మనీలాండరింగ్ కేసులో అరెస్టయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ మంత్రి సత్యేందర్ కుమార్ జైన్కు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. తిహార్ జైలులో ఉంటున్న జైన్కు సకల సౌకర్యాలు అందుతున్నట్లు అందులో స్పష్టమవుతోంది. జైలులో ఆయనకు ఓ వ్యక్తి మసాజ్ చేస్తుండటం వీడియోలో కనిపిస్తోంది. కాళ్లకు నూనె రాసి మర్దనా చేస్తున్నాడు.
ఇది సెప్టెంబరు 13వ తేదీ వీడియో కాగా ఆ తర్వాతి రోజు కూడా బాడీ మసాజ్తోపాటు తలకు మర్దనా చేసిన వీడియో కూడా బయటకు వచ్చింది. మరికొంత మంది కూడా ఆయన పక్కన ఉన్నారు. గదిలో బిస్లెరీ వాటర్ సీసాలు, ఆయన పడకపై టీవీ రిమోట్ కనిపిస్తున్నాయి. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యేందర్ జైన్ ఈ ఏడాది మే 30న అరెస్టయ్యారు. 2017లో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఆయన్ను అరెస్టు చేసింది.
సత్యేందర్కు జైలులో వీఐపీ మర్యాదలు చేస్తున్నారనే ఆరోపణలు రాగా దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను కోర్టుకు ఈడీ అందించింది. ఇవే ఆరోపణలపై తిహార్ జైలు సూపరింటెండెంట్ ఇటీవలే సస్పె న్షన్కు గురయ్యారు. ఇదిలావుంటే, ఇప్పుడు గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీని అధికారం నుంచి దిం పి.. తాము పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న ఆప్కు తాజాగా వీడియో.. తీవ్ర స్థాయిలో సంకటాన్ని తీసుకురా వడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి దీనిపై ఆప్ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…