ఏపీ సీఎం జగన్ తన మానస పుత్రికగా భావిస్తున్న కీలక పథకం ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జగనన్న ఇళ్ల కాలనీలను ఏర్పాటు చేసి.. ఇళ్లను నిర్మించే చర్యలు చేపట్టారు. అయితే, వేసిన లేఅవుట్లకు ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు వాటిలో కనీసం మార్కింగ్ కూడా వెయ్యలేదు. దీంతో ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన విజయనగరంలోని గుంకలాంలో పర్యటించి ఇక్కడి దుస్థితిని తెరమీదికి తెచ్చారు.
ఇక, రాష్ట్రవ్యాప్తంగా కాలనీల పరిస్థితిని తెలుసుకునేందుకు “జగనన్న ఇళ్లు – పేదల కన్నీళ్లు” కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. గుంటూరు, కర్నూలు, కోనసీమ, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో జగనన్న కాలనీల నిర్మాణ పనులను జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తాజాగా పరిశీలించారు. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో జగనన్న కాలనీల్లో కనీస సౌకర్యాలు లేవని..పేదలు ఇళ్లు ఎలా నిర్మిస్తారని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని.. జగనన్న కాలనీల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణం గురించి లబ్ధిదారులతో మాట్లాడారు.
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలో జగన్న కాలనీల్లో లబ్ధిదారులతో జనసైనికులు మాట్లాడారు. అప్పు చేసి ఇంటి నిర్మాణాలు చేపట్టారని కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇక, ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు నిర్వహించాలని జనసేన నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై మరింత వేడి పుట్టించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పనుల్లో అవినీతి చోటు చేసుకుందని ఇప్పటికే ఆరోపించిన పవన్.. వాటిని సాక్ష్యాధారాలతో సహా నిరూపించేలా తన కార్యకర్తలను ముందుకు నడిపిస్తున్నారు.
ఇదే జరిగితే.. రాష్ట్రంలో జగనన్న ఇళ్ల పథకంపై నీలినీడలు కమ్ముకునే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. దీనిపై అవసరమైతే.. కోర్టుకు కూడా వెళ్లాలని జనసేన నాయకులు నిర్ణయించుకున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందా? వెనుక కు వెళ్తుందా? అన్నది ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఈ ఇళ్లను ప్రధాన అస్త్రంగా చేసుకుని ముందుకు సాగాలని వైసీపీ నాయకులు నిర్ణయించుకున్న దరిమిలా అనూహ్యంగా జనసేన దీనిని రాజకీయ అస్త్రంగా మార్చుకోవడం వైసీపీకి మింగుడు పడని వ్యవహారమనే చెప్పాలి.
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…
అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…