Political News

బుగ్గనను సూటిగా అడిగేసి.. కడిగేశారు

అనూహ్య పరిస్థితి ఎదురైంది ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి. విజయవాడలో నిర్వహించిన వాణిజ్య సలహా మండలి సమావేశాన్ని వివిధ వ్యాపార సంఘాట ప్రతినిధులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వ్యాపారులు పడుతున్న కష్టాల్ని.. ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని కళ్లకు కట్టినట్లుగా చెబుతూ.. ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. జగన్ ప్రభుత్వంలో అధికారుల దాడులు తరచూ జరుగుతున్నాయని.. అదేమంటే.. ప్రభుత్వానికి నిధుల కొరత అంటున్నారని.. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేకుంటే మమ్మల్ని వేధిస్తారా? అంటూ సూటిగా అడిగేసి.. కడిగేశారు.

నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించటానికి తమకు ఎలాంటి ఇబ్బందులు లేవన్న వ్యాపార ప్రతినిధులు.. ప్రభుత్వం తమను చూసే తీరులోనే తేడా ఉందన్న ఆవేదననను వ్యక్తం చేశారు. ఒక వస్తువు ధర రూ.70 ఉంటే.. రూ.వందకు అమ్ముతున్నామని.. దాని విలువ రూ.150 ఉంటుందని.. పన్నులు ఎగ్గొట్టటానికి విలువ తగ్గించి చూపుతున్నామంటూ అధికారులు తమకు ఫైన్లు వేస్తున్నారన్నారు. ఎంతమంది అదికారులకు వస్తువులను బట్టి ధరల్ని తేల్చగలరు? అంటూ సూటిగా ప్రశ్నించారు.

మార్బుల్ వ్యాపారాన్నే తీసుకుంటే.. రాయి నాణ్యతకు అనుగుణంగా ధర ఉంటుందని.. పన్నులు వేసే అధికారుల్లో ఎంతమందికి రాయి నాణ్యత గురించి తెలుసు? అని ప్రశ్నించారు. ప్రభుత్వం విధిస్తున్న టార్గెట్ల కారణంగా అధికారులు తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతూ.. వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని వ్యాపార సంస్థలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లుగా చెప్పారు. తనిఖీల పేరుతో వాహనాల్ని ఆపేయటం.. జరిమానాలు వేయటం లాంటివి చేస్తున్నారన్నారు.

ఇలా పలు వ్యాపార సంస్థల ప్రతినిధులు గళం విప్పుతూ.. తాము ఎదుర్కొంటున్న సమస్యల చిట్టాను విప్పటంతో ఆర్థిక మంత్రి బుగ్గన ఇబ్బందికి గురయ్యారు. తాము అధికారులకు టార్గెట్లు పెట్టటం లేదన్నారు. అదే సమయంలో.. వ్యాపారులు పేర్కొన్న విదంగా ఆకస్మిక దాడులు.. తనిఖీలను తగ్గిస్తామని మంత్రి బుగ్గన పేర్కొనటం గమనార్హం. ఏమైనా.. జగన్ ప్రభుత్వంలో తమకు ఎదురవుతున్న కష్టాల గురించి చెప్పుకున్న తీరు మంత్రికి ఇబ్బందికరంగా మారిందన్న మాట వినిపిస్తోంది. ఇలా వ్యాపారులు ఒక సమావేశంలో సంబంధిత మంత్రి ముందు ఓపెన్ కావటం చాలా అరుదన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on November 19, 2022 10:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

18 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago