Political News

వైసీపీ మంత్రుల‌పై నాగ‌బాబు స‌టైర్లు

జ‌న‌సేన నాయ‌కుడు, ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు.. వైసీపీ నాయ‌కులు, ఏపీ ప్ర‌భుత్వంపై త‌ర‌చుగా స‌టైర్లు వేస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న మీడియా ముందుకంటే కూడా.. సోష‌ల్ మీడియా వేదిక ట్విట్ట‌ర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. మాట‌కు మాట‌! అన్న రేంజ్‌లో వైసీపీ నాయ‌కుల‌కు నాగ‌బాబు.. కౌంట‌ర్లు ఇస్తున్నారు. తాజాగా వైసీపీ నాయ‌కులు ప‌వ‌న్‌ను చంద్ర‌బాబు రాసిచ్చిన స్క్రిప్టు చ‌దువుతున్నాడు! అని కామెంట్లు చేశారు. దీనిపై ప‌వ‌న్ ఇంకా స్పందించ‌లేదు. కానీ, నాగ‌బాబు మాత్రం ఫైర్ అయ్యారు.

పవన్ ఏది మాట్లాడినా ఒకటికి పది సార్లు ఆలోచించి వివేకంతో మాట్లాడతారని జనసేన నేత నాగబాబు స్పష్టంచేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఆహ్వానించి పవన్‌తో మాట్లాడారని నాగబాబు పేర్కొన్నారు. వైసీపీ నుంచి ఏ ఒక్క‌రికైనా ఆహ్వానం అందిందా? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. మోడీ ముందు చేతులు క‌ట్టుకున్నది మీ నాయ‌కులేన‌ని.. మోడీ ముందు గ‌ర్వంగా త‌లెత్తుకున్న‌ది మా నాయ‌కుడేన‌ని వ్యాఖ్యానించారు.

పూర్తి పరిజ్ఞానం లేని కొందరు మంత్రులకు పార్టీ మారినప్పుడల్లా స్క్రిప్ట్ అందించినట్లే అందరికీ అందుతాయన్న భ్రమలో వైసీపీ నేతలున్నారని.. ప‌రోక్షంగా గ‌తంలో ప్ర‌జారాజ్యంలో ఉండి.. ఇప్పుడు వైసీపీలో ఉన్న నాయ‌కులు, మంత్రుల‌ను ఉద్దేశించి నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఆహ్వానించి పవన్‌తో మాట్లాడారని, పవన్ ఏది మాట్లాడినా ఒకటికి పది సార్లు ఆలోచించి వివేకంతో మాట్లాడతారని నాగబాబు స్పష్టంచేశారు.

పరిపాలన గాలికొదిలేసిన మంత్రులు, పవన్ కల్యాణ్ ఏం మాట్లాడారన్నది మాత్రం ..వాళ్లకు ఎందుకని ఆయన నాగ‌బాబు నిలదీశారు. ప్రధాన మంత్రితో ఏం మాట్లాడారో చెప్పాలని వైసీపీ మంత్రులు అడగడం వెనుక భయమో, అభద్రతా భావమో ఉన్నట్టు అర్థం అవుతోందని నాగబాబు ఎద్దేవా చేశారు. జనసేన ప్రభుత్వం వస్తే… అన్ని లెక్కలూ బయటికి తీస్తామని నాగబాబు హెచ్చరించారు. అందుకే .. వైసీపీ నేత‌ల వెన్నులో వ‌ణుకు మొద‌లైంద‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on November 15, 2022 7:18 pm

Share

Recent Posts

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

11 minutes ago

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

3 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

4 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

5 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

5 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

6 hours ago