రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ప్రజల సెంటిమెంటును గుర్తించి.. తమకు అనుకూలంగా మార్చుకోవడంలో రాజకీయ నేతలు.. పన్నే వ్యూహాలు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తాయి. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన తాజాగా కామెంట్లు.. అధికార పార్టీ వైసీపీలోనూ గుబులు రేపుతున్నాయి. పైకి ఏమీ అనలేక.. లోలోన దాచుకోలేక.. ప్రస్తుతం ఎదురుదాడి మంత్రాన్ని ఎంచుకున్నారు.
కర్నూలులో పర్యటిస్తున్న చంద్రబాబు.. తనకు ఇదే చివరి ఎన్నికలని, ఆఖరి ఛాన్స్ ఇవ్వాలని.. ప్రజలను అభ్యర్థించారు. అయితే.. ఈ విషయం ప్రజల మధ్య విస్తృతంగా చర్చకు వస్తోంది. ఇప్పటి వరకు చంద్రబాబు వేరు.. ఈ కామెంట్ల తర్వాత చంద్రబాబు వేరు అన్నట్టుగా రాజకీయాల్లో చర్చకు వచ్చింది. ఎందుకంటే.. చంద్రబాబు ఇప్పటి వరకు ఇదే తనకు చివరి ఎన్నికలని ప్రకటించలేదు.
కానీ, ఇప్పుడు ఆయన ఆఖరి ఛాన్స్ అంటూ.. సెంటిమెంటు అస్త్రాన్ని ప్రయోగించారు. దీంతో ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపుతారని.. రాజకీయ పండితులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే.. విజన్ ఉన్న నాయకుడిగా ఆయనకు ప్రజల్లో పేరుంది. ఆయన పట్ల ఇప్పటికీ. ఒక మంచి అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చిన పిలుపు, చేసిన కామెంట్ వర్కవుట్ కావడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి.
ఈ పరిణామం.. వైసీపీలోనూ గుబులు రేపుతోంది. ఎందుకంటే.. గతంలో తాము ఒక్క ఛాన్స్ అని రాజకీయంగా లబ్ధి పొందిన నేపథ్యంలో ఇప్పుడు అదే మంత్రాన్ని రివర్స్ చేసి.. లాస్ట్ ఛాన్స్ అంటూ.. చంద్రబాబు ప్రజల మధ్యకు వెళ్తున్నారు. దీంతో వైసీపీ నాయకులు దీనిపై తర్జన భర్జన పడుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి సీదిరి అప్పలరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాము గతంలోనే ఈ విషయం చెప్పామని.. ఇదే ఆఖరి ఛాన్స్ అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కానీ, ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా.. మంత్రి ముఖంలో మాత్రం ఎక్కడో భయం తొణికిసలాడుతుండడం గమనార్హం. మొత్తానికి బాబు ప్రయోగించిన సెంటిమెంటు.. వైసీపీలో ప్రకంపనలు పుట్టిస్తోందనడంలో సందేహం లేదు.
This post was last modified on November 17, 2022 3:57 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…