Political News

బుగ్గనను సూటిగా అడిగేసి.. కడిగేశారు

అనూహ్య పరిస్థితి ఎదురైంది ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి. విజయవాడలో నిర్వహించిన వాణిజ్య సలహా మండలి సమావేశాన్ని వివిధ వ్యాపార సంఘాట ప్రతినిధులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వ్యాపారులు పడుతున్న కష్టాల్ని.. ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని కళ్లకు కట్టినట్లుగా చెబుతూ.. ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. జగన్ ప్రభుత్వంలో అధికారుల దాడులు తరచూ జరుగుతున్నాయని.. అదేమంటే.. ప్రభుత్వానికి నిధుల కొరత అంటున్నారని.. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేకుంటే మమ్మల్ని వేధిస్తారా? అంటూ సూటిగా అడిగేసి.. కడిగేశారు.

నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించటానికి తమకు ఎలాంటి ఇబ్బందులు లేవన్న వ్యాపార ప్రతినిధులు.. ప్రభుత్వం తమను చూసే తీరులోనే తేడా ఉందన్న ఆవేదననను వ్యక్తం చేశారు. ఒక వస్తువు ధర రూ.70 ఉంటే.. రూ.వందకు అమ్ముతున్నామని.. దాని విలువ రూ.150 ఉంటుందని.. పన్నులు ఎగ్గొట్టటానికి విలువ తగ్గించి చూపుతున్నామంటూ అధికారులు తమకు ఫైన్లు వేస్తున్నారన్నారు. ఎంతమంది అదికారులకు వస్తువులను బట్టి ధరల్ని తేల్చగలరు? అంటూ సూటిగా ప్రశ్నించారు.

మార్బుల్ వ్యాపారాన్నే తీసుకుంటే.. రాయి నాణ్యతకు అనుగుణంగా ధర ఉంటుందని.. పన్నులు వేసే అధికారుల్లో ఎంతమందికి రాయి నాణ్యత గురించి తెలుసు? అని ప్రశ్నించారు. ప్రభుత్వం విధిస్తున్న టార్గెట్ల కారణంగా అధికారులు తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతూ.. వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని వ్యాపార సంస్థలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లుగా చెప్పారు. తనిఖీల పేరుతో వాహనాల్ని ఆపేయటం.. జరిమానాలు వేయటం లాంటివి చేస్తున్నారన్నారు.

ఇలా పలు వ్యాపార సంస్థల ప్రతినిధులు గళం విప్పుతూ.. తాము ఎదుర్కొంటున్న సమస్యల చిట్టాను విప్పటంతో ఆర్థిక మంత్రి బుగ్గన ఇబ్బందికి గురయ్యారు. తాము అధికారులకు టార్గెట్లు పెట్టటం లేదన్నారు. అదే సమయంలో.. వ్యాపారులు పేర్కొన్న విదంగా ఆకస్మిక దాడులు.. తనిఖీలను తగ్గిస్తామని మంత్రి బుగ్గన పేర్కొనటం గమనార్హం. ఏమైనా.. జగన్ ప్రభుత్వంలో తమకు ఎదురవుతున్న కష్టాల గురించి చెప్పుకున్న తీరు మంత్రికి ఇబ్బందికరంగా మారిందన్న మాట వినిపిస్తోంది. ఇలా వ్యాపారులు ఒక సమావేశంలో సంబంధిత మంత్రి ముందు ఓపెన్ కావటం చాలా అరుదన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on November 19, 2022 10:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago