జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా ఫైర్ ఉంటుంది. అంతో ఇంతో.. ఆయన చేసే కామెంట్లు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా యూత్లో అయితే.. పవన్ వ్యాఖ్యలకు మరింత డిమాండ్ ఉంది. పవన్ కొన్నిరోజుల కిందట వైసీపీ నేతలను ఉద్దేశించి నా.. కొడ..ల్లారా అంటూ చెప్పు చూపించిన విషయం తెలిసిందే. ఈ ఫొటోలు.. చాలా రోజుల వరకు కూడా.. వైరల్ అయ్యాయి. ఇక, ఆయన డైలాగులు కూడా అలానే యూత్లో ఫాలో అయ్యాయి. అలాంటి సందర్భాల్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాటిని ప్రచారం కల్పించింది టీడీపీనేననే వాదన వైసీపీ నేతల నుంచి వినిపించింది.
ఇది కూడా తీసిపారేయలేని వాస్తవమే. ఎందుకంటే టీడీపీ సోషల్ మీడియా నెట్ వర్క్ జోరు వేరుగా ఉంటుంది. సో.. పవన్ చేసిన వ్యాఖ్యలు.. ఆయన కామెంట్లను ఫొటోలను ఐ-టీడీపీనే ఎక్కువగా ప్రచారం చేసిందనడంలో సందేహం కనిపించడం లేదు. ఉభయ కుసలోపరిగా.. ప్రజాస్వామ్య పరిరక్షణకు రెండు పార్టీలు ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకున్న దరిమిలా.. రెండు పార్టీలు కలిసి ముందుకు సాగాలని భావించిన నేపథ్యంలో పవన్కు మైలేజీ వచ్చేలా ఐ-టీడీపీ చక్రం తిప్పడం తప్పని పించలేదు.
ఇక, ఇది జరిగిన తర్వాత… పవన్పై వైసీపీ నేతలు ఏమన్నా.. వెంటనే టీడీపీ నాయకులు రియాక్ట్ అయ్యారు. పవన్ మూడు పెళ్లిళ్ల విషయంపై వైసీపీ కౌంటర్లు ఇవ్వగానే టీడీపీ నేతలు రియాక్ట్ అయి.. వారికి రీ కౌంటర్లు ఇచ్చారు. అంటే.. మొత్తంగా.. పవన్కు మేమున్నామనే సంకేతాలను టీడీపీ పంపిం చిందనే చెప్పాలి. కట్ చేస్తే.. ఇటీవల పవన్ చేసిన కామెంట్ల విషయంలో మాత్రం టీడీపీ ఇప్పటి వరకు స్పందించలేదు. అంతేకాదు.. అనుకున్న విధంగా కూడా స్పందన కూడా రాలేదు.
అదే విజయనగరం జిల్లాలో పర్యటించిన సమయంలో పవన్ ప్రజలను ఉద్దేశించి “ఒక్క ఛాన్స్ ఇవ్వండి. వైసీపీ నేతల అవినీతిని వెలుగులోకి తెస్తా.. అవినీతి రహిత పాలనను అందిస్తా” అని కామెంట్లు చేశారు. ఇవి యూత్లో బాగానే వైరల్ అయ్యాయి. కానీ, ఎటొచ్చీ.. టీడీపీ మాత్రంవీటిని పట్టించుకోక పోవడం.. కనీసం.. ఈ వ్యాఖ్యలకు మద్దతుగా ఎవరూ పెదవి విప్పలేదు. పరిణామాలను గమనిస్తే.. టీడీపీ ఈ స్లోగన్ విషయంలో అంతర్మథనం చెందుతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు పార్టీలు కలిసి.. ముందు వైసీపీపై పోరాటం చేయాలని అనుకున్నామని.. కానీ, ఇంతలోనే ఎన్నికల విషయంలో చేసిన ప్రకటన మాదిరిగా ఒక్క ఛాన్స్ అనేసరికి.. టీడీపీకి ఎక్కడో తేడా కొట్టిందని.. అందుకే సైలెంట్ అయిందని అంటున్నారు. మరి మున్ముందు దీనిపై క్లారిటీ వస్తుందో.. రాదో చూడాలి.
This post was last modified on November 16, 2022 12:16 pm
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…