తెలంగాణలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్నాళ్ల కిందట సంచలనం సృష్టించిన చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసు వ్యవహారంలో తాజాగా మరో సంచలన విషయం వెలుగు చూసింది. ఈ కేసులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులకు భాగం ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ రహస్య ప్రదేశంలో వీరిద్దరిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీకి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
తెలంగాణలోని చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మళ్లీ దృష్టి సారించింది. మూడునెలల తర్వాత తిరిగి దర్యాప్తు ప్రారంభించారు. ప్రవీణ్, అనుచరుడు శ్రీనివాసరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించి మరో వ్యక్తికి సంబంధించి కీలక పత్రాలు బ్యాంకు ధ్రువపత్రాలు సేకరించారు. వాటి పరిశీలన తర్వాత మళ్లీ దర్యాప్తు ప్రారంభించారు.
వాటి ఆధారంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు తలసాని మహేశ్, తలసాని ధర్మేందర్ యాదవ్ని పిలిచి విచారించారు. వీరు చీకోటితో కలిసి క్యాసినో కోసం విదేశాలకు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. నగదు, ఆర్థిక లావాదేవీల విషయంలో హవాలాకు పాల్పడ్డారనే కోణంలో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇదే కేసులో మరికొందరి పేర్లు వెలుగులోకి వస్తున్నాయి.
దర్యాప్తులో సేకరించిన ఆధారాలతో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీకి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అదే విధంగా మెదక్ సహకార బ్యాంకు ఛైర్మన్కు, ఏపీలోని అనంతపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే(టీడీపీ)కు కూడా నోటీసులు ఇచ్చారు. ఎల్లుండి ఈడీ విచారణకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ హాజరుకానున్నారు. సోమవారం అనంతపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అధికారుల ఎదుట విచారణకు రావాల్సి ఉంది.
This post was last modified on November 17, 2022 6:27 am
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…