వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాలని.. ప్రజల సమస్యలపై పోరాడాలని టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే పిలుపునిస్తున్నారు. పార్టీ నాయకులను ముందుండి నడిపిస్తున్నారు. దీంతో పార్టీని అంటిపెట్టుకుని ఆది నుంచి ఉన్న నాయకులు అందరూ కదులుతున్నారు. వైసీపీ సర్కారును నిలదీస్తున్నారు. అయితే.. 2017-18 మధ్య వైసీపీ నుంచి వచ్చి టీడీపీలోచేరిన నాయకులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. అప్పట్లో 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి వచ్చి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
వీరిలో కొందరికి మంత్రి పదువులు కూడా ఇచ్చారు చంద్రబాబు. అంతేకాదు.. గత 2019 ఎన్నికల్లో వారందరికీ టికెట్లు కూడా ఇచ్చారు. అయితే, వారిలో ఒక్క గొట్టిపాటి రవి (అద్దంకి) తప్ప.. అందరూ ఓడిపోయారు. పోనీ.. పార్టీ తరఫున ఏమైనా వాయిస్ వినిపిస్తున్నారా? అంటే అది కూడా లేదు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నారా ? ప్రజా ఉద్యమాలు చేస్తున్నారా? అంటే అది కూడా లేదు. మరి ఇంతకీ వారు ఏం చేస్తున్నారు? అంటే.. ఎవరికి వారు అంతర్గతంగా మదన పడుతున్నారు.
ఏమాత్రం బయటకు వచ్చినా వారికి ప్రభుత్వం నుంచి షాక్ తప్పదనే సంకేతాలు ఇప్పటికే వెళ్లాయని టీడీపీలో గుసగుస వినిపిస్తోంది. సరే.. ఎప్పటి నుంచో వారు బయటకు రావడం లేదు కదా.. ఇప్పుడు ఎందుకు వీరి గురించిన చర్చ వచ్చిందంటే.. త్వరలోనే పార్టీలో నెంబర్ 2 నారా లోకేష్ పాదయాత్ర చేపడుతున్నారు. ఈయనకు సహకరించేందుకు జిల్లాల వారీగా కమిటీలువేస్తున్నారు. ఈ కమిటీల్లో జంపింగు నేతలను కూడా ఉంచాలని చంద్రబాబు భావించారు. దీనిపై తాజాగా చర్చ కూడా జరిగింది.
అయితే.. ఒకరిద్దరు నేతలను సంప్రదించగా.. వారు మౌనంగా ఉన్నారు. తమకు ఎలాంటి బాధ్యతలు వద్దని, కావాలంటే.. కొంత ఖర్చులకు సహకరిస్తా మని చెప్పుకొచ్చారు. అంటే.. పరోక్షంగా వారు పాదయాత్రలో పాల్గొనేది లేదని స్పష్టం చేశారు. దీంతో చంద్రబాబు ఒక్కసారిగా ఫైర్ అయ్యారట. భయపడుతూ.. ఎన్నాళ్లు కూర్చుంటారు ? అని నిలదీసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, నేతలు మాత్రం ఇప్పుడు తాము బయటకు వస్తే.. ప్రభుత్వం నుంచి మరింత ఒత్తిడి పెరుగుతుందని, అది టీడీపీనే ఇబ్బంది పెడుతుందని అంటున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం వచ్చితీరాలని హుకుం జారీ చేశారట. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on November 15, 2022 12:02 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…