Political News

జ‌గ‌న్ ముద్దుబిడ్డ‌పై జ‌న‌సేన యుద్ధం?

ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న మాన‌స పుత్రిక‌గా భావిస్తున్న కీల‌క ప‌థ‌కం ‘న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు’. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జ‌గ‌న‌న్న ఇళ్ల కాల‌నీల‌ను ఏర్పాటు చేసి.. ఇళ్ల‌ను నిర్మించే చ‌ర్య‌లు చేప‌ట్టారు. అయితే, వేసిన లేఅవుట్ల‌కు ఏళ్లు గ‌డుస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు వాటిలో క‌నీసం మార్కింగ్ కూడా వెయ్య‌లేదు. దీంతో ఈ విష‌యాన్ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ రాజ‌కీయంగా వాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా ఆయ‌న విజ‌య‌న‌గ‌రంలోని గుంక‌లాంలో ప‌ర్య‌టించి ఇక్క‌డి దుస్థితిని తెర‌మీదికి తెచ్చారు.

ఇక‌, రాష్ట్రవ్యాప్తంగా కాల‌నీల ప‌రిస్థితిని తెలుసుకునేందుకు “జగనన్న ఇళ్లు – పేదల కన్నీళ్లు” కార్యక్రమాన్ని నిర్వహించాల‌ని నిర్ణ‌యించారు. గుంటూరు, కర్నూలు, కోనసీమ, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్‌ జిల్లాల్లో జగనన్న కాలనీల నిర్మాణ పనులను జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తాజాగా పరిశీలించారు. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో జగనన్న కాలనీల్లో కనీస సౌకర్యాలు లేవని..పేదలు ఇళ్లు ఎలా నిర్మిస్తారని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని.. జగనన్న కాలనీల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణం గురించి లబ్ధిదారులతో మాట్లాడారు.

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలో జగన్న కాలనీల్లో లబ్ధిదారులతో జనసైనికులు మాట్లాడారు. అప్పు చేసి ఇంటి నిర్మాణాలు చేపట్టారని కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇక‌, ఈ కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మ‌రో మూడు రోజుల పాటు నిర్వ‌హించాల‌ని జ‌న‌సేన నేత‌లు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వంపై మ‌రింత వేడి పుట్టించాల‌ని నిర్ణ‌యించారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఈ ప‌నుల్లో అవినీతి చోటు చేసుకుంద‌ని ఇప్ప‌టికే ఆరోపించిన ప‌వ‌న్.. వాటిని సాక్ష్యాధారాల‌తో స‌హా నిరూపించేలా త‌న కార్య‌క‌ర్త‌ల‌ను ముందుకు న‌డిపిస్తున్నారు.

ఇదే జ‌రిగితే.. రాష్ట్రంలో జ‌గ‌న‌న్న ఇళ్ల ప‌థ‌కంపై నీలినీడ‌లు క‌మ్ముకునే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. దీనిపై అవ‌స‌ర‌మైతే.. కోర్టుకు కూడా వెళ్లాల‌ని జ‌న‌సేన నాయ‌కులు నిర్ణ‌యించుకున్న నేప‌థ్యంలో వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఈ కార్య‌క్ర‌మం ముందుకు సాగుతుందా? వెనుక కు వెళ్తుందా? అన్న‌ది ఆస‌క్తిగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ఇళ్ల‌ను ప్ర‌ధాన అస్త్రంగా చేసుకుని ముందుకు సాగాల‌ని వైసీపీ నాయ‌కులు నిర్ణ‌యించుకున్న ద‌రిమిలా అనూహ్యంగా జ‌న‌సేన దీనిని రాజ‌కీయ అస్త్రంగా మార్చుకోవ‌డం వైసీపీకి మింగుడు ప‌డ‌ని వ్య‌వ‌హార‌మనే చెప్పాలి.

Satya

Recent Posts

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

55 minutes ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

1 hour ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

2 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

2 hours ago

పాజిటివ్ టాక్ ఉన్నా పనవ్వడం లేదా

బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…

2 hours ago

బీఆర్ఎస్ `బ్లెడ్` పాలిటిక్స్‌.. ఇంత అవ‌స‌ర‌మా?

తెలంగాణ‌లో రైతుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ముందుకు రావ‌డం లేద‌ని, ప్రాజెక్టుల‌కు నీటిని విడుద‌ల చేయ‌డం లేద‌ని ఆరోపిస్తూ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం…

2 hours ago