Political News

వైసీపీ మంత్రుల‌పై నాగ‌బాబు స‌టైర్లు

జ‌న‌సేన నాయ‌కుడు, ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు.. వైసీపీ నాయ‌కులు, ఏపీ ప్ర‌భుత్వంపై త‌ర‌చుగా స‌టైర్లు వేస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న మీడియా ముందుకంటే కూడా.. సోష‌ల్ మీడియా వేదిక ట్విట్ట‌ర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. మాట‌కు మాట‌! అన్న రేంజ్‌లో వైసీపీ నాయ‌కుల‌కు నాగ‌బాబు.. కౌంట‌ర్లు ఇస్తున్నారు. తాజాగా వైసీపీ నాయ‌కులు ప‌వ‌న్‌ను చంద్ర‌బాబు రాసిచ్చిన స్క్రిప్టు చ‌దువుతున్నాడు! అని కామెంట్లు చేశారు. దీనిపై ప‌వ‌న్ ఇంకా స్పందించ‌లేదు. కానీ, నాగ‌బాబు మాత్రం ఫైర్ అయ్యారు.

పవన్ ఏది మాట్లాడినా ఒకటికి పది సార్లు ఆలోచించి వివేకంతో మాట్లాడతారని జనసేన నేత నాగబాబు స్పష్టంచేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఆహ్వానించి పవన్‌తో మాట్లాడారని నాగబాబు పేర్కొన్నారు. వైసీపీ నుంచి ఏ ఒక్క‌రికైనా ఆహ్వానం అందిందా? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. మోడీ ముందు చేతులు క‌ట్టుకున్నది మీ నాయ‌కులేన‌ని.. మోడీ ముందు గ‌ర్వంగా త‌లెత్తుకున్న‌ది మా నాయ‌కుడేన‌ని వ్యాఖ్యానించారు.

పూర్తి పరిజ్ఞానం లేని కొందరు మంత్రులకు పార్టీ మారినప్పుడల్లా స్క్రిప్ట్ అందించినట్లే అందరికీ అందుతాయన్న భ్రమలో వైసీపీ నేతలున్నారని.. ప‌రోక్షంగా గ‌తంలో ప్ర‌జారాజ్యంలో ఉండి.. ఇప్పుడు వైసీపీలో ఉన్న నాయ‌కులు, మంత్రుల‌ను ఉద్దేశించి నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఆహ్వానించి పవన్‌తో మాట్లాడారని, పవన్ ఏది మాట్లాడినా ఒకటికి పది సార్లు ఆలోచించి వివేకంతో మాట్లాడతారని నాగబాబు స్పష్టంచేశారు.

పరిపాలన గాలికొదిలేసిన మంత్రులు, పవన్ కల్యాణ్ ఏం మాట్లాడారన్నది మాత్రం ..వాళ్లకు ఎందుకని ఆయన నాగ‌బాబు నిలదీశారు. ప్రధాన మంత్రితో ఏం మాట్లాడారో చెప్పాలని వైసీపీ మంత్రులు అడగడం వెనుక భయమో, అభద్రతా భావమో ఉన్నట్టు అర్థం అవుతోందని నాగబాబు ఎద్దేవా చేశారు. జనసేన ప్రభుత్వం వస్తే… అన్ని లెక్కలూ బయటికి తీస్తామని నాగబాబు హెచ్చరించారు. అందుకే .. వైసీపీ నేత‌ల వెన్నులో వ‌ణుకు మొద‌లైంద‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on November 15, 2022 7:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదే చెక్క‌కుర్చీ… అదే టేబుల్‌… ఐదోసారి సీఎం!

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయ‌కుడు అయినా.. ఒక్క‌సారి ముఖ్య‌మంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…

2 hours ago

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

3 hours ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

4 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

6 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

6 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

7 hours ago