Political News

ఎంపీని చెప్పుతో కొడతానన్న కవిత

తెలంగాణ‌లో మ‌ళ్లీ రాజ‌కీయ ర‌చ్చ ప్రారంభ‌మైంది. బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ చేసిన కామెంట్లు తీ వ్ర వివాదానికి దారితీశాయి. సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కాంగ్రెస్ పార్టీలో చేరేందు కు స‌మాయ‌త్తం అయ్యారంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర వివాదానికి కార‌ణ‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో క‌విత తీవ్ర‌స్థాయిలో స్పందించారు. ఎక్కువ త‌క్కువ మాట్లాడితే నిజామాబాద్ చౌర‌స్తాలోనే చెప్పుతో కొడ‌తా! అని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

మీడియాతో క‌విత‌ మాట్లాడుతూ.. పనితీరు, ప్రవర్తన ఈ రెండూ అర్వింద్‌కు లేవన్నారు. మూడున్నరేళ్లలో కేవలం 60 ప్రశ్నలు మాత్రమే అడిగారన్నారు. తాను కాంగ్రెస్‌లో చేర‌తాన‌న్న అర్వింద్ వ్యాఖ్య‌ల‌పై కవిత భావోద్వేగానికి లోనయ్యారు. గద్గద స్వరంతో మాట్లాడారు. తెలంగాణ సమస్యలపై పార్లమెంట్‌ లో అర్వింద్ ప్రశ్నించిన పాపాన పోలేదన్నారు. బాండ్‌ పేపర్‌ రాసిచ్చి మోసం చేశాడని రైతులు ఆరోపిస్తున్నారన్నారు. బాండ్‌పేపర్‌ రాసిచ్చిన అర్వింద్‌పై.. ఫిర్యాదు చేస్తామని రైతులు అంటున్నారన్నారు.

“అర్వింద్‌ పై పోటీ చేసిన అభ్యర్థిగా నేనే ఆయన పై ఫిర్యాదు చేస్తా. నేను కాంగ్రెస్‌లోకి వెళ్తానని అసత్యాలు ప్రచారం చేశారు. నా పుట్టుక, బతుకు తెలంగాణ. నేను ఏనాడూ వ్యక్తిగత దూషణలకు పోలేదు. అర్వింద్‌ వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలు మానుకోవాలి. ఇంకోసారి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా. నోటికొచ్చినట్లు మాట్లాడితే మెత్తగా తంతాం. నోరు అదుపులో పెట్టుకోకుంటే అర్వింద్‌ను తరిమికొడతాం” అన్నారు.

“కొట్టి చంపుతం బిడ్డ.. రాజకీయం చెయ్‌.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు. అర్వింద్‌ ఎక్కడ పోటీ చేసినా.. వెంటబడి ఓడిస్తా. పసుపుబోర్డ్‌ తేలేని అర్వింద్‌… రైతుల కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. బాధతో మాట్లాడుతున్నాను.. ప్రజలు తప్పుగా భావిస్తే క్షమించాలి” అని క‌విత‌ పేర్కొన్నారు.

Satya

Recent Posts

రిషికొండ ప్యాలెస్… కూటమికి గుదిబండేనా?

రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…

6 minutes ago

టాలీవుడ్‌పై బాలీవుడ్ ఏడుపుకిది నిదర్శనం

ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…

54 minutes ago

జగన్ అటాక్ మోడ్ లోకి వచ్చినట్టేనా…?

ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…

1 hour ago

సీబీఎన్ @ 361 డిగ్రీస్..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. పాల‌న‌, ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు.. వేస్తున్న అడుగులు, భ‌విష్య‌త్తు ఆంధ్ర ప్ర‌దేశ్ నిర్మాణం.. వంటి ప‌లు…

2 hours ago

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

4 hours ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

5 hours ago