ఏపీ సీఎం జగన్ తన మానస పుత్రికగా భావిస్తున్న కీలక పథకం ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జగనన్న ఇళ్ల కాలనీలను ఏర్పాటు చేసి.. ఇళ్లను నిర్మించే చర్యలు చేపట్టారు. అయితే, వేసిన లేఅవుట్లకు ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు వాటిలో కనీసం మార్కింగ్ కూడా వెయ్యలేదు. దీంతో ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన విజయనగరంలోని గుంకలాంలో పర్యటించి ఇక్కడి దుస్థితిని తెరమీదికి తెచ్చారు.
ఇక, రాష్ట్రవ్యాప్తంగా కాలనీల పరిస్థితిని తెలుసుకునేందుకు “జగనన్న ఇళ్లు – పేదల కన్నీళ్లు” కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. గుంటూరు, కర్నూలు, కోనసీమ, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో జగనన్న కాలనీల నిర్మాణ పనులను జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తాజాగా పరిశీలించారు. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో జగనన్న కాలనీల్లో కనీస సౌకర్యాలు లేవని..పేదలు ఇళ్లు ఎలా నిర్మిస్తారని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని.. జగనన్న కాలనీల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణం గురించి లబ్ధిదారులతో మాట్లాడారు.
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలో జగన్న కాలనీల్లో లబ్ధిదారులతో జనసైనికులు మాట్లాడారు. అప్పు చేసి ఇంటి నిర్మాణాలు చేపట్టారని కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇక, ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు నిర్వహించాలని జనసేన నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై మరింత వేడి పుట్టించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పనుల్లో అవినీతి చోటు చేసుకుందని ఇప్పటికే ఆరోపించిన పవన్.. వాటిని సాక్ష్యాధారాలతో సహా నిరూపించేలా తన కార్యకర్తలను ముందుకు నడిపిస్తున్నారు.
ఇదే జరిగితే.. రాష్ట్రంలో జగనన్న ఇళ్ల పథకంపై నీలినీడలు కమ్ముకునే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. దీనిపై అవసరమైతే.. కోర్టుకు కూడా వెళ్లాలని జనసేన నాయకులు నిర్ణయించుకున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందా? వెనుక కు వెళ్తుందా? అన్నది ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఈ ఇళ్లను ప్రధాన అస్త్రంగా చేసుకుని ముందుకు సాగాలని వైసీపీ నాయకులు నిర్ణయించుకున్న దరిమిలా అనూహ్యంగా జనసేన దీనిని రాజకీయ అస్త్రంగా మార్చుకోవడం వైసీపీకి మింగుడు పడని వ్యవహారమనే చెప్పాలి.
This post was last modified on November 14, 2022 10:26 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…