Political News

మునుగోడు ఉప ఎన్నిక‌ ఖ‌ర్చు 600 కోట్లు!

ఇటీవ‌ల ముగిసిన తెలంగాణ‌లోని మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక దేశ‌వ్యాప్తంగా ప్రాధాన్యం సంత‌రించుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య హోరాహోరీగా సాగిన ఈ ఉప ఎన్నిక‌లో డ‌బ్బులు వ‌ర‌ద‌లై పారాయి. ఓటుకు ఇంత‌ని అన్ని ప్ర‌ధాన పార్టీలు పంప‌కాలు చేశాయి. ఒక‌రికిమించి మ‌రొక‌రు అన్న విధంగా పార్టీలు ఓట‌ర్ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలోనే ఓటుకు వేల రూపాయ‌లు పందేరం చేశారు.

అయితే.. ఈ పంప‌కాల లెక్క‌లపై తాజాగా వివ‌రాలు వెలుగు చూశాయి. దీని ప్ర‌కారం.. 2ల‌క్షల మంది ఓట‌ర్లు ఉన్న మునుగోడులో అన్ని పార్టీలూ క‌లిపి.. 627 కోట్లు ఖ‌ర్చుచేసిన‌ట్టు తెలిసింది. ఫోర‌మ్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ అనే సంస్థ‌.. మునుగోడు ఉప ఎన్నిక‌లో పార్టీలు.. అభ్య‌ర్థులు చేసిన ఖ‌ర్చుల వివ‌రాల‌ను ఆరా తీసింది. ఈ అంచ‌నాల ప్ర‌కారం.. మునుగోడులో అన్ని పార్టీలూ క‌లిపి దాదాపు 627 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశాయ‌ట‌!

స‌ర్వేలో కీల‌క విష‌యాలు

*తాజాగా వెలుగు చూసిన స‌ర్వేలో మునుగోడులో ప్ర‌తి ఓట‌రుకు ఓటుకు స‌గ‌టున 9 వేల రూపాయ‌లు ఇచ్చిన‌ట్టు అయింది.

*దాదాపు 75 శాతం ఓట‌ర్ల‌కు ఈ సొమ్ములు అందాయి.

*ఓటుకు నోటు పంపిణీ.. ఎన్నిక‌ల రోజు కూడా కొన‌సాగింది

*ఓటుకు.. 9 వేల రూపాయ‌ల చొప్పున ఓట‌రు అందుకున్నారు.

*టీఆర్ఎస్ త‌మ‌కు ఐదు వేల రూపాయ‌లు ఇచ్చింద‌ని, బీజేపీ 4 వేల రూపాయ‌లు ఇచ్చిందని ఓట‌ర్లు బాహాటంగా చెప్ప‌డం గ‌మ‌నార్హం.

*75 శాతం ఓట‌ర్ల‌కు క‌నీసం ఒక్కొక్క‌రికీ 9 వేల రూపాయ‌లు అందింది.

*ఇక మ‌ద్యం ఏరులై పార‌డంతో దాదాపు 300 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ మ‌ద్యం పంప‌కాలే జ‌రిగాయి.

*పార్టీలు భారీ ఎత్తున ర్యాలీలు ఎన్నిక‌ల ప్ర‌చారాలు నిర్వ‌హించాయి. వీటికి వంద కోట్ల రూపాయ‌ల పైనే ఖ‌ర్చు అయింది.

*ఒక్కో ర్యాలీకి రెండున్న‌ర కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చు అనుకున్నా.. అన్ని పార్టీల‌వీ క‌లిపి 50 ర్యాలీల వ‌ర‌కూ జ‌రిగాయ‌ని, ఇలా చూస్తే 125 కోట్ల రూపాయ‌లు ఇలాంటి ప్ర‌చార ఆర్భాట ఖ‌ర్చులుంటాయ‌ని అంచ‌నా వేసింది. ఏతావాతా మునుగోడు ఖ‌ర్చు 627 కోట్ల రూపాయ‌ల‌ని ఈ సంస్థ లెక్క‌గ‌ట్టింది.

This post was last modified on November 13, 2022 9:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విశ్వక్ అర్థం చేసుకున్న ట్రెండ్ నిజమేనా

నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…

1 hour ago

సాయిపల్లవి బరిలో ఉంటే అవార్డ్ ఇవ్వాల్సిందే

హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…

2 hours ago

‘పవన్ హఠావో’ రచయిత మృతి కేసు మిస్టరీ వీడింది

“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…

3 hours ago

విన్యాసం మీదే బాక్సాఫీస్ ఆశలు

గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…

3 hours ago

ఇటు వివాదం… అటు ముహూర్తం

జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…

3 hours ago

కమల్ హీరో… రజినీ విలన్?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్‌ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…

4 hours ago