Political News

జ‌గ‌న్‌కు త్వరలో హాలీడేస్

ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌పై టీడీపీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో పవర్ హాలిడే, క్రాప్ హాలిడే, ఇప్పుడు ఆక్వా హాలిడే అమ‌లు చేస్తున్నార‌ని అన్నారు. ఇదే ప‌ద్ధ‌తి కొన‌సాగితే.. త్వ‌ర‌లోనే జ‌గ‌న్‌కు పొలిటిక‌ల్ హాలీడే ప్ర‌క‌టించ‌డం త‌థ్య‌మ‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌జలు కూడా దీనికోసం ఎదురు చూస్తున్నార‌ని చెప్పారు. ఇక జగన్ రెడ్డి హాలిడే తీసుకోవడం మాత్రమే మిగిలి ఉందని ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు.

ఆక్వా రంగాన్ని ఉద్ధరిస్తానని నమ్మించి దగా జగన్ దగా చేశాడన్నారు. ‘‘వైసీపీ ప్రభుత్వ అసమర్ధతతో ఆక్వారంగం సంక్షోభంలో పడింది. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, దాణా ఖర్చులు, నిర్వహణ ఖర్చులతో ఆక్వా రైతులు కుదేలయ్యారు. వంద కౌంట్ కిలో రొయ్య ఉత్పత్తికి రూ.270 ఖర్చవుతుంటే కనీసం రూ.200 కూడా రాక రైతులు ఆక్వా హాలిడే ప్రకటిస్తున్నారు. కొత్త చట్టాల పేరుతో ఆక్వా రైతులను, ప్రాసెసింగ్ ప్లాంట్స్ నిర్వహిస్తున్న వారిని వేధిస్తూ వైసీపీ నేతలు కోట్లు దండుకుంటున్నారు“ అని లోకేష్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఆక్వా రైతులను ఆదుకోవాలన్నారు. జోన్‌తో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికి యూనిట్ విద్యుత్‌ని రూ. 1.50 కే అందించాలి. దాణా, ఇతర సామాగ్రిని రాయితీకి ఇవ్వాలి. మద్దతు ధర ప్రకటించాలని లోకేష్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్ప‌టికే రాజ‌కీయాలు అధ్వాన్నంగా త‌యారు చేసిన ఘ‌న‌త వైసీపీకే ద‌క్కుతుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌తి విష‌యాన్నీ త‌మ స్వలాభం కోసం చూసుకుంటున్న వైసీపీ నాయ‌కుల‌కు ప్ర‌జ‌లు త్వ‌ర‌లోనే బుద్ధి చెబుతార‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on November 14, 2022 8:32 pm

Share

Recent Posts

లక్షల్లో తీసిన చెత్త సినిమా… కోట్లలో కలెక్షన్లు

ఒక చిన్న వేడుక చేయడానికే కనీసం లక్ష రూపాయలు ఖర్చయ్యే సొసైటీలో ఉన్నాం మనం. అలాంటిది కేవలం రెండు నుంచి…

30 minutes ago

రజిని సినిమాలో విలన్… రాపో పెద్ద రిస్కు?

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ధర్మన్ షూటింగ్ మంచి ఊపు మీద ఉంది. ఇప్పటికే…

1 hour ago

శ్రీలీల మిస్సయ్యింది మమిత సాధించింది

ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లు వస్తున్నారు. ఇరవై, పాతిక వయసు ఉన్న వాళ్లకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి. కానీ వాటిని ఎంచుకోవడం,…

1 hour ago

డీఎస్సీ నిర్వహణ సూపర్… లోకేష్ కు ఢిల్లీ మంత్రి అభినందనలు

రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షల నిర్వాహణపై ప్రతిపక్ష వైసీపీ రాద్దాంతం చేస్తున్న విషయం తెలిసిందే. ఆధారాలు లేకుండా…

3 hours ago

మూడో బిడ్డను కంటే సంవత్సరం సెలవు

దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతున్న జననాల రేటు నేపథ్యంలో కుటుంబాల్లో పిల్లల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ…

4 hours ago

వెంకీ త్రివిక్రమ్… ఇంకా ఆ ఒక్క కిక్ రాలేదే!

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదటిసారి కలిసి చేస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’. దీని మీద మంచి…

4 hours ago