Political News

వైసీపీ మంత్రుల‌పై నాగ‌బాబు స‌టైర్లు

జ‌న‌సేన నాయ‌కుడు, ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు.. వైసీపీ నాయ‌కులు, ఏపీ ప్ర‌భుత్వంపై త‌ర‌చుగా స‌టైర్లు వేస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న మీడియా ముందుకంటే కూడా.. సోష‌ల్ మీడియా వేదిక ట్విట్ట‌ర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. మాట‌కు మాట‌! అన్న రేంజ్‌లో వైసీపీ నాయ‌కుల‌కు నాగ‌బాబు.. కౌంట‌ర్లు ఇస్తున్నారు. తాజాగా వైసీపీ నాయ‌కులు ప‌వ‌న్‌ను చంద్ర‌బాబు రాసిచ్చిన స్క్రిప్టు చ‌దువుతున్నాడు! అని కామెంట్లు చేశారు. దీనిపై ప‌వ‌న్ ఇంకా స్పందించ‌లేదు. కానీ, నాగ‌బాబు మాత్రం ఫైర్ అయ్యారు.

పవన్ ఏది మాట్లాడినా ఒకటికి పది సార్లు ఆలోచించి వివేకంతో మాట్లాడతారని జనసేన నేత నాగబాబు స్పష్టంచేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఆహ్వానించి పవన్‌తో మాట్లాడారని నాగబాబు పేర్కొన్నారు. వైసీపీ నుంచి ఏ ఒక్క‌రికైనా ఆహ్వానం అందిందా? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. మోడీ ముందు చేతులు క‌ట్టుకున్నది మీ నాయ‌కులేన‌ని.. మోడీ ముందు గ‌ర్వంగా త‌లెత్తుకున్న‌ది మా నాయ‌కుడేన‌ని వ్యాఖ్యానించారు.

పూర్తి పరిజ్ఞానం లేని కొందరు మంత్రులకు పార్టీ మారినప్పుడల్లా స్క్రిప్ట్ అందించినట్లే అందరికీ అందుతాయన్న భ్రమలో వైసీపీ నేతలున్నారని.. ప‌రోక్షంగా గ‌తంలో ప్ర‌జారాజ్యంలో ఉండి.. ఇప్పుడు వైసీపీలో ఉన్న నాయ‌కులు, మంత్రుల‌ను ఉద్దేశించి నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఆహ్వానించి పవన్‌తో మాట్లాడారని, పవన్ ఏది మాట్లాడినా ఒకటికి పది సార్లు ఆలోచించి వివేకంతో మాట్లాడతారని నాగబాబు స్పష్టంచేశారు.

పరిపాలన గాలికొదిలేసిన మంత్రులు, పవన్ కల్యాణ్ ఏం మాట్లాడారన్నది మాత్రం ..వాళ్లకు ఎందుకని ఆయన నాగ‌బాబు నిలదీశారు. ప్రధాన మంత్రితో ఏం మాట్లాడారో చెప్పాలని వైసీపీ మంత్రులు అడగడం వెనుక భయమో, అభద్రతా భావమో ఉన్నట్టు అర్థం అవుతోందని నాగబాబు ఎద్దేవా చేశారు. జనసేన ప్రభుత్వం వస్తే… అన్ని లెక్కలూ బయటికి తీస్తామని నాగబాబు హెచ్చరించారు. అందుకే .. వైసీపీ నేత‌ల వెన్నులో వ‌ణుకు మొద‌లైంద‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on November 15, 2022 7:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

27 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago