జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా ఫైర్ ఉంటుంది. అంతో ఇంతో.. ఆయన చేసే కామెంట్లు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా యూత్లో అయితే.. పవన్ వ్యాఖ్యలకు మరింత డిమాండ్ ఉంది. పవన్ కొన్నిరోజుల కిందట వైసీపీ నేతలను ఉద్దేశించి నా.. కొడ..ల్లారా అంటూ చెప్పు చూపించిన విషయం తెలిసిందే. ఈ ఫొటోలు.. చాలా రోజుల వరకు కూడా.. వైరల్ అయ్యాయి. ఇక, ఆయన డైలాగులు కూడా అలానే యూత్లో ఫాలో అయ్యాయి. అలాంటి సందర్భాల్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాటిని ప్రచారం కల్పించింది టీడీపీనేననే వాదన వైసీపీ నేతల నుంచి వినిపించింది.
ఇది కూడా తీసిపారేయలేని వాస్తవమే. ఎందుకంటే టీడీపీ సోషల్ మీడియా నెట్ వర్క్ జోరు వేరుగా ఉంటుంది. సో.. పవన్ చేసిన వ్యాఖ్యలు.. ఆయన కామెంట్లను ఫొటోలను ఐ-టీడీపీనే ఎక్కువగా ప్రచారం చేసిందనడంలో సందేహం కనిపించడం లేదు. ఉభయ కుసలోపరిగా.. ప్రజాస్వామ్య పరిరక్షణకు రెండు పార్టీలు ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకున్న దరిమిలా.. రెండు పార్టీలు కలిసి ముందుకు సాగాలని భావించిన నేపథ్యంలో పవన్కు మైలేజీ వచ్చేలా ఐ-టీడీపీ చక్రం తిప్పడం తప్పని పించలేదు.
ఇక, ఇది జరిగిన తర్వాత… పవన్పై వైసీపీ నేతలు ఏమన్నా.. వెంటనే టీడీపీ నాయకులు రియాక్ట్ అయ్యారు. పవన్ మూడు పెళ్లిళ్ల విషయంపై వైసీపీ కౌంటర్లు ఇవ్వగానే టీడీపీ నేతలు రియాక్ట్ అయి.. వారికి రీ కౌంటర్లు ఇచ్చారు. అంటే.. మొత్తంగా.. పవన్కు మేమున్నామనే సంకేతాలను టీడీపీ పంపిం చిందనే చెప్పాలి. కట్ చేస్తే.. ఇటీవల పవన్ చేసిన కామెంట్ల విషయంలో మాత్రం టీడీపీ ఇప్పటి వరకు స్పందించలేదు. అంతేకాదు.. అనుకున్న విధంగా కూడా స్పందన కూడా రాలేదు.
అదే విజయనగరం జిల్లాలో పర్యటించిన సమయంలో పవన్ ప్రజలను ఉద్దేశించి “ఒక్క ఛాన్స్ ఇవ్వండి. వైసీపీ నేతల అవినీతిని వెలుగులోకి తెస్తా.. అవినీతి రహిత పాలనను అందిస్తా” అని కామెంట్లు చేశారు. ఇవి యూత్లో బాగానే వైరల్ అయ్యాయి. కానీ, ఎటొచ్చీ.. టీడీపీ మాత్రంవీటిని పట్టించుకోక పోవడం.. కనీసం.. ఈ వ్యాఖ్యలకు మద్దతుగా ఎవరూ పెదవి విప్పలేదు. పరిణామాలను గమనిస్తే.. టీడీపీ ఈ స్లోగన్ విషయంలో అంతర్మథనం చెందుతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు పార్టీలు కలిసి.. ముందు వైసీపీపై పోరాటం చేయాలని అనుకున్నామని.. కానీ, ఇంతలోనే ఎన్నికల విషయంలో చేసిన ప్రకటన మాదిరిగా ఒక్క ఛాన్స్ అనేసరికి.. టీడీపీకి ఎక్కడో తేడా కొట్టిందని.. అందుకే సైలెంట్ అయిందని అంటున్నారు. మరి మున్ముందు దీనిపై క్లారిటీ వస్తుందో.. రాదో చూడాలి.
This post was last modified on November 16, 2022 12:16 pm
ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి…
వైసీపీ అధినేత జగన్ను అధికారంలోకి రాకుండా చేస్తానని.. అవసరమైతే.. చంద్రబాబు ఓకే అంటే.. తాను కూడా పాదయాత్రకు రెడీ అంటూ..…
హీరో తిరువీర్ కథల ఎంపిక పట్ల ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. మాసూద లాంటి హారర్ మూవీ, ది గ్రేట్…
ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఒక దశలో ఏడాదిలో అత్యధిక ఆదాయం అందుకునే, అత్యధికంగా పన్ను…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న టీమిండియా మాజీ కెప్టెన్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న…