Political News

ఆ నేత‌ల‌కు చంద్ర‌బాబు వార్నింగ్ ఇచ్చేశారా…!

వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించాల‌ని.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాడాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌దే ప‌దే పిలుపునిస్తున్నారు. పార్టీ నాయకుల‌ను ముందుండి న‌డిపిస్తున్నారు. దీంతో పార్టీని అంటిపెట్టుకుని ఆది నుంచి ఉన్న నాయ‌కులు అంద‌రూ క‌దులుతున్నారు. వైసీపీ స‌ర్కారును నిల‌దీస్తున్నారు. అయితే.. 2017-18 మ‌ధ్య వైసీపీ నుంచి వ‌చ్చి టీడీపీలోచేరిన నాయ‌కులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. అప్ప‌ట్లో 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి వ‌చ్చి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

వీరిలో కొంద‌రికి మంత్రి ప‌దువులు కూడా ఇచ్చారు చంద్ర‌బాబు. అంతేకాదు.. గ‌త 2019 ఎన్నిక‌ల్లో వారంద‌రికీ టికెట్లు కూడా ఇచ్చారు. అయితే, వారిలో ఒక్క గొట్టిపాటి ర‌వి (అద్దంకి) త‌ప్ప‌.. అంద‌రూ ఓడిపోయారు. పోనీ.. పార్టీ త‌ర‌ఫున ఏమైనా వాయిస్ వినిపిస్తున్నారా? అంటే అది కూడా లేదు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారా ? ప్ర‌జా ఉద్యమాలు చేస్తున్నారా? అంటే అది కూడా లేదు. మ‌రి ఇంత‌కీ వారు ఏం చేస్తున్నారు? అంటే.. ఎవ‌రికి వారు అంత‌ర్గ‌తంగా మ‌ద‌న ప‌డుతున్నారు.

ఏమాత్రం బ‌య‌ట‌కు వ‌చ్చినా వారికి ప్ర‌భుత్వం నుంచి షాక్ త‌ప్ప‌ద‌నే సంకేతాలు ఇప్ప‌టికే వెళ్లాయ‌ని టీడీపీలో గుస‌గుస వినిపిస్తోంది. స‌రే.. ఎప్ప‌టి నుంచో వారు బ‌య‌ట‌కు రావ‌డం లేదు కదా.. ఇప్పుడు ఎందుకు వీరి గురించిన చ‌ర్చ వ‌చ్చిందంటే.. త్వ‌ర‌లోనే పార్టీలో నెంబ‌ర్ 2 నారా లోకేష్ పాద‌యాత్ర చేప‌డుతున్నారు. ఈయ‌న‌కు స‌హ‌క‌రించేందుకు జిల్లాల వారీగా క‌మిటీలువేస్తున్నారు. ఈ క‌మిటీల్లో జంపింగు నేత‌ల‌ను కూడా ఉంచాల‌ని చంద్ర‌బాబు భావించారు. దీనిపై తాజాగా చ‌ర్చ కూడా జ‌రిగింది.

అయితే.. ఒక‌రిద్ద‌రు నేత‌ల‌ను సంప్ర‌దించ‌గా.. వారు మౌనంగా ఉన్నారు. త‌మ‌కు ఎలాంటి బాధ్య‌త‌లు వ‌ద్ద‌ని, కావాలంటే.. కొంత ఖ‌ర్చుల‌కు స‌హ‌క‌రిస్తా మని చెప్పుకొచ్చారు. అంటే.. ప‌రోక్షంగా వారు పాద‌యాత్ర‌లో పాల్గొనేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో చంద్ర‌బాబు ఒక్క‌సారిగా ఫైర్ అయ్యార‌ట‌. భ‌య‌ప‌డుతూ.. ఎన్నాళ్లు కూర్చుంటారు ? అని నిల‌దీసిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. కానీ, నేత‌లు మాత్రం ఇప్పుడు తాము బ‌య‌ట‌కు వ‌స్తే.. ప్ర‌భుత్వం నుంచి మ‌రింత ఒత్తిడి పెరుగుతుంద‌ని, అది టీడీపీనే ఇబ్బంది పెడుతుంద‌ని అంటున్నారు. కానీ, చంద్ర‌బాబు మాత్రం వ‌చ్చితీరాల‌ని హుకుం జారీ చేశార‌ట‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on November 15, 2022 12:02 pm

Share

Recent Posts

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

24 minutes ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

36 minutes ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

52 minutes ago

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి…

4 hours ago

బండ్ల కూతురి పెళ్లికి రానిది పవన్ ఒకరే

బండ్ల గ‌ణేష్ అనే న‌టుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్ర‌లు చేసింది లేదు. న‌టుడిగా అత‌డిది గొప్ప కెరీర్ కాదు.…

5 hours ago

కవితకు… షర్మిలకు.. పోలికా?

కవితకు, షర్మిలకు మధ్య పోలిక పెట్టొద్దని ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత…

5 hours ago