిడ్నీ సంబంధిత శస్త్ర చికిత్సను నిర్వహించారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రి ఐసీయూలో కొడాలి నాని ఉన్నారు. రెండు, మూడు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. రెండు వారాలపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించారు. అనంతరం అంతా బాగుందనుకుంటే 15 రోజుల తర్వాత కిడ్నీ సంబంధిత లేజర్ చికిత్సను వైద్యులు చేయనున్నారు.
ఇదిలావుంటే, కొన్నాళ్ల కిందట కూడా.. అనూహ్యంగా నాని అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలోనూ హైదరాబాద్లోనే చికిత్స తీసుకున్నారు. అయితే, అప్పట్లో కారణాలు వెలుగు చూడలేదు. కొన్నాళ్ల చికిత్స అనంతరం తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్యం నిలకడగానే ఉందని, కిడ్నీ ఆపరేషన్ విజయవంతం అయిందని వైద్యులు చెప్పడం గమనార్హం. ఇక, నియోజకవర్గంలో కొడాలి నాని అభిమానులు.. ఆయన త్వరగా కోలుకోవాలని.. పూజలు చేస్తున్నారు.
This post was last modified on November 19, 2022 12:47 pm
భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన గాయకుల్లో ఒకడిగా ఉదిత్ నారాయణ పేరు చెప్పొచ్చు. ఆయన దక్షిణాది సంగీత…
ఈ సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ చేశాడు అగ్ర నిర్మాత దిల్ రాజు. ఒకటేమో ఏకంగా 400 కోట్ల బడ్జెట్…
ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో వేధింపులకు గురై.. దాదాపు ఐదేళ్లపాటు సస్పెన్షన్ లో ఉన్న…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ప్రధానంగా నాలుగు యాంగిల్స్ కనిపించాయి. ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర…
ఇప్పుడంతా డిజిటల్ మయం. ప్రతిదీ హార్డ్ డిస్కుల్లోకి వెళ్ళిపోతుంది. చిన్న డేటాతో మొదలుపెట్టి వందల జిబి డిమాండ్ చేసే సినిమా…
సినిమాల పరంగా బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్కు ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ అని పేరుంది. కానీ వ్యక్తిగా తాను పర్ఫెక్ట్…