ఏపీ వైసీపీ నాయకుడు, పొలిటికల్ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని.. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీలో రాళ్లు చేరడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. దాదాపు వారం రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. మూడు రోజుల క్రితమే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది.
శుక్రవారం రాత్రి కొడాలి నానికి వైద్యులు కిడ్నీ సంబంధిత శస్త్ర చికిత్సను నిర్వహించారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రి ఐసీయూలో కొడాలి నాని ఉన్నారు. రెండు, మూడు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. రెండు వారాలపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించారు. అనంతరం అంతా బాగుందనుకుంటే 15 రోజుల తర్వాత కిడ్నీ సంబంధిత లేజర్ చికిత్సను వైద్యులు చేయనున్నారు.
ఇదిలావుంటే, కొన్నాళ్ల కిందట కూడా.. అనూహ్యంగా నాని అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలోనూ హైదరాబాద్లోనే చికిత్స తీసుకున్నారు. అయితే, అప్పట్లో కారణాలు వెలుగు చూడలేదు. కొన్నాళ్ల చికిత్స అనంతరం తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్యం నిలకడగానే ఉందని, కిడ్నీ ఆపరేషన్ విజయవంతం అయిందని వైద్యులు చెప్పడం గమనార్హం. ఇక, నియోజకవర్గంలో కొడాలి నాని అభిమానులు.. ఆయన త్వరగా కోలుకోవాలని.. పూజలు చేస్తున్నారు.
This post was last modified on November 19, 2022 12:47 pm
మే 4 దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని డైరెక్టర్స్ డేని చాలా ఘనంగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ దిగ్గజాలందరూ…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో చిత్రమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రదాన పార్టీ జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు…
లోక్ సభ ఎన్నికలు తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎప్పుడు ఏ విషయం పెరిగి పెద్దదై…
నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్నా అదిగో ఇదిగో అనడమే తప్ప హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజనే సంగతి ఎంతకీ తేలక అభిమానులు దాని…
అవును. అల్లరి నరేష్ తో పాటు ఈ శుక్రవారం వస్తున్న పోటీ సినిమాలకు టాలీవుడ్ ఇదే విన్నపం చేస్తోంది. చాలా…
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోరు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య నిప్పులు చెరుగుకునే…