Political News

మునుగోడు ఉప ఎన్నిక‌ ఖ‌ర్చు 600 కోట్లు!

ఇటీవ‌ల ముగిసిన తెలంగాణ‌లోని మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక దేశ‌వ్యాప్తంగా ప్రాధాన్యం సంత‌రించుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య హోరాహోరీగా సాగిన ఈ ఉప ఎన్నిక‌లో డ‌బ్బులు వ‌ర‌ద‌లై పారాయి. ఓటుకు ఇంత‌ని అన్ని ప్ర‌ధాన పార్టీలు పంప‌కాలు చేశాయి. ఒక‌రికిమించి మ‌రొక‌రు అన్న విధంగా పార్టీలు ఓట‌ర్ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలోనే ఓటుకు వేల రూపాయ‌లు పందేరం చేశారు.

అయితే.. ఈ పంప‌కాల లెక్క‌లపై తాజాగా వివ‌రాలు వెలుగు చూశాయి. దీని ప్ర‌కారం.. 2ల‌క్షల మంది ఓట‌ర్లు ఉన్న మునుగోడులో అన్ని పార్టీలూ క‌లిపి.. 627 కోట్లు ఖ‌ర్చుచేసిన‌ట్టు తెలిసింది. ఫోర‌మ్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ అనే సంస్థ‌.. మునుగోడు ఉప ఎన్నిక‌లో పార్టీలు.. అభ్య‌ర్థులు చేసిన ఖ‌ర్చుల వివ‌రాల‌ను ఆరా తీసింది. ఈ అంచ‌నాల ప్ర‌కారం.. మునుగోడులో అన్ని పార్టీలూ క‌లిపి దాదాపు 627 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశాయ‌ట‌!

స‌ర్వేలో కీల‌క విష‌యాలు

*తాజాగా వెలుగు చూసిన స‌ర్వేలో మునుగోడులో ప్ర‌తి ఓట‌రుకు ఓటుకు స‌గ‌టున 9 వేల రూపాయ‌లు ఇచ్చిన‌ట్టు అయింది.

*దాదాపు 75 శాతం ఓట‌ర్ల‌కు ఈ సొమ్ములు అందాయి.

*ఓటుకు నోటు పంపిణీ.. ఎన్నిక‌ల రోజు కూడా కొన‌సాగింది

*ఓటుకు.. 9 వేల రూపాయ‌ల చొప్పున ఓట‌రు అందుకున్నారు.

*టీఆర్ఎస్ త‌మ‌కు ఐదు వేల రూపాయ‌లు ఇచ్చింద‌ని, బీజేపీ 4 వేల రూపాయ‌లు ఇచ్చిందని ఓట‌ర్లు బాహాటంగా చెప్ప‌డం గ‌మ‌నార్హం.

*75 శాతం ఓట‌ర్ల‌కు క‌నీసం ఒక్కొక్క‌రికీ 9 వేల రూపాయ‌లు అందింది.

*ఇక మ‌ద్యం ఏరులై పార‌డంతో దాదాపు 300 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ మ‌ద్యం పంప‌కాలే జ‌రిగాయి.

*పార్టీలు భారీ ఎత్తున ర్యాలీలు ఎన్నిక‌ల ప్ర‌చారాలు నిర్వ‌హించాయి. వీటికి వంద కోట్ల రూపాయ‌ల పైనే ఖ‌ర్చు అయింది.

*ఒక్కో ర్యాలీకి రెండున్న‌ర కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చు అనుకున్నా.. అన్ని పార్టీల‌వీ క‌లిపి 50 ర్యాలీల వ‌ర‌కూ జ‌రిగాయ‌ని, ఇలా చూస్తే 125 కోట్ల రూపాయ‌లు ఇలాంటి ప్ర‌చార ఆర్భాట ఖ‌ర్చులుంటాయ‌ని అంచ‌నా వేసింది. ఏతావాతా మునుగోడు ఖ‌ర్చు 627 కోట్ల రూపాయ‌ల‌ని ఈ సంస్థ లెక్క‌గ‌ట్టింది.

This post was last modified on November 13, 2022 9:51 pm

Share

Recent Posts

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

3 minutes ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

1 hour ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

1 hour ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

2 hours ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

3 hours ago

గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…

3 hours ago