Somu Veerraju
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ముందు చేతులెత్తేశారా? కనీసం.. తనను తాను పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా విశాఖ పట్నం వచ్చిన ప్రధానితో భేటీ అయ్యేందుకు సోము వీర్రాజునేతృత్వంలో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ మోడీ దగ్గరకు వెళ్లింది. అయితే.. ఇక్కడ వీర్రాజుకు ఘోర పరాభవం ఎదురుకావడం గమనార్హం.
ప్రధాని మోడీ.. ఏపీ బీజేపీ చీఫ్ సోమును చూసి.. నీపేరేంటి? అని ప్రశ్నించేసరికి.. వీర్రాజుకు మైండ్ బ్లాంక్ అయినంత పని జరిగింది. ఆర్ఎస్ఎస్ వాదిగా.. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న సోము వీర్రాజు ఫేస్ ప్రధానికి తెలియకపోవడం.. చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. మీరు రాజకీయాలు కాకుండా ఏం చేస్తుంటారు..అని ప్రధాని ప్రశ్నించారు. అయితే, దీనికి సోము తడబడ్డారు. రాజకీయాలు కాకుండా ఏం చేస్తున్నారని అన్నారంటే.. ఏదో జరుగుతోందని భావించిన ఆయన తడబడ్డారు.
ఇక, రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయని ప్రధాని మోడీ ప్రశ్నించారు. దీంతో సోము వీర్రాజు ఎలాంటి తొట్రుపాటు లేకుండా.. 21 సర్! అని ఠక్కున సమాధానం చెప్పారట. కానీ, వాస్తవానికి రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. దీంతో పక్కనే ఉన్న పురందేశ్వరి వంటి నాయకులు. సరిదిద్దే ప్రయత్నం చేసి 26 సర్ అని ప్రధాని చెప్పారు. ఈ పరిణామాలతో ప్రధాని మోడీ ముందు సోము వీర్రాజు చేతులు ఎత్తేశారనే కామెంట్టు బీజేపీ నాయకుల మధ్య చర్చగా మారాయి.
This post was last modified on November 13, 2022 6:27 pm
నియోజకవర్గాల పునర్విభజన వేళ... దక్షిణాది రాష్ట్రాల నుంచి ఓ రకమైన భయాందోళన అయితే వ్యక్తం అవుతోంది. 2011 జనాభా లెక్కల…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక, ఆయన చేసిన చిత్రాల్లో అభిమానులను అత్యంత అలరించింది ఓజీనే. సినిమా…
ఈ ఏడాది దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. ఇటీవలే రిలీజైన…
ఏపీలో అధికార కూటమికి సారధ్యం వహిస్తున్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుధవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓ…
ఇటీవలే విడుదలైన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తమిళంలో ఓ మోస్తరుగా, తెలుగులో నీరసంగా రన్ అవుతోంది. ఫైనల్ గా ప్రదీప్…
శత్రువు, దేవి, దేవిపుత్రుడు, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన నిర్మాత..…