ఏపీలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చే శారు. రాష్ట్ర ఎన్నికల్లో పొత్తుల విషయంపై కేంద్రంలోని బీజేపీ అధిష్టానం.. కుండబద్దలు కొట్టి మరీ చెప్పిం దని అన్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో తాము జనసేనతో కలిసిఎన్నికలకు వెళ్తామని అన్నారు. సరే.. ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చెబుతున్నారు కానీ, తాజాగా సోము చెప్పింది మాత్రం సంచనలమే!
అదేంటంటే.. జనసేన పార్టీని టీడీపీతో కలవొద్దంటూ.. బీజేపీ అధిష్టానం చెప్పిందని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో జనసేన ఎప్పటికీ.. టీడీపీతో కలిసి ముందుకు సాగే ప్రసక్తి ఉండదని.. జనసేనతో ఎప్పటికీ తామే ఉంటామని.. సోము వీర్రాజు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన-బీజేపీ మాత్రమే పొత్తు ఉంటుం దని తెలిపారు. కుటుంబ రాజకీయాలకు బీజేపీ దూరమన్నారు.
ప్రస్తుతం టీడీపీ అభద్రతా భావంలో ఉందని.. అందుకే.. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో.. కూడా ఆయ నకు అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఇదే లాస్ట్ అన్నారని.. అయితే.. ఈ లాస్ట్ ఆయనకేనా.. లేక పార్టీకా.. అనేచర్చ సాగుతోందని సోము వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఏదేమైనా..టీడీపీ పని అయిపోయిందని.. రాష్ట్రంలో బీజేపీ-జనసేన కూటమి వర్సెస్ వైసీపీల మధ్యే పోటీ ఉంటుందని సోము జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ కూటమి సర్కారు ఏర్పడుతుందని అన్నారు.
This post was last modified on November 17, 2022 9:44 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…