Political News

జ‌న‌సేనని టీడీపీతో క‌ల‌వొద్దని.. అధిష్టానం చెప్పింద‌ట

ఏపీలో రాజ‌కీయాలు మ‌రోసారి వేడెక్కాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చే శారు. రాష్ట్ర ఎన్నిక‌ల్లో పొత్తుల విష‌యంపై కేంద్రంలోని బీజేపీ అధిష్టానం.. కుండ‌బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ చెప్పిం దని అన్నారు. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము జ‌న‌సేన‌తో క‌లిసిఎన్నిక‌ల‌కు వెళ్తామ‌ని అన్నారు. స‌రే.. ఈ విష‌యాన్ని ఎప్ప‌టి నుంచో చెబుతున్నారు కానీ, తాజాగా సోము చెప్పింది మాత్రం సంచ‌న‌ల‌మే!

అదేంటంటే.. జ‌న‌సేన పార్టీని టీడీపీతో క‌ల‌వొద్దంటూ.. బీజేపీ అధిష్టానం చెప్పింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన ఎప్ప‌టికీ.. టీడీపీతో క‌లిసి ముందుకు సాగే ప్ర‌స‌క్తి ఉండ‌ద‌ని.. జ‌న‌సేన‌తో ఎప్ప‌టికీ తామే ఉంటామ‌ని.. సోము వీర్రాజు పేర్కొన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌-బీజేపీ మాత్ర‌మే పొత్తు ఉంటుం ద‌ని తెలిపారు. కుటుంబ రాజ‌కీయాల‌కు బీజేపీ దూర‌మ‌న్నారు.

ప్ర‌స్తుతం టీడీపీ అభ‌ద్ర‌తా భావంలో ఉంద‌ని.. అందుకే.. చంద్ర‌బాబు ఏం మాట్లాడుతున్నారో.. కూడా ఆయ న‌కు అర్ధం కావ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. ఇదే లాస్ట్ అన్నార‌ని.. అయితే.. ఈ లాస్ట్ ఆయ‌న‌కేనా.. లేక పార్టీకా.. అనేచ‌ర్చ సాగుతోంద‌ని సోము వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఏదేమైనా..టీడీపీ ప‌ని అయిపోయింద‌ని.. రాష్ట్రంలో బీజేపీ-జ‌న‌సేన కూట‌మి వ‌ర్సెస్ వైసీపీల మ‌ధ్యే పోటీ ఉంటుంద‌ని సోము జోస్యం చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ కూటమి స‌ర్కారు ఏర్ప‌డుతుంద‌ని అన్నారు.

This post was last modified on November 17, 2022 9:44 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

2 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

4 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

4 hours ago