జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా ఫైర్ ఉంటుంది. అంతో ఇంతో.. ఆయన చేసే కామెంట్లు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా యూత్లో అయితే.. పవన్ వ్యాఖ్యలకు మరింత డిమాండ్ ఉంది. పవన్ కొన్నిరోజుల కిందట వైసీపీ నేతలను ఉద్దేశించి నా.. కొడ..ల్లారా అంటూ చెప్పు చూపించిన విషయం తెలిసిందే. ఈ ఫొటోలు.. చాలా రోజుల వరకు కూడా.. వైరల్ అయ్యాయి. ఇక, ఆయన డైలాగులు కూడా అలానే యూత్లో ఫాలో అయ్యాయి. అలాంటి సందర్భాల్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాటిని ప్రచారం కల్పించింది టీడీపీనేననే వాదన వైసీపీ నేతల నుంచి వినిపించింది.
ఇది కూడా తీసిపారేయలేని వాస్తవమే. ఎందుకంటే టీడీపీ సోషల్ మీడియా నెట్ వర్క్ జోరు వేరుగా ఉంటుంది. సో.. పవన్ చేసిన వ్యాఖ్యలు.. ఆయన కామెంట్లను ఫొటోలను ఐ-టీడీపీనే ఎక్కువగా ప్రచారం చేసిందనడంలో సందేహం కనిపించడం లేదు. ఉభయ కుసలోపరిగా.. ప్రజాస్వామ్య పరిరక్షణకు రెండు పార్టీలు ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకున్న దరిమిలా.. రెండు పార్టీలు కలిసి ముందుకు సాగాలని భావించిన నేపథ్యంలో పవన్కు మైలేజీ వచ్చేలా ఐ-టీడీపీ చక్రం తిప్పడం తప్పని పించలేదు.
ఇక, ఇది జరిగిన తర్వాత… పవన్పై వైసీపీ నేతలు ఏమన్నా.. వెంటనే టీడీపీ నాయకులు రియాక్ట్ అయ్యారు. పవన్ మూడు పెళ్లిళ్ల విషయంపై వైసీపీ కౌంటర్లు ఇవ్వగానే టీడీపీ నేతలు రియాక్ట్ అయి.. వారికి రీ కౌంటర్లు ఇచ్చారు. అంటే.. మొత్తంగా.. పవన్కు మేమున్నామనే సంకేతాలను టీడీపీ పంపిం చిందనే చెప్పాలి. కట్ చేస్తే.. ఇటీవల పవన్ చేసిన కామెంట్ల విషయంలో మాత్రం టీడీపీ ఇప్పటి వరకు స్పందించలేదు. అంతేకాదు.. అనుకున్న విధంగా కూడా స్పందన కూడా రాలేదు.
అదే విజయనగరం జిల్లాలో పర్యటించిన సమయంలో పవన్ ప్రజలను ఉద్దేశించి “ఒక్క ఛాన్స్ ఇవ్వండి. వైసీపీ నేతల అవినీతిని వెలుగులోకి తెస్తా.. అవినీతి రహిత పాలనను అందిస్తా” అని కామెంట్లు చేశారు. ఇవి యూత్లో బాగానే వైరల్ అయ్యాయి. కానీ, ఎటొచ్చీ.. టీడీపీ మాత్రంవీటిని పట్టించుకోక పోవడం.. కనీసం.. ఈ వ్యాఖ్యలకు మద్దతుగా ఎవరూ పెదవి విప్పలేదు. పరిణామాలను గమనిస్తే.. టీడీపీ ఈ స్లోగన్ విషయంలో అంతర్మథనం చెందుతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు పార్టీలు కలిసి.. ముందు వైసీపీపై పోరాటం చేయాలని అనుకున్నామని.. కానీ, ఇంతలోనే ఎన్నికల విషయంలో చేసిన ప్రకటన మాదిరిగా ఒక్క ఛాన్స్ అనేసరికి.. టీడీపీకి ఎక్కడో తేడా కొట్టిందని.. అందుకే సైలెంట్ అయిందని అంటున్నారు. మరి మున్ముందు దీనిపై క్లారిటీ వస్తుందో.. రాదో చూడాలి.
This post was last modified on November 16, 2022 12:16 pm
విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు.…
ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన సినిమాల లిస్టు తీస్తే ఖచ్చితంగా టాప్ త్రీలో ఉండే మూవీ అవతార్. మూడో భాగం…
ఫస్ట్ విడుదల కావాల్సిన బైకర్ హఠాత్తుగా వెనక్కు తగ్గడంతో శర్వానంద్ మరో సినిమా నారీనారీ నడుమ మురారి ముందుకు వచ్చేసింది.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై…
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…